ఏపీలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి వస్తున్న వార్తలు కాస్త చిత్రంగా ఉంటున్నాయి. ఎవరికి అనుకూలంగా వారు రాసుకుంటున్నారు. అధికారపక్షం దెబ్బకు విపక్షాలకు అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఒకవేళ.. ఎవరైనా బరిలో ఉంటే వారికి చుక్కలు చూపిస్తున్న వైనం కథలు..కథలుగా వార్తల రూపంలో వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ అధికారపక్షానికి చెందిన సాక్షి పత్రికలో మరో విధమైన వార్తలు వస్తున్నాయి. విపక్ష టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారని.. అధికార పార్టీ నేతల్ని బెదిరిస్తున్నారని.. దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఎక్కడి సంగతేమో కానీ.. ఏపీలో విపక్ష నేతలకు అధికారపక్ష నేతల్ని ఎదిరించేంత సీన్ ఉందా? నిజంగా అలా ఉంటే సీఎం జగన్ ఊరుకుంటారా? నిజానికి జగన్ మాత్రమే కాదు..అధికారం చేతిలో ఉన్న ఏ ముఖ్యమంత్రి ఒప్పుకోరు. ఇలా..ఏపీ మీడియాలో వస్తున్న వార్తలు మహా చిత్రంగా ఉంటున్నాయి.
ఇలాంటివేళ.. ఆంధ్రజ్యోతి అధినేత ఆర్కే తాజాగా తన కాలమ్ లో విశాఖ ఎన్నికకు సంబంధించి.. సొంత పార్టీ నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వార్నింగ్ ఇచ్చారో వివరంగా రాసుకొచ్చారు. అందులో నిజం మాట ఏమిటన్న సందేహం ఒక పక్క.. పత్రికాధిపతి తన సొంత కాలమ్ లో రాసుకొచ్చిన విషయంలో అంతో ఇంతో నిజం ఉండకుండద ఉంటుందా? అన్నది మరో ప్రశ్న. ఇంతకూ విశాఖలో జరుగుతున్న నగర పాలక సంస్థ ఎన్నికల్లో విజయం కోసం జగన్ ఎంతలా ఆరాటపడుతున్న విషయాన్ని ఆర్కే తన కాలమ్ లో ఏం చెప్పారో ఆయన అక్షరాల్లోనే చూస్తే..
This post was last modified on March 7, 2021 2:42 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…