Political News

పవన్ ఢిల్లీ పర్యటనతో ఉపయోగం ఉంటుందా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ప్రాధమిక సూత్రాన్ని ఎప్పుడో మరచిపోయినట్లున్నారు. ప్రశ్నించటానికే పార్టీ పెట్టినట్లు అప్పుడెప్పుడో చెప్పుకున్న పవన్ ఆ విషయాన్ని ఎప్పుడో పక్కన పడేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఉక్కు ఫ్యాక్టరీలోని ఉద్యోగులు, కార్మికులు రోడ్డెక్కితే వాళ్ళకు రాజకీయపార్టీల నేతలు మద్దతుగా నిలబడ్డారు.

రాజకీయపార్టీల నేతలు కూడా ఆందోళనల్లో పాల్గొంటుంటే బీజేపీ+జనసేన పార్టీల నేతలు మాత్రం ఎక్కడా కనబడటం లేదు. ఈ నేపధ్యంలోనే పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ ఢిల్లీకి వెళ్ళారు. అయితే రోగమొకటైతే మందు మరొకటన్నట్లుగా ఉంది పవన్ తీరు. ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్రమోడిది. దీనికి మోడి పెట్టుబడుల ఉపసంహరణ కమిటి అని మరోటని, ఇంకోటని ఏదో ముసుగు వేస్తున్నారు. మోడి తలచుకుంటే అవుతుంది లేకపోతే కాదంతే.

మరి ఢిల్లీకి వెళ్ళిన పవన్ కలవాల్సింది మోడిని మాత్రమే. అయితే జనసేనాని కలుస్తున్నది పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో పాటు పార్టీ సంస్ధాగత వ్యవహరాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను. అవకాశం ఉంటే ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా కలుస్తారట. అసలు వీళ్ళని కలవటం వల్ల ఏమీ ఉపయోగం ఉండదని అందరికీ తెలిసిందే. నిజానికి మోడిని కలిసినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు.

వ్యవసాయ చట్టాల విషయంలో గడచిన మూడు నెలలుగా ఏమి జరుగుతున్నదో అందరు చూస్తున్నదే. వేలాదిమంది రైతులు ఢిల్లీ శివార్లలో చేస్తున్న ఉద్యమంలో ఇఫ్పటికి సుమారు 58 మంది రైతులు చనిపోయారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని రైతులు ఢిల్లీ సరిహద్దులో అంత పెద్ద ఉద్యమం చేస్తున్నా పట్టించుకోని మోడి విశాఖపట్నం ఉక్కు ఉద్యమాన్ని పట్టించుకుంటారా అన్నదే అనుమానం. మరిలాంటి పరిస్ధితుల్లో పవన్ కలవాల్సింది మోడినే తప్ప మరోకళ్ళని కాదు. మోడిని తప్ప సంబంధం లేని వాళ్ళని కలిశాను, చర్చించానని చెప్పుకుంటే ప్రచారం కోసం తప్ప పవన్ ఢిల్లీ పర్యటన మరెందుకు పనికిరాదు.

This post was last modified on February 9, 2021 10:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago