కరోనా వైరస్కు సరైన మందు లేదంటే దాన్ని నివారించే వ్యాక్సిన్ వస్తే తప్ప దానిపై నియంత్రణ సాధించడం కష్టమని భావిస్తున్నారు. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు గట్టి కృషే చేస్తున్నాయి. శాస్త్రవేత్తలు, వైద్యులు నిర్విరామంగా దీనిపై పని చేస్తున్నారు. ఐతే వ్యాక్సిన్ కనుక్కోవడం అంత తేలికైన పని కాదని.. దానికి చాలా వ్యవధి పడుతుందని నిపుణులు చెప్పడం చూశాం.
మామూలుగా అయితే ఓ కొత్త వ్యాధికి వ్యాక్సిన్ కనుక్కోవడానికి నాలుగైదేళ్ల దాకా పట్టొచ్చని అంటారు. కానీ కరోనా ప్రభావం అసాధారణంగా ఉండటం, దీని వల్ల ప్రపంచమే స్తంభించిపోవడంతో పరిశోధనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. అలాగే వివిధ దశల్లో అనుమతులు కూడా వేగంగా ఇచ్చేస్తున్నారు. దీంతో తక్కువ సమయంలో వ్యాక్సిన్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మంచి న్యూస్ చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చేందుకు పలు ఫార్మాసూటికల్ కంపెనీల అధినేతలు తనను కలిశారని. శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డితో పాటు భారత్ బయోటెక్, మరో సంస్థ ప్రతినిధులు కూడా తనతో వైరస్ వ్యాప్తి, వ్యాక్సిన్ సంబంధిత పరిశోధనలపై తనతో మాట్లాడారని.. ఆగస్టుకల్లా వ్యాక్సిన్ రావొచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారని కేసీఆర్ వెల్లడించారు.
వరప్రసాద్ రెడ్డి అయితే ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో కరోనా వ్యాక్సిన్ రావడానికి కొన్నేళ్లు పడుతుందనే అన్నారు. తమ సంస్థ అయితే ఈ వ్యాక్సిన్ కోసం పరిశోధనలేమీ చేయట్లేదన్నారు. ఐతే భారత్ బయోటెక్ సీఈవో అయిన రేచస్ వీరేంద్రనాథ్ మాత్రం తమ సంస్థలో పరిశోధనలు ఉద్ధృతంగా సాగుతున్నట్లు చెప్పారు.
ఐతే కొత్త వ్యాధులకు మందు కనుగొనే విషయంలో భారత్కు అంత గొప్ప రికార్డేమీ లేదు. మనవాళ్లు కనుగొనే లోపు అమెరికా, ఐరోపా దేశాల్లో ఏవో ఒకటి ఆ పని పూర్తి చేస్తాయని భావిస్తున్నారు. ఏదేమైనా ఈ ఏడాది చివర్లోపు కరోనాకు మందు వస్తుందనే అంచనా వేస్తున్నారు.
This post was last modified on May 7, 2020 6:23 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…