Political News

మోడీ సర్కారును ఉతికారేసిన కేసీఆర్

కరోనా కారణంగా లాక్ డౌన్ అమలు మొదలైనప్పటి నుంచి కేంద్రంలోని మోడీ సర్కారు పట్ల సానుకూల వైఖరితోనే కనిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. జనతా కర్ఫ్యూ సహా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన సపోర్టివ్‌గానే మాట్లాడారు. కరోనాపై పోరాడుతున్న వారికి సంఘీభావంగా మోడీ చప్పట్లు కొట్టమన్నా.. దీపాలు వెలిగించమన్నా.. వాటి గురించి ఎండోర్స్ చేశారు. తాను స్వయంగా అనుసరించారు.

మోడీని ఎగతాళి చేసిన వాళ్లకు కూడా గడ్డి పెట్టారు. పలు సందర్భాల్లో కేంద్రం పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించారు. కానీ కేంద్రం నుంచి ఈ కష్ట కాలంలో సరైన సాయం అందకపోవడం, తాను మంచి సూచనలు చేసినా విస్మరించడం ఆయనకు కాక తెప్పించినట్లుంది. తాజా ప్రెస్ మీట్లో కేంద్రం తీరును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు కేసీఆర్. నేషనల్ మీడియా ప్రతినిధులు తాను చెప్పే విషయాలన్నీ రాయాలని చెప్పి మరీ మోడీ సర్కారు తీరును ఎండగట్టారు కేసీఆర్.

తెలంగాణ సర్కారు నెల వారీ ఆదాయం రూ.15 వేల కోట్ల పైమాటే అని.. అందులో రాష్ట్రం నుంచి సొంతంగా వచ్చే ఆదాయం రూ.11 వేల కోట్ల దాకా ఉంటుందని.. అలాంటిది ఈ నెలలో కేవలం రూ.1600 కోట్ల ఆదాయం వచ్చిందని కేసీఆర్ చెప్పారు. ఐతే జీతాలకే రూ.3 వేల కోట్ల ఖర్చు చేయాల్సి ఉందని ఇలాంటి సమయంలో కేంద్రం ఆదుకోక తప్పదని కేసీఆర్ అన్నారు. ఐతే కేంద్రం దగ్గర ఇవ్వడానికి డబ్బుల్లేవని.. అలాంటపుడు హెలికాఫ్టర్ మనీ తరహా పాలసీని అమలు చేయాలని తాను సూచించానని.. కానీ కేంద్రం పట్టించుకోలేదని ఆయనన్నారు.

ఈ కష్ట కాలంలో తమ నుంచి రావాల్సిన ఆదాయాన్ని మాత్రం కేంద్రం ముక్కు పిండి వసూలు చేస్తోందని.. అలాగే రుణాల రీషెడ్యూల్ లాంటివి చేయడానికి కూడా అంగీకరించడం లేదని.. ఇలా అయితే రాష్ట్రాలు ఎలా బతకాలని ఆయన ప్రశ్నించారు. ఇక వలస కార్మికులను ఆయా రాష్ట్రాలకు తీసుకెళ్లే బాధ్యత కేంద్రం తీసుకోవాల్సి ఉందని.. ఐతే అన్ని ఏర్పాట్లు తాము చేస్తుంటే వారి కోసం ఉచితంగా రైళ్లు కూడా ఏర్పాటు చేయలేకపోవడం దౌర్భాగ్యమని కేసీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. వలస కార్మికులకు రైలు ఛార్జీల కింద రాష్ట్రం తరఫున రూ.4 కోట్ల రూపాయలు రైల్వే శాఖకు కట్టినట్లు కేసీఆర్ వెల్లడించారు. కేంద్రం ఇలాంటి సమయంలో ఇలా వ్యవహరించడం తప్పంటూ మరిన్ని అంశాలపై విమర్శలు గుప్పించారు కేసీఆర్.

This post was last modified on May 6, 2020 1:10 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

1 hour ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

1 hour ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago