పవన్ నోట సరికొత్తగా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యాఖ్యలు అనూహ్యంగా దొర్లాయి. కాపులకు అండగా ఉంటానని.. వారి సమస్యలను పరిష్కరించే బాధ్యతను తీసుకుంటానని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. కాపుల విషయంలో కన్నీరు పెట్టుకున్నంత పనిచేశారు. వారు అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారని.. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్ట అయినా.. కాపులను ఓటు బ్యాంకు కోణంలోనే చూసిందని.. వారికి అండగా నిలిచిన వారు ఏ ఒక్కరూ లేరని కూడా పవన్ వ్యాఖ్యానించారు. ఇకపై తాను కాపులకు అన్ని విధాలా అండగా నిలుస్తానని.. జనసేన కూడా వారికి దన్నుగా ఉంటుందని చెప్పుకొచ్చారు.
అయితే.. పవన్లో ఈ అనూహ్య పరిణామం.. ఒక్కసారిగా కనిపించడం.. సంచలనంగా మారింది. వాస్తవానికి తాను కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతే అయినప్పటికీ.. తాను స్వయంగా సొంత పార్టీ పెట్టుకుని దాదాపు ఎనిమిదేళ్లు అవుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు కాపు అజెండాను అందుకోలేక పోయారు. తనకు కులంలేదు.. మతం లేదు.. అంటూ..వ్యాఖ్యలు సంధించారు. అంతేకాదు.. తనకు ఒక కులానికి కట్టేయ వద్దని కూడా చెప్పుకొచ్చారు. ఈ పరిణామం.. గత ఏడాది ఎన్నికల సమయంలో తీవ్ర ప్రభావం చూపించింది. అయినా.. పవన్లో ఎలాంటి మార్పూ రాలేదు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు కాపుల భజన ప్రారంభించారు. మరి దీనివెనుక ఏం జరిగింది? రాత్రికి రాత్రి ఇంత మార్పు ఎలా వచ్చింది? ఇదీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ.
ఇటీవల హైదరాబాద్లో చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబులతో పవన్ భేటీ అయ్యారని సమాచారం. ఈ సందర్భంగా పార్టీ పరిస్థితిని తొలిసారి.. చిరంజీవి ప్రస్థావించారని తెలిసింది. ఈ క్రమంలోనే కీలకమైన కాపు సామాజిక వర్గాన్ని వదిలేసి.. విన్యాసం చేయడం సరికాదని.. వైసీపీకి రెడ్లు, టీడీపీకి కమ్మలు ఉన్నారు కనుక.. నీకు(పవన్) కాపుల అండ ఉంచుకోవడం మంచిదని.. ఈ విషయంలో ఇప్పటికే చేసిన తప్పులను సరిచేసుకోవాలని, జారిపోకుండా చూసుకోవాలని చిరు గట్టిగానే క్లాస్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మరో వైపు తన మిత్ర పక్షం బీజేపీ.. కాపులను చేరదీసేందుకు నానాప్రయాస పడుతోంది. ఈ పరిణామాలను గ్రహించిన పవన్.. తన దృక్ఫథాన్ని మార్చుకుని కాపులను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ పరిణామం.. ముందుగానే చేసి ఉంటే.. అన్నో ఇన్నో సీట్లు వచ్చేవరి అంటున్నారు కూడా! మరి ఇప్పటికైనా పవన్ కళ్లు తెరిచారని అనుకోవాలా?! లేక.. అన్న ఒత్తిడితో ఇలా మారారా.. ! చూడాలి .. ఏం జరుగుతుందో!!
This post was last modified on January 30, 2021 9:39 pm
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…