ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. జనసేన పార్టీకి చిరంజీవి నైతిక మద్దతు ఉందని, తమ్ముడి వెంట అన్న నడవబోతున్నారని, తమ్ముడికి అండగా ఉంటానని చిరు స్పష్టమైన హామీ ఇచ్చారని ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. దీంతో చిరు జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఈ విషయంపై మీడియా వివిధ కోణాల్లో కథనాలు వెలువరిస్తున్న నేపథ్యంలో పవన్ సైతం దీనిపై స్పందించక తప్పలేదు.
విజయవాడలో కాపు సంక్షేమ సేన సమావేశం సందర్భంగా ఓ విలేకరి చిరుపై నాదెండ్ల వ్యాఖ్యలపై జనసేననానిని ప్రశ్నించారు. దీనికి పవన్ బదులిస్తూ.. చిరంజీవి ఎప్పుడూ నా మేలు కోరే ఏదైనా చెబుతారు. తమ్ముడిగా నా విజయాన్ని ఆయన కోరుకుంటారు. మనస్ఫూర్తిగా నా విజయాన్ని కాంక్షించే వ్యక్తి ఆయన. దాన్ని అలాగే చూడాలి. ఆయన పార్టీలోకి వస్తారా లేదా అన్నది ఈ రోజే చెప్పలేను. అది చిరంజీవి గారి అభిప్రాయం అని పవన్ పేర్కొన్నాడు.
మరోవైపు కాపులకు వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న అన్యాయంపై పవన్ మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో 27 శాతం ఉన్న కాపులను ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులాల కార్పొరేషన్లు ఆయా వర్గాలకు తాయిలాలే అని.. ఆయా వర్గాల నేతలు రాజకీయ సాధికారిత వైపు చూడకుండా చేసే పన్నాగమే ఈ కార్పొరేషన్ల ఏర్పాటని పవన్ వ్యాఖ్యానించాడు. తనను ఒక కులానికి ప్రతినిధిగా చూడొద్దని, తాను అందరి వాడినని పవన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
This post was last modified on January 30, 2021 10:25 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…