Political News

టీడీపీ అంటే.. ఒక‌రి క‌ష్టం.. అంద‌రి సుఖ‌మా?

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ అంటే.. ఒక‌రు క‌ష్ట‌ప‌డితే.. మిగిలిన వారంతా ఎంజాయ్ చేయ‌డ‌మా? ప‌దవులు అనుభ వించేందుకు మాత్ర‌మే టీడీపీ నాయ‌కులు ఉంటారా? పార్టీని ముందుకు న‌డిపించ‌డంలోను., పార్టీని అభివృద్ధి చేయ‌డంలోను మాత్రం వారికి పాత్ర లేదా? అంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామాలు.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి త‌గిలిన ఎదురు దెబ్బ వంటి కీల‌క విష‌యాల నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క టీడీపీ అభిమానీ.. సంధిస్తున్న ప్ర‌శ్న‌లు ఇవే!

తాజా ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ప‌రాజ‌యం పాలైంది. రాజ‌ధాని అమ‌రావ‌తి ఎఫెక్ట్ జోరుగా ఉంటుంద‌ని. త‌మ గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని.. భావించిన విజ‌య‌వాడ‌, గుంటూరు కార్పొరేష‌న్ల‌లో పార్టీ బ‌క్కెట్ త‌న్నేసింది.

అయితే.. వాస్త‌వానికి ఈ రెండు న‌గ‌రాల్లోనూ నాయ‌కులు జోరుగా ఉన్నారు. గుంటూరులో అయితే.. ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ అన్నీతానై వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌లో అయితే.. ఎంపీ కేశినేని నాని ఏకంగా త‌న కుమార్తెనే.. మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించే వ‌ర‌కు ప‌ట్టుబ‌ట్టి సాధించారు. అయితే.. ఈ రెండు చోట్లా.. ఈ ఇద్ద‌రు ఎంపీలు కూడా విఫ‌ల‌మ‌య్యారు.

ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే.. పార్టీకి ఈ చివ‌ర నుంచి ఆ చివ‌రి వ‌ర‌కు.. నాయ‌కులు కోకొల్ల‌లుగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జులు ఉన్నారు. వీరిని కొన్ని నెల‌ల ముందు.. ముఖ్యంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని నియ‌మించారు.

అదేవిధంగా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జులు ఉన్నారు. మండ‌లాల క‌న్వీన‌ర్లు ఉన్నారు. వీరంద‌రితోనూ ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు నిత్యం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడుతూనే ఉన్నారు. పార్టీని ఎలా బ‌లోపేతం చేసుకోవాలో వివ‌రించారు. అదేస‌మ‌యంలో వారిలో ధైర్యం కూడా నూరిపోశారు. ఎక్క‌డా ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. అయితే.. ప‌లితం మాత్రం త‌ల‌కిందులు అయింది.

మ‌రి క్షేత్ర‌స్థాయిలో పార్టీకి అందివ‌స్తార‌ని భావించిన ఈ నాయ‌కులు ఇప్పుడు ఏమ‌య్యారు? ప‌ద‌వుల కోసం.. పోటీ ప‌డి.. మ‌రీ సాధించుకున్న నేతా గ‌ణం.. ఎందుకు విఫ‌ల‌మైంది. అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం రావాల్సి ఉంది. కేవ‌లం చంద్ర‌బాబు క‌ష్టంపైనే ఆధార‌ప‌డ్డారా? ఆయ‌నే అన్నీ చూసుకుంటారులే అనుకున్నారా? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లే టీడీపీ అభిమానుల‌ను వేధిస్తోంది. ఇలానే అయితే.. ఒక్క క‌ష్టం అంద‌రూ దోచుకోవ‌డ‌మే అవుతుంద‌ని అంటున్నారు.

This post was last modified on March 15, 2021 10:25 pm

Share

Recent Posts

ప్యాన్ ఇండియా సినిమాలకు ప్రాణ సంకటం

తెలుగు సినిమా స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్ కి చేరుకుందని ఒకవైపు మురిసిపోతూనే, ఇంకోవైపు చాలా విషయాల్లో ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు…

1 hour ago

బాధితులను వదిలేసి నిందితులకు పరమార్శేంటి జగన్?

శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజును జైల్లో ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. అప్ప‌ల‌రాజును…

8 hours ago

న‌న్ను రాజీనామా కోరే హ‌క్కు ఎవ‌రికీ లేదు: రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ఎవ‌రి ద‌యాదాక్షిణ్యాల‌పైనా తాను ముఖ్య‌మంత్రిని కాలేద‌ని.. 4 కోట్ల మంది ఓట‌ర్లు ఓటేసి త‌న‌ను గెలిపించుకున్నార‌ని.. వారి ఆశీర్వాదం,…

9 hours ago

‘పిల్లలను హాస్టల్లో వేస్తే… వాళ్ళు పెద్దలను ఓల్డేజ్ హోమ్ లలో వేస్తారు’

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి... పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా…

9 hours ago

చంద్రబాబు అన్నం తింటున్నాడా.. గడ్డి తింటున్నాడా: జగన్

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…

11 hours ago

ప్రమోషన్లకు పిలవలేదని హర్టయిన హీరోయిన్

తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఒకటి. ఎక్కువగా అగ్రెసివ్ క్యారెక్టర్లు…

12 hours ago