రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. బంధాలు, బాంధవ్యాలు కూడా రాజకీయాల్లో కనిపించడం లేదు. అన్నదమ్ములు సవాళ్లు చేసుకుంటున్నారు. తండ్రీ కూతుళ్లు కూడా ఎన్నికల్లో తలపడుతున్నారు. అయితే.. ఎంత దూకుడుగా రాజకీయాలు చేసినా.. మరీ అంత కుటుంబ సంబంధాలను తెంచేసుకుంటున్నారని అనలేం. ఎక్కడో ఒక చోట రాజీ పడుతున్నారు. అయితే.. వీటికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులు. ఈ విషయం శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. “అంత సీనియర్ అయి ఉండి.. అన్న కుటుంబానికే ఎసరు పెడుతున్నారే!” అని చర్చించుకుంటున్నారు.
విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరో 48 గంటల్లో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో స్పీకర్ సొంత జిల్లా శ్రీకాకుళం జిల్లాలోని తొగారాం పంచాయతీకి కూడా ఈ మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి ఇక్కడ ఎవరినీ పోటీకి లేకుండా చేసుకునేందుకు సీతారాం ఎంతో ప్రయత్నించారని అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. అయితే.. అనూహ్యంగా ఆయన సొంత అన్న దివంగత తమ్మినేని శ్యామలరావు సతీమణి.. భారతమ్మ నామినేషన్ వేశారు.
ఇక, ఇదే పంచాయతీ నుంచి తమ్మినేని సీతారాం సతీమణి.. తమ్మినేని వాణి వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇంత వరకు బాగానే ఉంది. ఒకే కుటుంబం అయినా.. బరిలో దిగారు కనుక .. ఎవరి దారిలో వారు ప్రచారం చేసుకుంటే.. ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ.. అనూహ్యంగా సీతారాం తెరచాటు రాజకీయాలకు వ్యూహం పన్నారని తెలుస్తోంది. తన సొంత సోదరుడి ఏకైక కుమారుడు.. భారతమ్మ బిడ్డను కుటుంబానికి దూరం చేసి.. తనవైపునకు తిప్పుకొన్నారట. దీంతో ఇప్పుడు భారతమ్మ కుటుంబంలో రాజకీయ చిచ్చు రగులుతోంది. ఆమె కుమారుడే.. ఎన్నికల ప్రచారానికి తల్లి తరఫున రంగంలోకి దిగేందుకు ముందుకు రావడం లేదు.
పైగా.. తల్లిని పోటీ నుంచి తప్పుకోవాలని నిత్యం గొడవ పడుతున్నారు. అయినా కూడా భారతమ్మ.. ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కానీ, ఆమె తరఫున ప్రచారం చేసేందుకు.. కనీసం.. ఆమె తరఫున జెండా మోసేందుకు కూడా ఎవరినీ రాకుండా సీతారాం అనధికారికంగా ఆదేశాలు జారీ చేశారట. దీంతో ఒంటరిగానే భారతమ్మ ప్రచారం చేస్తుండగా.. తమ్మినేని సతీమణి వాణి మాత్రం దాదాపు వెయ్యిమందితో భారీ ర్యాలీలు, ప్రచారార్భాటాలు చేస్తున్నారు. గెలుపు ఎవరిది అయినప్పటికీ.. అన్న కుటుంబాన్ని ఒంటరిని చేయడం.. కనీసం వదిన అనే మర్యాద కూడా లేకుండా సీతారాం రాజకీయాలు చేస్తుండడం శ్రీకాకుళం జనాలకు ఆగ్రహం తెప్పిస్తోందని అంటున్నారు. మరి ఇక్కడ భారతమ్మ గెలిస్తే.. కనుక సీతారాంకు పెద్ద ఎదురు దెబ్బేనని విశ్లేషణలు వస్తున్నాయి.
తమ భాషను, తమ సంస్కృతిని, తమ సామిత్యాన్ని గౌరవించుకోవడంలో మిగతా వాళ్లతో పోలిస్తే తెలుగు వాళ్లది ఎప్పుడూ వెనుకబాటే అన్న…
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…