ఒక ఎంఎల్ఏ ఎన్నిసార్లు తన పదవికి రాజీనామా చేస్తారు ? ఒక్కసారి మాత్రమే చేస్తారు. మహాఅయితే ముందు రాజీనామాను ప్రకటిస్తారు పరిస్దితులను బట్టి తర్వాత రాజీనామా చేసేస్తారు. కానీ విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు మాత్రం ఇప్పటికి మూడుసార్లు రాజీనామా చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకారణ నిర్ణయానికి నిరసనగా గంటా శుక్రవారం ఉదయం కార్మికనేతల సమక్షంలో స్పీకర్ ఫార్మాట్ మీద రాజీనామా చేయటం విచిత్రంగా ఉంది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం వెలుగు చూడగానే ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలు మొదలుపెట్టారు. వాళ్ళకి ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నేతలు మద్దతుగా నిలబడ్డారు. ఆందోళనకు మద్దతుగా అవసరమైతే రాజీనామాలు చేయటానికి తాము సిద్ధంగా ఉన్నామంటు టీడీపీ ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణ, వైసీపీ ఎంపిలు ఎంవివి సత్యనారాయణ, సత్యవతి ప్రకటించారు.
అయితే గడచిన ఏడాదిన్నరగా పెద్దగా ఎక్కడా కనబడని గంటా మాత్రం వెంటనే రాజీనామా చేసేశారు. తెల్లకాగితంపై తన రాజీనామా లేఖను రాసి స్పీకర్ కు పంపేశారు. దాంతో ఉక్కు ఆందోళనకు మద్దతుగా గంటా రాజీనామా చేసేశారంటూ ఒకటే ప్రచారం జరిగిపోయింది. అయితే గంటా రాజీనామా చెల్లదనే ప్రచారం మొదలైంది. దాంతో నాలుగు రోజుల తర్వాత విశాఖలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తన లెటర్ హెడ్ మీద రాజీనామా లేఖను రాసి పంపారు.
అయితే దీనిమీద కూడా ఆరోపణలు మొదలయ్యాయి. కండీషన్ రాజీనామాలను స్పీకర్ ఆమోదించరని పైగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేదన్నారు. రాజీనామా లేఖతో గంటా రాజకీయం చేస్తున్నారంటూ ఆరోపణలు మొదలయ్యాయి. దాంతో ఏమనుకన్నారో ఏమో శుక్రవారం ఉదయం ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర కార్మిక నేతలతో సమావేశం అయిన గంటా మూడోసారి స్పీకర్ ఫార్మాట్లో తన లెటర్ హెడ్ మీద మళ్ళీ రాజీనామా లేఖ రాశారు. దాన్ని స్పీకర్ కు లేకపోతే స్పీకర్ కార్యాలయానికి పంపే బాధ్యతను కూడా గంటా కార్మిక నేతలకే అప్పగించారు. ఒకే అంశంపై ఇంకా ఎన్నిసార్లు గంటా రాజీనామా చేస్తారో తెలీకుండా ఉంది
This post was last modified on February 12, 2021 11:39 am
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…