Political News

కొత్త పద్దతిలో బడ్జెట్ కాపీలు

కరోనా వైరస్ నేపధ్యంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో కేంద్రప్రభుత్వం సరికొత్త పద్దతిని అమలు చేస్తోంది. మామూలుగా కేంద్ర ఆర్ధికమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టగానే దానికి సంబంధించిన కాపీలను పార్లమెంటులోని ఎంపిలందరికీ పంపిణీ చేస్తారు. ఆ తర్వాత మీడియాకు అందచేస్తారు. ఈ కాపీలనే పార్లమెంటు లైబ్రరీతో పాటు ఇతర వర్గాలకు కూడా అందుబాటులో ఉంచుతారు.

అయితే కరోనా వైరస్ కరాణంగా కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ చదివేందుకు కాపీని సిద్ధం చేశారు. మంత్రి చదవే కాపీని కూడా పుస్తకరూపంలో కాకుండా ట్యాబ్ లో లోడ్ చేశారు. కాబట్టి తాజా బడ్జెట్ కాపీల రూపంలో ఎవరికీ దొరకదు. ప్రధానమంత్రి నరేంద్రమోడితో పాటు కేంద్రమంత్రులకు, ఎంపిలకు కూడా బడ్జెట్ తాలూకు కాపీలను ఆన్ లైన్లోనే ఉంచారు.

అలాగే మీడియాకు సాఫ్ట్ కాపీల రూపంలోనే బడ్జెట్ ను అందుబాటులోకి తెస్తున్నారు. ఇక జనరల్ పబ్లిక్ కు మినీస్టీరియ్ యాప్ రూపంలో మొత్తం బడ్జెట్ ను అందుబాటులోకి తెచ్చారు. అంటే హోలు మొత్తం మీద చూస్తే ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా పేపర్ లెస్ బడ్జెట్ అన్న విషయం అర్ధమైపోయింది. వాస్తవాలు మాట్లాడుకుంటే ప్రతిసారి బడ్జెట్ కాపీలను వందల్లో ప్రింట్ చేయటమే కానీ దాన్ని పూర్తిగా చదవేంత సీన్ దాదాపు ఉండదు.

బడ్జెట్ కాపీలను దాదాపు 700 మంది ఎంపిలకు పంపిణీ చేస్తారు. వీరిలో ఎంతమంది ఎంపిలు బడ్జెట్ కాపీలను చదవుతారో అనుమానమే. బడ్డెట్ కాపీలను క్షుణ్ణంగా చదవి తర్వాత సమావేశాల్లో మాట్లాడాలి. కానీ చాలామంది చదవరు, సమావేశాల్లో నోరిప్పరు. కాబట్టి ఇంతకాలం బడ్జెట్ కాపీల ప్రింటింగ్ పేరుతో డబ్బు దండగ చేసిందనే అనుకోవాలి. కాకపోతే ఈ మాటను ఎంపిలు అంగీకరించకపోవచ్చు. కారణం ఏదైనా కానీండి బడ్జెట్ కాపీల ప్రింటింగ్ కు బ్రేక్ పడిందన్నది వాస్తవం.

This post was last modified on February 1, 2021 11:32 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ఎన్నిక‌ల‌కు ముందే ఆ రెండు ఖాయం చేసుకున్న టీడీపీ?

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల పోరు ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే. వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య నిప్పులు చెరుగుకునే…

57 mins ago

సైడ్ ఎఫెక్ట్స్ మాట నిజమే.. కోవిషీల్డ్!

కరోనా వేళ అపర సంజీవిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన…

2 hours ago

తారక్ హృతిక్ జోడి కోసం క్రేజీ కొరియోగ్రాఫర్

జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తారక్…

2 hours ago

పుష్ప 2 ఖాతాలో అరుదైన ఘనత

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు…

3 hours ago

ఏక్ష‌ణ‌మైనా.. ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌.. రంగం రెడీ?

దేశ రాజ‌ధాని ఢిల్లీ కూడా ఒక రాష్ట్ర‌మేన‌ని అంద‌రికీ తెలిసిందే. ఇక్క‌డ చిత్ర‌మైన ప‌రిస్థితి ఉంది. ఇది కేంద్ర పాలిత…

4 hours ago

మృణాల్‌కు ముద్దు భయం

ఈ మధ్యే ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో పలకరించింది మృణాల్ ఠాకూర్. తెలుగులో చేసిన గత రెండు చిత్రాలతో పోలిస్తే.. ఇందులో…

13 hours ago