Political News

ప్ర‌జానాడిని ప‌ట్ట‌లేని బీజేపీ-జ‌న‌సేన‌లు!!

ప్ర‌జ‌ల నాడిని ప‌ట్ట‌డంలో బీజేపీ-జ‌న‌సేన ఐక్య కూట‌మి విఫ‌ల‌మైందా? ప‌్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా అడుగులు వేయ‌లేక పోతోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు. తిరుప‌తి ఉప ఎన్నిక‌కు సంబంధించి.. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ‌ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌త్న‌ప్ర‌భ ను రంగంలోకి దింపాల‌ని ఇరు పార్టీలు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. దీనికి ఆమెను సంప్ర‌దించే ప‌నిని కూడా వేగం చేశారు. అయితే.. ఈ విష‌యంలో గ‌త ఎన్నిక‌ల అనుభ‌వం ఏం చెబుతోంద‌న్న‌ది కీల‌కంగా మారింది. గ‌తంలో 2019 ఎన్నిక‌ల్లో ఐపీఎస్‌, ఐఆర్ఎస్ ఉద్యోగుల‌కు చాలా పార్టీలు టికెట్లు ఇచ్చాయి. అయితే.. వారంతా ఓడిపోయారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ప్ర‌భుత్వం ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న‌ప్ప‌టికీ.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస‌రికి .. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌డం ముఖ్యం.

ఈ విష‌యంలో ప్ర‌భుత్వ ప‌రిధిలో ఉన్న ఉద్యోగులుగా గుర్తింపు ఉన్న వారు గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జాక్షేత్రంలోకి దిగినా.. ప్ర‌జ‌లు వారిని ఓన్ చేసుకోలేక పోయారు. అధికారుల‌కు-ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య ఉన్న గ్యాప్ కావొచ్చు.. లేదా మ‌రేదైనా విష‌యం కావొచ్చు. విశాఖ ప‌ట్నం పార్ల‌మెంటు స్థానం నుంచి సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ జ‌న‌సేన టికెట్‌పై పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.

ఇక‌, వైసీపీ నుంచి గుంటూరు వెస్ట్ ప‌రిధిలో పోటీ చేసిన మాజీ ఐపీఎస్ అధికారి చంద్ర‌గిరి ఏసుర‌త్నం ప‌రిస్థితి కూడా ఇంతే. అదేవిదంగా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన మాజీ అధికారి.. మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్ కూడా ప‌రాజ‌యం మూట‌గ‌ట్టు కున్నారు. ఇక‌, 2014లో విజ‌యం సాధించిన మాజీ ఐఆర్ ఎస్ అధికారి రావెల కిశోర్ బాబు.. గ‌త ఎన్నిక‌ల్లో డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేక పోయారు.

అదేస‌మ‌యంలో డాక్ట‌ర్లుగా ఉండి.. పొలిటీషియ‌న్లుగా రంగంలోకి దిగిన వారు విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాలను గ‌మ‌నిస్తే.. గ‌తానికి భిన్నంగా ప్ర‌జ‌లు ఆలోచిస్తున్నార‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. దీంతో టీడీపీ, వైసీపీలు చాలా జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తున్నాయి. ప్ర‌జ‌ల‌తో సంబంధాలు ఉన్న‌ప్ప‌టికీ.. అధికారుల‌కు అవ‌కాశం ఇచ్చే విష‌యంలో ఈ రెండు పార్టీలూ అంత‌ర్గ‌త మ‌థ‌నం చేస్తున్నాయి. కానీ, ఇప్పుడు జ‌న‌సేన‌-బీజేపీ ద్వ‌యం మాత్రం మ‌ళ్లీ మాజీ ఐఏఎస్ అధికారిణిని రంగంలోకి దింపేందుకు, అందునా.. కీల‌క‌మైన తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేయించేందుకు సిద్ధ‌ప‌డ‌డం అంటే.. కోరి కోరి .. ఓట‌మిని కొని తెచ్చుకోవ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ విష‌యంలో త‌మ ఆలోచ‌న‌ను ఇలానే కొన‌సాగిస్తారో.. లేక ఇక్క‌డితో ఫుల్ స్టాప్ పెడ‌తారో చూడాల‌ని అంటున్నారు.

This post was last modified on January 27, 2021 12:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…

1 hour ago

అల్లరోడి ఆల్కహాల్ అడ్రస్ ఎక్కడ

అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…

2 hours ago

మామతో దళపతి… మాజీ అల్లుడితో ఎమోషనల్ డ్రామా

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…

2 hours ago

దిల్ రాజుకు, నాగవంశీకి చెడిందా?

టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…

3 hours ago

చిరుపై విమర్శకులకు లావణ్య కౌంటర్

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి…

3 hours ago

రెండు షాట్ల కోసం మహేష్ ఆరు నెలల కష్టం

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…

3 hours ago