మాజీమంత్రి, విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎంఎల్ఏగా రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు వ్యవహారం ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున గంటా గెలిచినా పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు. ఇదే సమయంలో వైసీపీలో చేరటానికి మాజీమంత్రి విశ్వప్రయత్నాలు చేసుకుంటున్నారనే ప్రచారానికీ కొదవలేదు. అప్పుడప్పుడు బీజేపీలో చేరబోతున్నట్లు కూడా ప్రచారం అందరికీ తెలిసిందే.
గడచిన ఏడాదిన్నరగా ఇలాంటి ప్రచారాలు చాలానే జరుగుతున్నా గంటా మాత్రం ఎప్పుడూ బహిరంగంగా నోరిప్పలేదు. అలాంటిది తాజాగా వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనతో గంటా నోరిప్పాల్సొచ్చింది. గంటా ప్రధాన మద్దతుదారుల్లో ఒకరైన కాశీవిశ్వనాధ్ అండ్ కో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ గంటా కొన్ని ప్రతిపాదనలు పంపారన్నారు. వాటిని జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నారని చెప్పారు. జగన్ గనుక గ్నీన్ సిగ్నల్ ఇస్తే గంటా కూడా వైసీపీలో చేరే అవకాశం ఉందన్నారు.
విజయసాయి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనమైంది. ఎందుకంటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జరుగుతున్న సమయంలో వ్యాఖ్యలు చేయటంతో సహజంగానే బాగా వైరల్ అయ్యాయి. దాంతో గంటా తప్పనిసరిగా స్పందిచాల్సొచ్చింది. తాను జగన్ ముందు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదన్నారు. తనకసలు వైసీపీలో చేరే ఉద్దేశ్యమే లేదని చెప్పటంతో అందరు ఆశ్చర్యపోయారు.
అధికారంలో తప్ప ప్రతిపక్షంలో కూర్చోవటానికి గంట ఏమాత్రం ఇష్టపడరనే ప్రచారం అందరికీ తెలిసిందే. దీంతోనే గంటా వైసీపీలో చేరటానికి తీవ్ర ప్రయత్నాలు చేసుకున్నారట. అలాంటిది విజయసాయి ప్రకటనకు గంటా ఇచ్చిన కౌంటర్ ఇఫుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు గంటా ప్రతిపాదనలు పంపింది నిజమేనా ? పంపకపోతే పంపినట్లు విజయసాయి ఎందుకు చెప్పారనే ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. గంటా ఏమో విజయసాయి మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కొట్టిపారేశారు. మరి తాజాగా మొదలైన గంటా పంచాయితి ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాల్సిందే.
This post was last modified on March 4, 2021 11:15 am
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…
స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…