కరోనా వైరస్ నేపధ్యంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో కేంద్రప్రభుత్వం సరికొత్త పద్దతిని అమలు చేస్తోంది. మామూలుగా కేంద్ర ఆర్ధికమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టగానే దానికి సంబంధించిన కాపీలను పార్లమెంటులోని ఎంపిలందరికీ పంపిణీ చేస్తారు. ఆ తర్వాత మీడియాకు అందచేస్తారు. ఈ కాపీలనే పార్లమెంటు లైబ్రరీతో పాటు ఇతర వర్గాలకు కూడా అందుబాటులో ఉంచుతారు.
అయితే కరోనా వైరస్ కరాణంగా కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ చదివేందుకు కాపీని సిద్ధం చేశారు. మంత్రి చదవే కాపీని కూడా పుస్తకరూపంలో కాకుండా ట్యాబ్ లో లోడ్ చేశారు. కాబట్టి తాజా బడ్జెట్ కాపీల రూపంలో ఎవరికీ దొరకదు. ప్రధానమంత్రి నరేంద్రమోడితో పాటు కేంద్రమంత్రులకు, ఎంపిలకు కూడా బడ్జెట్ తాలూకు కాపీలను ఆన్ లైన్లోనే ఉంచారు.
అలాగే మీడియాకు సాఫ్ట్ కాపీల రూపంలోనే బడ్జెట్ ను అందుబాటులోకి తెస్తున్నారు. ఇక జనరల్ పబ్లిక్ కు మినీస్టీరియ్ యాప్ రూపంలో మొత్తం బడ్జెట్ ను అందుబాటులోకి తెచ్చారు. అంటే హోలు మొత్తం మీద చూస్తే ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా పేపర్ లెస్ బడ్జెట్ అన్న విషయం అర్ధమైపోయింది. వాస్తవాలు మాట్లాడుకుంటే ప్రతిసారి బడ్జెట్ కాపీలను వందల్లో ప్రింట్ చేయటమే కానీ దాన్ని పూర్తిగా చదవేంత సీన్ దాదాపు ఉండదు.
బడ్జెట్ కాపీలను దాదాపు 700 మంది ఎంపిలకు పంపిణీ చేస్తారు. వీరిలో ఎంతమంది ఎంపిలు బడ్జెట్ కాపీలను చదవుతారో అనుమానమే. బడ్డెట్ కాపీలను క్షుణ్ణంగా చదవి తర్వాత సమావేశాల్లో మాట్లాడాలి. కానీ చాలామంది చదవరు, సమావేశాల్లో నోరిప్పరు. కాబట్టి ఇంతకాలం బడ్జెట్ కాపీల ప్రింటింగ్ పేరుతో డబ్బు దండగ చేసిందనే అనుకోవాలి. కాకపోతే ఈ మాటను ఎంపిలు అంగీకరించకపోవచ్చు. కారణం ఏదైనా కానీండి బడ్జెట్ కాపీల ప్రింటింగ్ కు బ్రేక్ పడిందన్నది వాస్తవం.
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…