Political News

చిన్నమ్మ విషయంలో ఏమి జరుగుతోంది ?

తమిళనాడులో చిన్నమ్మగా పాపులరైన శశికళ విషయంలో ఏమి జరుగుతోందో అర్ధంకాక ఆమె అభిమానులు టెన్షన్ పడిపోతున్నారు. ఈనెల 27వ తేదీన బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలు నుండి శశికళ విడులవుతారని అందరు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆమె విడుదల సందర్భంగా జైలు నుండి తమిళనాడులో ఆమె నివాసం వరకు భారీ స్వాగత ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. 27వ తేదీన విడులయ్యే చిన్నమ్మను ఊరేగింపుగా చెన్నైకు తీసుకెళ్ళేందుకు వెయ్యికార్లతో భారీ ర్యాలీని కూడా ఆమె మద్దతుదారులు రెడీ చేస్తున్నారు.

ఇంతలో చిన్నమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారనే విషయం బయటపడటంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఆమె ఆరోగ్య పరిస్ధితిని తెలుసుకునేందుకు తమిళనాడులోని నాలుగు మూలల నుండి ఆమె మద్దతుదారులు బెంగుళూరుకు చేరుకుంటున్నారు. కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అవ్వటంతో చిన్నమ్మను బెంగుళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. జ్వరం, వెన్నునొప్పితో శ్వాశ తీసుకోవటంలో చిన్నమ్మ బాగా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.

జైలులో ఉన్నపుడు శశికళకు అనారోగ్యం మొదలైంది. దాంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేసినపుడు ఆమెకు కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. అలాగే ఆమె ఊపిరితిత్తులు కూడా బాగా దెబ్బతినటం వల్లే శ్వాశ తీసుకోవటంలో ఇబ్బందులు పడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఇక హైబీపీ, షుగర్ అదనంగా తోడవ్వటంతో ఆమె పరిస్ధితి బాగా సీరియస్ గానే ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

గతంలో అంటే దివంగత ముఖ్యమంత్రి జయలలిత తర్వాత శశికళే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవటానికి అన్నీ ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇక కొద్దిగంటల్లో చిన్నమ్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారనే సమయంలో హఠాత్తుగా ఆమె అరెస్టయ్యారు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జయలలితతో పాటు శిక్షపడిన శశికళను అరెస్టు చేసి వెంటనే కర్నాటక జైలుకు అప్పట్లో అధికారులు తరలించుకుపోయారు.

అప్పట్లో సీఎం పీఠం ఎక్కే కొద్దిగంటల ముందు జైలుపాలయ్యారు. ఇపుడు మరో వారంరోజుల్లో జైలు నుండి బయటపడతారని అందరు అనుకుంటుంటే హఠాత్తుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందులోను ఆమె ఆరోగ్యపరిస్ధితి చాలా విషమించిందనే వార్త తమిళనాడులో సంచలనంగా మారింది. ఎన్నికలకు ముందు చిన్నమ్మ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను అభిమానులు, పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

This post was last modified on January 23, 2021 11:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

29 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago