కరోనా వైరస్కు సరైన మందు లేదంటే దాన్ని నివారించే వ్యాక్సిన్ వస్తే తప్ప దానిపై నియంత్రణ సాధించడం కష్టమని భావిస్తున్నారు. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు గట్టి కృషే చేస్తున్నాయి. శాస్త్రవేత్తలు, వైద్యులు నిర్విరామంగా దీనిపై పని చేస్తున్నారు. ఐతే వ్యాక్సిన్ కనుక్కోవడం అంత తేలికైన పని కాదని.. దానికి చాలా వ్యవధి పడుతుందని నిపుణులు చెప్పడం చూశాం.
మామూలుగా అయితే ఓ కొత్త వ్యాధికి వ్యాక్సిన్ కనుక్కోవడానికి నాలుగైదేళ్ల దాకా పట్టొచ్చని అంటారు. కానీ కరోనా ప్రభావం అసాధారణంగా ఉండటం, దీని వల్ల ప్రపంచమే స్తంభించిపోవడంతో పరిశోధనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. అలాగే వివిధ దశల్లో అనుమతులు కూడా వేగంగా ఇచ్చేస్తున్నారు. దీంతో తక్కువ సమయంలో వ్యాక్సిన్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మంచి న్యూస్ చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చేందుకు పలు ఫార్మాసూటికల్ కంపెనీల అధినేతలు తనను కలిశారని. శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డితో పాటు భారత్ బయోటెక్, మరో సంస్థ ప్రతినిధులు కూడా తనతో వైరస్ వ్యాప్తి, వ్యాక్సిన్ సంబంధిత పరిశోధనలపై తనతో మాట్లాడారని.. ఆగస్టుకల్లా వ్యాక్సిన్ రావొచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారని కేసీఆర్ వెల్లడించారు.
వరప్రసాద్ రెడ్డి అయితే ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో కరోనా వ్యాక్సిన్ రావడానికి కొన్నేళ్లు పడుతుందనే అన్నారు. తమ సంస్థ అయితే ఈ వ్యాక్సిన్ కోసం పరిశోధనలేమీ చేయట్లేదన్నారు. ఐతే భారత్ బయోటెక్ సీఈవో అయిన రేచస్ వీరేంద్రనాథ్ మాత్రం తమ సంస్థలో పరిశోధనలు ఉద్ధృతంగా సాగుతున్నట్లు చెప్పారు.
ఐతే కొత్త వ్యాధులకు మందు కనుగొనే విషయంలో భారత్కు అంత గొప్ప రికార్డేమీ లేదు. మనవాళ్లు కనుగొనే లోపు అమెరికా, ఐరోపా దేశాల్లో ఏవో ఒకటి ఆ పని పూర్తి చేస్తాయని భావిస్తున్నారు. ఏదేమైనా ఈ ఏడాది చివర్లోపు కరోనాకు మందు వస్తుందనే అంచనా వేస్తున్నారు.
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…