Political News

అన్న కుటుంబానికి ఎస‌రు పెట్టిన త‌మ్మినేని కుటుంబం!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. బంధాలు, బాంధవ్యాలు కూడా రాజ‌కీయాల్లో క‌నిపించ‌డం లేదు. అన్న‌ద‌మ్ములు స‌వాళ్లు చేసుకుంటున్నారు. తండ్రీ కూతుళ్లు కూడా ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డుతున్నారు. అయితే.. ఎంత దూకుడుగా రాజ‌కీయాలు చేసినా.. మ‌రీ అంత కుటుంబ సంబంధాలను తెంచేసుకుంటున్నార‌ని అన‌లేం. ఎక్క‌డో ఒక చోట రాజీ ప‌డుతున్నారు. అయితే.. వీటికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం కుటుంబ సభ్యులు. ఈ విష‌యం శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. “అంత సీనియ‌ర్ అయి ఉండి.. అన్న కుటుంబానికే ఎస‌రు పెడుతున్నారే!” అని చ‌ర్చించుకుంటున్నారు.

విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. మ‌రో 48 గంట‌ల్లో మూడో ద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో స్పీక‌ర్ సొంత జిల్లా శ్రీకాకుళం జిల్లాలోని తొగారాం పంచాయ‌తీకి కూడా ఈ మూడో ద‌శ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వాస్త‌వానికి ఇక్క‌డ ఎవ‌రినీ పోటీకి లేకుండా చేసుకునేందుకు సీతారాం ఎంతో ప్ర‌య‌త్నించార‌ని అప్ప‌ట్లోనే గుస‌గుస‌లు వినిపించాయి. అయితే.. అనూహ్యంగా ఆయ‌న సొంత అన్న‌ దివంగ‌త‌ త‌మ్మినేని శ్యామ‌ల‌రావు స‌తీమ‌ణి.. భార‌త‌మ్మ నామినేష‌న్ వేశారు.

ఇక‌, ఇదే పంచాయ‌తీ నుంచి త‌మ్మినేని సీతారాం స‌తీమ‌ణి.. త‌మ్మినేని వాణి వైసీపీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థిగా రంగంలోకి దిగారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఒకే కుటుంబం అయినా.. బ‌రిలో దిగారు క‌నుక .. ఎవ‌రి దారిలో వారు ప్ర‌చారం చేసుకుంటే.. ఎలాంటి ఇబ్బందీ ఉండ‌దు. కానీ.. అనూహ్యంగా సీతారాం తెర‌చాటు రాజ‌కీయాల‌కు వ్యూహం ప‌న్నారని తెలుస్తోంది. త‌న సొంత సోద‌రుడి ఏకైక కుమారుడు.. భార‌త‌మ్మ బిడ్డ‌ను కుటుంబానికి దూరం చేసి.. త‌న‌వైపున‌కు తిప్పుకొన్నార‌ట‌. దీంతో ఇప్పుడు భార‌తమ్మ కుటుంబంలో రాజ‌కీయ చిచ్చు ర‌గులుతోంది. ఆమె కుమారుడే.. ఎన్నిక‌ల ప్ర‌చారానికి త‌ల్లి త‌ర‌ఫున రంగంలోకి దిగేందుకు ముందుకు రావ‌డం లేదు.

పైగా.. త‌ల్లిని పోటీ నుంచి త‌ప్పుకోవాల‌ని నిత్యం గొడ‌వ ప‌డుతున్నారు. అయినా కూడా భార‌త‌మ్మ‌.. ఎన్నికల ప్ర‌చారం చేస్తున్నారు. కానీ, ఆమె త‌ర‌ఫున ప్ర‌చారం చేసేందుకు.. క‌నీసం.. ఆమె త‌ర‌ఫున జెండా మోసేందుకు కూడా ఎవ‌రినీ రాకుండా సీతారాం అన‌ధికారికంగా ఆదేశాలు జారీ చేశారట‌. దీంతో ఒంట‌రిగానే భార‌తమ్మ ప్ర‌చారం చేస్తుండ‌గా.. త‌మ్మినేని స‌తీమ‌ణి వాణి మాత్రం దాదాపు వెయ్యిమందితో భారీ ర్యాలీలు, ప్ర‌చారార్భాటాలు చేస్తున్నారు. గెలుపు ఎవ‌రిది అయిన‌ప్ప‌టికీ.. అన్న కుటుంబాన్ని ఒంట‌రిని చేయ‌డం.. క‌నీసం వ‌దిన అనే మ‌ర్యాద కూడా లేకుండా సీతారాం రాజ‌కీయాలు చేస్తుండ‌డం శ్రీకాకుళం జ‌నాల‌కు ఆగ్ర‌హం తెప్పిస్తోంద‌ని అంటున్నారు. మ‌రి ఇక్క‌డ భార‌తమ్మ గెలిస్తే.. క‌నుక సీతారాంకు పెద్ద ఎదురు దెబ్బేన‌ని విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

This post was last modified on February 16, 2021 11:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

3 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

3 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

4 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

4 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

5 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

6 hours ago