Political News

మోడీ సర్కారును ఉతికారేసిన కేసీఆర్

కరోనా కారణంగా లాక్ డౌన్ అమలు మొదలైనప్పటి నుంచి కేంద్రంలోని మోడీ సర్కారు పట్ల సానుకూల వైఖరితోనే కనిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. జనతా కర్ఫ్యూ సహా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన సపోర్టివ్‌గానే మాట్లాడారు. కరోనాపై పోరాడుతున్న వారికి సంఘీభావంగా మోడీ చప్పట్లు కొట్టమన్నా.. దీపాలు వెలిగించమన్నా.. వాటి గురించి ఎండోర్స్ చేశారు. తాను స్వయంగా అనుసరించారు.

మోడీని ఎగతాళి చేసిన వాళ్లకు కూడా గడ్డి పెట్టారు. పలు సందర్భాల్లో కేంద్రం పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించారు. కానీ కేంద్రం నుంచి ఈ కష్ట కాలంలో సరైన సాయం అందకపోవడం, తాను మంచి సూచనలు చేసినా విస్మరించడం ఆయనకు కాక తెప్పించినట్లుంది. తాజా ప్రెస్ మీట్లో కేంద్రం తీరును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు కేసీఆర్. నేషనల్ మీడియా ప్రతినిధులు తాను చెప్పే విషయాలన్నీ రాయాలని చెప్పి మరీ మోడీ సర్కారు తీరును ఎండగట్టారు కేసీఆర్.

తెలంగాణ సర్కారు నెల వారీ ఆదాయం రూ.15 వేల కోట్ల పైమాటే అని.. అందులో రాష్ట్రం నుంచి సొంతంగా వచ్చే ఆదాయం రూ.11 వేల కోట్ల దాకా ఉంటుందని.. అలాంటిది ఈ నెలలో కేవలం రూ.1600 కోట్ల ఆదాయం వచ్చిందని కేసీఆర్ చెప్పారు. ఐతే జీతాలకే రూ.3 వేల కోట్ల ఖర్చు చేయాల్సి ఉందని ఇలాంటి సమయంలో కేంద్రం ఆదుకోక తప్పదని కేసీఆర్ అన్నారు. ఐతే కేంద్రం దగ్గర ఇవ్వడానికి డబ్బుల్లేవని.. అలాంటపుడు హెలికాఫ్టర్ మనీ తరహా పాలసీని అమలు చేయాలని తాను సూచించానని.. కానీ కేంద్రం పట్టించుకోలేదని ఆయనన్నారు.

ఈ కష్ట కాలంలో తమ నుంచి రావాల్సిన ఆదాయాన్ని మాత్రం కేంద్రం ముక్కు పిండి వసూలు చేస్తోందని.. అలాగే రుణాల రీషెడ్యూల్ లాంటివి చేయడానికి కూడా అంగీకరించడం లేదని.. ఇలా అయితే రాష్ట్రాలు ఎలా బతకాలని ఆయన ప్రశ్నించారు. ఇక వలస కార్మికులను ఆయా రాష్ట్రాలకు తీసుకెళ్లే బాధ్యత కేంద్రం తీసుకోవాల్సి ఉందని.. ఐతే అన్ని ఏర్పాట్లు తాము చేస్తుంటే వారి కోసం ఉచితంగా రైళ్లు కూడా ఏర్పాటు చేయలేకపోవడం దౌర్భాగ్యమని కేసీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. వలస కార్మికులకు రైలు ఛార్జీల కింద రాష్ట్రం తరఫున రూ.4 కోట్ల రూపాయలు రైల్వే శాఖకు కట్టినట్లు కేసీఆర్ వెల్లడించారు. కేంద్రం ఇలాంటి సమయంలో ఇలా వ్యవహరించడం తప్పంటూ మరిన్ని అంశాలపై విమర్శలు గుప్పించారు కేసీఆర్.

This post was last modified on May 6, 2020 1:10 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

కొరటాల మాస్… బాలయ్య కార్పెంటర్

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…

3 hours ago

సువేందు అధికారి ఆనే నేను..

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో బెంగాల్‌ సీఎంగా సువేందు…

4 hours ago

వీరభద్రుడికి ముందు నుయ్యి వెనుక గొయ్యి

ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…

4 hours ago

పవన్ అభిమానులు… కొత్త ట్రాప్ లో పడొద్దు…

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…

5 hours ago

సుమంత్ పేరు వెనుక‌ ప్ర‌భాస్ ఎందుకు?

మేం ఫేమ‌స్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ న‌టుడు సుమంత్ ప్ర‌భాస్. షార్ట్ ఫిలిమ్స్ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన ఈ…

6 hours ago

ఇండియ‌న్ టీమ్ కెప్టెన్ మార‌బోతున్నాడా?

సూర్య‌కుమార్ యాద‌వ్ ఎందుకు ఉన్నాడు? శ్రేయ‌స్ అయ్య‌ర్ ఎందుకు లేడు? భార‌త టీ20 జ‌ట్టు విష‌యంలో చాలా రోజులుగా అభిమానుల‌ను…

8 hours ago