Political News

బీజేపీ-జ‌న‌సేన పొత్తుకు బ్రేక్ ప‌డుతుందా? రీజ‌నేంటంటే

ఏపీలో బీజేపీ ప‌రిస్థితి నానాటికీ ఇబ్బందిగా మారుతోందా? ఒక‌వైపు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ యాల‌తో ప్ర‌జ‌ల్లో వ‌స్తున్న ఆగ్ర‌హాన్ని చ‌ల్లార్చ‌లేక నాయ‌కులు ఇబ్బంది ప‌డుతున్నారు. మ‌రోవైపు.. పొత్తు పెట్టుకున్న జ‌న‌సేన పార్టీ.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. త‌మ‌కు హ్యాండిచ్చేందుకురెడీ అవుతుండడం తో ఏం చేయాలో తెలియ‌ని ఓ సందిగ్ధ స్థితిలో బీజేపీ నేత‌లు కొట్టుమిట్టాడుతున్నార‌ని అంటున్నారు ప‌రి శీ ల‌‌కులు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల మ‌ద్య విస్తృతంగా ప‌ర్య‌టించిన బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు.. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ విష‌యం తెర‌మీదికి వ‌చ్చే స‌రికి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు క‌నీసం.. ఆయ‌న మీడియాముందుకు కూడా రావ‌డం మానేశారు.

మీడియా ముందుకు వ‌స్తే..విశాఖ ఉక్కుపై ఏం చెప్పాలో తెలియ‌క ఇబ్బంది ప‌డుతున్నారు. మ‌రోవైపు.. త‌మ‌తో పొత్తు పెట్టుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని పార్టీ జ‌న‌సేన‌.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుండ డం కూడాసోమును ఇబ్బంది పెడుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ తొలి విడ‌త ఎన్నిక‌ల్లో తూర్పు గోదావ‌రిలోని నాలుగు పంచాయ‌తీల్లో టీడీపీ మ‌ద్ద‌తుదారులుగా ఉన్న‌వారు గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. వీరికి క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన మద్ద‌తు దారులు స‌హ‌క‌రించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. వారు కూడా బ‌హిరంగంగానే తాము జ‌న‌సేన నేత‌ల నుంచి స‌హ‌కారం తీసుకున్నామ‌ని వివ‌రించారు. ఈ ప‌రిణామం.. బీజేపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మాతో పొత్తు పెట్టుకుని.. టీడీపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ఏంట‌నేది బీజేపీ నేత‌ల ప్ర‌శ్న‌. అయితే.. దీనికి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన కీల‌క నేత‌ల నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు. క‌నీసం వారు ఖండిచ‌లేదు. ఈ నేప‌థ్యంలో త‌మ‌కు ఎప్ప‌టికైనా జ‌న‌సేన‌తో ఇబ్బందేన‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు. తిరుపతి పార్ల‌మెంటు స్థానం ఉప ఎన్నిక‌లో జ‌న‌సేన‌కు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేయ‌క‌పోతే.. ఆ పార్టీ బీజేపీతో క‌లిసి న‌డిచేది లేద‌ని ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన సంకేతాలు వ‌స్తున్న ద‌రిమిలా.. పంచాయ‌తీల్లో ఇలాంటి ప‌రిణామాలు చోటు చేసుకోవడంతో పొత్తు విష‌యంపై క్లారిటీ కోసం బీజేపీ నాయ‌కులు త్వ‌ర‌లోనే పవ‌న్‌తో భేటీ కావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా.. బీజేపీకి ఇదొక సంక‌ట స్థితే అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రోవైపు టీడీపీ .. జ‌న‌సేన‌కు చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం కూడా వాస్త‌వంగానే క‌నిపిస్తోంది.

This post was last modified on February 14, 2021 11:23 am

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

2 hours ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

3 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

3 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

5 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

6 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

6 hours ago