ఒక ఎంఎల్ఏ ఎన్నిసార్లు తన పదవికి రాజీనామా చేస్తారు ? ఒక్కసారి మాత్రమే చేస్తారు. మహాఅయితే ముందు రాజీనామాను ప్రకటిస్తారు పరిస్దితులను బట్టి తర్వాత రాజీనామా చేసేస్తారు. కానీ విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు మాత్రం ఇప్పటికి మూడుసార్లు రాజీనామా చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకారణ నిర్ణయానికి నిరసనగా గంటా శుక్రవారం ఉదయం కార్మికనేతల సమక్షంలో స్పీకర్ ఫార్మాట్ మీద రాజీనామా చేయటం విచిత్రంగా ఉంది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం వెలుగు చూడగానే ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలు మొదలుపెట్టారు. వాళ్ళకి ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నేతలు మద్దతుగా నిలబడ్డారు. ఆందోళనకు మద్దతుగా అవసరమైతే రాజీనామాలు చేయటానికి తాము సిద్ధంగా ఉన్నామంటు టీడీపీ ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణ, వైసీపీ ఎంపిలు ఎంవివి సత్యనారాయణ, సత్యవతి ప్రకటించారు.
అయితే గడచిన ఏడాదిన్నరగా పెద్దగా ఎక్కడా కనబడని గంటా మాత్రం వెంటనే రాజీనామా చేసేశారు. తెల్లకాగితంపై తన రాజీనామా లేఖను రాసి స్పీకర్ కు పంపేశారు. దాంతో ఉక్కు ఆందోళనకు మద్దతుగా గంటా రాజీనామా చేసేశారంటూ ఒకటే ప్రచారం జరిగిపోయింది. అయితే గంటా రాజీనామా చెల్లదనే ప్రచారం మొదలైంది. దాంతో నాలుగు రోజుల తర్వాత విశాఖలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తన లెటర్ హెడ్ మీద రాజీనామా లేఖను రాసి పంపారు.
అయితే దీనిమీద కూడా ఆరోపణలు మొదలయ్యాయి. కండీషన్ రాజీనామాలను స్పీకర్ ఆమోదించరని పైగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేదన్నారు. రాజీనామా లేఖతో గంటా రాజకీయం చేస్తున్నారంటూ ఆరోపణలు మొదలయ్యాయి. దాంతో ఏమనుకన్నారో ఏమో శుక్రవారం ఉదయం ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర కార్మిక నేతలతో సమావేశం అయిన గంటా మూడోసారి స్పీకర్ ఫార్మాట్లో తన లెటర్ హెడ్ మీద మళ్ళీ రాజీనామా లేఖ రాశారు. దాన్ని స్పీకర్ కు లేకపోతే స్పీకర్ కార్యాలయానికి పంపే బాధ్యతను కూడా గంటా కార్మిక నేతలకే అప్పగించారు. ఒకే అంశంపై ఇంకా ఎన్నిసార్లు గంటా రాజీనామా చేస్తారో తెలీకుండా ఉంది
This post was last modified on February 12, 2021 11:39 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…