Political News

స్టాలిన్ హామీలపై ఆశ్చర్యపోతున్న జనాలు

డీఎంకే విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని హామీలను చూస్తే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఇచ్చిన హామీల్లో హిందు దేవాలయాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు ఆర్ధికసాయం, దేవాలయాలను పునర్నిర్మాణం లాంటి అనేక హామీలు ఉండటాన్ని చాలామంది నమ్మటంలేదు. ఎందుకంటే డీఎంకే పుట్టుకే నాస్తికవాదం పునాదులపై జరిగింది.

ద్రవిడపార్టీలు దేవాలయాలకు, పూజలకు, హైందవ సంప్రదాయాలకు దూరంగా ఉంటాయి. డీఎంకే కూడా దశాబ్దాల పాటు ఇదే పద్దతులను అనుసరిస్తోంది. అలాంటిది తాజాగా విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఆలయాల ఉద్దరణకు రూ. వెయ్యికోట్లుగా ప్రకటించారు. అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని అనుకునే వాళ్ళకు రూ. 25 వేలనుండి లక్ష రూపాయల ఆర్ధికసాయం చేస్తామన్నారు.

డీఎంకే చీఫ్ గా కరుణానిధి ఉన్నంత కాలం పార్టీ సిద్దాంతాలకు కట్టుబడున్నారు. ఆయన జీవితంలో ఒక్క దేవాలయాన్ని కూడా సందర్శించలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా ఎక్కడా పూజా కార్యక్రమంలో పాల్గొనలేదు. కనీసం స్వామీజీలతో కానీ పీఠాధిపతులను కూడా కలవలేదు. ఒకే ఒక్కసారి పుటపర్తి సాయిబాబాతో వేదికను పంచుకున్నారు. తమిళనాడులో దేవాలయాలకు కొదవేలేదు. అయినా ఏ దేవాలయం జోలికి వెళ్ళలేదు. చివరకు హిందు వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నం కూడా చేయలేదు.

తమిళనాడులో 43 వేల దేవాలయాలున్నాయి. వీటిల్లో కొన్ని జీర్ణావస్ధలో ఉన్నాయి. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీ ఇలాంటి దేవాలయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కమలంపార్టీ రాష్ట్రనేతలు తరచు దేవాలయాలను సందర్శించటం, హిందు సంఘాలతో సమావేశమవుతున్నారు. ఈ విషయాలను గ్రహించిన తర్వాతే స్టాలిన్ తన రూటును మార్చుకున్నట్లు అర్ధమవుతోంది. హిందువులను ప్రత్యేకంగా ఆకర్షించేందుకే మ్యానిఫెస్టోలో ప్రత్యేక హామీలిను ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. మరి మ్యానిఫెస్టో ఏ మేరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే.

This post was last modified on March 17, 2021 11:35 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

1 min ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

28 mins ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

40 mins ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

3 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

3 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

3 hours ago