ఇటీవల కాలంలో పెద్దగా వార్తల్లో కనిపించని మంత్రి తన్నీరు హరీశ్ రావు.. తాజాగా తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. అత్యున్నత స్థానాల్లో ఉన్న నేతలంతా ప్రజల కోసం తాము చాలా చేస్తామని.. వారి కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని చెబుతుంటారు. మాటలు ఇంత తియ్యగా ఉన్నా.. చేతల వరకు వచ్చేసరికి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. తన నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్ల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకు తన ఆస్తిని తాకట్టు పెట్టిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బ్యాడ్ లక్ ఏమంటే.. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా.. దీనికి సంబంధించిన వార్త మాత్రం మీడియాలో పెద్ద ప్రాధాన్యత అంశంగా రాకపోవటం గమనార్హం.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు ఏం తక్కువంటూ పలువురు టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్న వేళలోనే.. మంత్రి హరీశ్ తీసుకున్న నిర్ణయం భిన్నంగా ఉంది. రాష్ట్రంలోనే తొలిసారి సిద్దిపేటలో ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఆటో డ్రైవర్లకు రుణాలు ఇచ్చేందుకు వీలుగా తన ఆస్తిని తాకట్టులో పెట్టారు.
దీంతో.. సిద్దిపేటలోని ఆటోడ్రైవర్లకు సులువుగా రుణాలు అందనున్నాయి. మంత్రి హరీశ్ చేతుల మీదుగా 850 మంది ఆటోవాలాలకు రుణాలు.. డ్రెస్సులు అందించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నిర్ణయం వెనుక కారణాల్ని చూస్తే.. రోజువారీ ఫైనాన్స్ లు తీసుకుంటూ ఆటో నడిపే వారంతా రోజువారీ మిత్తీలు చెల్లించటంతో వాటిని తీర్చలేక అప్పుల పాలవుతున్నారు.
ఈ విషయాలన్ని హరీశ్ వరకు రావటం.. వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు సొసైటీని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రస్తుతం 850 మంది ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్సు.. ఆటో ఆర్ సీ తదితర అంశాల్ని అర్హతగా ఎంతమంది సభ్యులు వచ్చినా చేర్చుకునేందుకు సొసైటీ సిద్ధంగా ఉంది.
This post was last modified on January 21, 2021 12:12 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…