ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అంటే.. ఒకరు కష్టపడితే.. మిగిలిన వారంతా ఎంజాయ్ చేయడమా? పదవులు అనుభ వించేందుకు మాత్రమే టీడీపీ నాయకులు ఉంటారా? పార్టీని ముందుకు నడిపించడంలోను., పార్టీని అభివృద్ధి చేయడంలోను మాత్రం వారికి పాత్ర లేదా? అంటే.. తాజాగా జరిగిన పరిణామాలు.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి తగిలిన ఎదురు దెబ్బ వంటి కీలక విషయాల నేపథ్యంలో ప్రతి ఒక్క టీడీపీ అభిమానీ.. సంధిస్తున్న ప్రశ్నలు ఇవే!
తాజా ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది. రాజధాని అమరావతి ఎఫెక్ట్ జోరుగా ఉంటుందని. తమ గెలుపును ఎవరూ ఆపలేరని.. భావించిన విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో పార్టీ బక్కెట్ తన్నేసింది.
అయితే.. వాస్తవానికి ఈ రెండు నగరాల్లోనూ నాయకులు జోరుగా ఉన్నారు. గుంటూరులో అయితే.. ఎంపీ గల్లా జయదేవ్ అన్నీతానై వ్యవహరించారు. ఇక, విజయవాడ కార్పొరేషన్లో అయితే.. ఎంపీ కేశినేని నాని ఏకంగా తన కుమార్తెనే.. మేయర్ అభ్యర్థిగా ప్రకటించే వరకు పట్టుబట్టి సాధించారు. అయితే.. ఈ రెండు చోట్లా.. ఈ ఇద్దరు ఎంపీలు కూడా విఫలమయ్యారు.
ఇక, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే.. పార్టీకి ఈ చివర నుంచి ఆ చివరి వరకు.. నాయకులు కోకొల్లలుగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జులు ఉన్నారు. వీరిని కొన్ని నెలల ముందు.. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియమించారు.
అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జులు ఉన్నారు. మండలాల కన్వీనర్లు ఉన్నారు. వీరందరితోనూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నిత్యం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూనే ఉన్నారు. పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలో వివరించారు. అదేసమయంలో వారిలో ధైర్యం కూడా నూరిపోశారు. ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. అయితే.. పలితం మాత్రం తలకిందులు అయింది.
మరి క్షేత్రస్థాయిలో పార్టీకి అందివస్తారని భావించిన ఈ నాయకులు ఇప్పుడు ఏమయ్యారు? పదవుల కోసం.. పోటీ పడి.. మరీ సాధించుకున్న నేతా గణం.. ఎందుకు విఫలమైంది. అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. కేవలం చంద్రబాబు కష్టంపైనే ఆధారపడ్డారా? ఆయనే అన్నీ చూసుకుంటారులే అనుకున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలే టీడీపీ అభిమానులను వేధిస్తోంది. ఇలానే అయితే.. ఒక్క కష్టం అందరూ దోచుకోవడమే అవుతుందని అంటున్నారు.
This post was last modified on March 15, 2021 10:25 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…