ఇటీవల కాలంలో పెద్దగా వార్తల్లో కనిపించని మంత్రి తన్నీరు హరీశ్ రావు.. తాజాగా తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. అత్యున్నత స్థానాల్లో ఉన్న నేతలంతా ప్రజల కోసం తాము చాలా చేస్తామని.. వారి కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని చెబుతుంటారు. మాటలు ఇంత తియ్యగా ఉన్నా.. చేతల వరకు వచ్చేసరికి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. తన నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్ల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకు తన ఆస్తిని తాకట్టు పెట్టిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బ్యాడ్ లక్ ఏమంటే.. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా.. దీనికి సంబంధించిన వార్త మాత్రం మీడియాలో పెద్ద ప్రాధాన్యత అంశంగా రాకపోవటం గమనార్హం.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు ఏం తక్కువంటూ పలువురు టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్న వేళలోనే.. మంత్రి హరీశ్ తీసుకున్న నిర్ణయం భిన్నంగా ఉంది. రాష్ట్రంలోనే తొలిసారి సిద్దిపేటలో ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఆటో డ్రైవర్లకు రుణాలు ఇచ్చేందుకు వీలుగా తన ఆస్తిని తాకట్టులో పెట్టారు.
దీంతో.. సిద్దిపేటలోని ఆటోడ్రైవర్లకు సులువుగా రుణాలు అందనున్నాయి. మంత్రి హరీశ్ చేతుల మీదుగా 850 మంది ఆటోవాలాలకు రుణాలు.. డ్రెస్సులు అందించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నిర్ణయం వెనుక కారణాల్ని చూస్తే.. రోజువారీ ఫైనాన్స్ లు తీసుకుంటూ ఆటో నడిపే వారంతా రోజువారీ మిత్తీలు చెల్లించటంతో వాటిని తీర్చలేక అప్పుల పాలవుతున్నారు.
ఈ విషయాలన్ని హరీశ్ వరకు రావటం.. వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు సొసైటీని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రస్తుతం 850 మంది ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్సు.. ఆటో ఆర్ సీ తదితర అంశాల్ని అర్హతగా ఎంతమంది సభ్యులు వచ్చినా చేర్చుకునేందుకు సొసైటీ సిద్ధంగా ఉంది.
This post was last modified on January 21, 2021 12:12 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…