ఇటీవల కాలంలో పెద్దగా వార్తల్లో కనిపించని మంత్రి తన్నీరు హరీశ్ రావు.. తాజాగా తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. అత్యున్నత స్థానాల్లో ఉన్న నేతలంతా ప్రజల కోసం తాము చాలా చేస్తామని.. వారి కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని చెబుతుంటారు. మాటలు ఇంత తియ్యగా ఉన్నా.. చేతల వరకు వచ్చేసరికి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. తన నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్ల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకు తన ఆస్తిని తాకట్టు పెట్టిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బ్యాడ్ లక్ ఏమంటే.. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా.. దీనికి సంబంధించిన వార్త మాత్రం మీడియాలో పెద్ద ప్రాధాన్యత అంశంగా రాకపోవటం గమనార్హం.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు ఏం తక్కువంటూ పలువురు టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్న వేళలోనే.. మంత్రి హరీశ్ తీసుకున్న నిర్ణయం భిన్నంగా ఉంది. రాష్ట్రంలోనే తొలిసారి సిద్దిపేటలో ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఆటో డ్రైవర్లకు రుణాలు ఇచ్చేందుకు వీలుగా తన ఆస్తిని తాకట్టులో పెట్టారు.
దీంతో.. సిద్దిపేటలోని ఆటోడ్రైవర్లకు సులువుగా రుణాలు అందనున్నాయి. మంత్రి హరీశ్ చేతుల మీదుగా 850 మంది ఆటోవాలాలకు రుణాలు.. డ్రెస్సులు అందించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నిర్ణయం వెనుక కారణాల్ని చూస్తే.. రోజువారీ ఫైనాన్స్ లు తీసుకుంటూ ఆటో నడిపే వారంతా రోజువారీ మిత్తీలు చెల్లించటంతో వాటిని తీర్చలేక అప్పుల పాలవుతున్నారు.
ఈ విషయాలన్ని హరీశ్ వరకు రావటం.. వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు సొసైటీని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రస్తుతం 850 మంది ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్సు.. ఆటో ఆర్ సీ తదితర అంశాల్ని అర్హతగా ఎంతమంది సభ్యులు వచ్చినా చేర్చుకునేందుకు సొసైటీ సిద్ధంగా ఉంది.
This post was last modified on January 21, 2021 12:12 pm
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…
https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…
విశ్వాసం ఉండడం తప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవరో అనడం లేదు.…
చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…
యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…