Political News

పాతికేళ్ల అధిక్యానికి తెర.. టీడీపీ కంచుకోట బద్దలు

ఇక్కడ అక్కడ అన్న తేడా లేకుండా.. ఏపీలో ఎక్కడైనా సరే ఫ్యాన్ గాలి వీసిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై అదే పనిగా సాగిన విష ప్రచారాన్ని ప్రజలు నమ్మనట్లుగా కనిపిస్తోంది. తాజాగా వెల్లడైన మున్సిపల్ పోల్స్ లో గతంలో ఎప్పుడూ లేనంతగా టీడీపీ దారుణంగా దెబ్బ తింటే.. అధికార వైసీపీ మాత్రం విజయ దుందుబి మోగించింది. దీంతో.. పలు కొత్త రికార్డులు నమోదైన పరిస్థితి.

తూర్పుగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోటగా చెప్పే మండపేటలో తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 30 వార్డుల్లో 22 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. పాతికేళ్ల టీడీపీ అధిక్యానికి తెర దీస్తూ.. ఆ పార్టీకి చెందిన ఏడుగురు అభ్యర్థులు మాత్రమే గెలవటం గమనార్హం.

టీడీపీ పెట్టిన తర్వాత 1987లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మున్సిపల్ ఛైర్ పర్సన్ గా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కృష్ణార్జునచౌదరి సతీమణి ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీనే విజయాన్ని సొంతం చేసుకుంది. 1995.. 2000.. 2005.. 2014లో టీడీపీనే ఇక్కడ గెలుపొందింది. అందుకుభిన్నంగా ఈసారి మాత్రం ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు 10వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో.. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన గెలుపులో కీలకం మండపేట. అలాంటిది.. తాజాగా జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన ఇక్కడ పార్టీ ఓడిపోవటాన్ని తెలుగు తమ్ముళ్లు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఏపీలోని చాలా చోట్ల చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. కేవలం రెండున్నరేళ్ల వ్యవధిలో ఎంత మార్పు వచ్చిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

This post was last modified on March 15, 2021 10:18 am

Share

Recent Posts

హీరోపై విరుచుకుపడిన అత్తగారు

తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…

2 hours ago

ఈవెంట్లు ఒకటే కాదు… షూటింగులు కూడా జరగాలి

ఉమ్మడి రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయాక సినిమా పరిశ్రమకు సంబంధించిన చర్చలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల మధ్య ప్రస్తావనకు రావడం…

3 hours ago

వారణాసి నుండి రామాయణం వరకు… జక్కన్న విధ్వంసం!

తాను తీసే సినిమా కథ గురించి ఆరంభ దశలోనే మీడియాతో విశేషాలు పంచుకోవడం దర్శక ధీరుడు రాజమౌళికి అలవాటు. ‘ఆర్ఆర్ఆర్’…

4 hours ago

పవన్ – రాజు గారి గురించి జరగాల్సిన చర్చ వేరు!

ఏపీలో రెండు రోజుల క్రితం ఓ కీలక అదికారిక కార్యక్రమం జరిగింది. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ…

4 hours ago

అలియాస్ రుక్మిణి… నితిన్ దారిలో పడ్డాడు

ఒకప్పుడు యూత్ ఫుల్ హిట్లతో మంచి ఊపు మీద ఉన్న నితిన్ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో వేగంగా చేసిన సినిమాలు…

4 hours ago

ప్యారడైజ్ ప్రీమియర్లకు ఎంత పెంపు ఉంటుంది

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పాటు ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకున్న సినిమాగా…

4 hours ago