Political News

మూడు నియోజకవర్గాలపైనే షర్మిల దృష్టి ?

తొందరలోనే రాజకీయపార్టీ పెట్టబోతున్న షర్మిల ప్రధానంగా మూడు నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టినట్లు సమాచారం. నిజనికి రాజకీయపార్టీనే ఇంకా షర్మిల పెట్టలేదు. ఇలాంటి సమయంలో ఆమె ఎక్కడి నుండి పోటీ చేస్తుందనే విషయంపై చర్చలు జరగటమంటే కాస్త విడ్డూరంగానే అనిపిస్తుంది. కానీ ఆమె ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తే బాగుంటుందనే విషయమై షర్మిలతో కొందరు సన్నిహితులు ఇఫ్పటకే ప్రస్తావన తెచ్చిందైతే వాస్తవం.

అందుకనే షర్మిల పోటీ చేయటానికి పరిశీలనలో ఉన్న నియోజకవర్గాలంటు మూడింటిపై చర్చలు జరుగుతున్నాయి. అవేమిటంటే మొదటిది సికింద్రాబాద్ నియోజకవర్గం. ఇక్కడే ఎందుకంటే ఈ నియోజకవర్గంలో క్రిస్తియన్ మైనారిటీలు బాగా ఎక్కువగా ఉన్నారు. అలాగే మెజారిటి ఓట్లు సీమాంధ్రులవే. ఈ కారణంతోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో సినీనటి జయసుధ సికింద్రాబాద్ నుండే పోటీచేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

ఇక మిగిలిన రెండు నియోజకవర్గాలు పాలేరు, ఖమ్మం. రెండు కూడా ఖమ్మం జిల్లాలోనివే. రెండు నియోజకవర్గాల్లోను సీమాంధ్రుల ప్రభావం చాలా ఎక్కువనే చెప్పాలి. నిజానికి జిల్లా మొత్తం మీద తెలంగాణా ప్రభావం చాలా తక్కువనే చెప్పాలి. అందుకనే కేసీయార్ కూడా ఈ జిల్లా గురించి చాలాకాలం పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఈ జిల్లాలో వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులు చాలా ఎక్కువమందున్నారు.

2014లో జగన్మోహన్ రెడ్డి ప్రచారంతో సంబంధం లేకుండానే ఖమ్మం ఎంపితో పాటు మూడు అసెంబ్లీ నియజకవర్గాల్లో వైసీపీ గెలవటం సంచలనమైంది. వైఎస్ పై ఇంతటి ఆధరణ ఉన్న జిల్లాలోనే షర్మిల పోటీ చేస్తే గెలుపు ఖాయమని కొందరు ఇప్పటికే సూచించారట. కాబట్టి షర్మిల కూడా ఇదే విషయమై ఆలోచిస్తున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

This post was last modified on March 18, 2021 9:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

5 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

7 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

7 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

9 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

9 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

10 hours ago