Political News

మొత్తం కుటుంబం అంతా ఇన్వాల్వయ్యిందా ?

బోయినపల్లి కిడ్నాప్ గా సంచలనం సృష్టించిన ముగ్గురు సోదరుల కిడ్నాప్ ఘటనలో మాజీమంత్రి , టీడీపీ నేత భూమా అఖిలప్రియ అత్తగారి కుటుంబం మొత్తం ఇన్వాల్వయినట్లు పోలీసులు నిర్ధారించారు. ముగ్గురు సోదరుల కిడ్నాప్ కు ముందు భూమా అఖిలప్రియ, ఆమ భర్త భార్గవరామ్, మరిది చంద్రహాస్, అత్తగారు కిరణ్మయి, మామగారు మురళిని నిందితులుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చటం సంచలనంగా మారింది.

ఓ కిడ్నాప్ ఘటనలో మొత్తం కుటుంబం కుటుంబమంతా నిందితులుగా మారటం బహుశా ఇఫ్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారేమో. కిడ్నాప్ కు ముందు అందులో పాల్గొన్న గ్యాంగుకు భార్గవరామ్ తల్లి, దండ్రులకున్న స్కూల్లోనే బస, వసతి ఏర్పాటు చేశారు. బస, వసతి ఏర్పాటు చేయటమే కాకుండా గ్యాంగులోని కొందరికి ఇన్ కమ్ ట్యాక్సు అధికారుల్లాగ నటించటానికి అవసరమైన ట్రైనింగ్ కూడా స్కూల్లోనే ఇచ్చినట్లు నిర్ధారణ చేసుకున్నారు.

సినిమా కంపెనీ నుండి పోలీసుల డ్రెస్ తెచ్చి మరీ ఐటి అధికారులకు సెక్యురిటి ట్రైనింగ్ కూడా ఇచ్చారట. అయితే ఇంత తెలుసుకున్న పోలీసులకు మాజీమంత్రి అత్త, మామలను పట్టుకోవాలన్న ఆలోచన మాత్రం ముందుగా రాలేదు. దాంతో తమకు దొరికిన కొద్ది రోజుల గ్యాపును చక్కగా ఉపయోగించుకున్నారు నిందితులు. అఖిల అత్త కిరణ్మయి, మామగారు మురళి తమ స్కూలికి తాళాలు వేసి పారిపోయారు.

అంటే ఇటు అత్త, మామలే కాదు భార్గవరామ్, చంద్రహోస్ నలుగురు పరారీలోనే ఉన్నారు. భార్గవరామ్ మహారాష్ట్రలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిగిలిన ముగ్గురు ఎక్కడున్నారో మాత్రం పోలీసులకు ఆచూకీ దొరకలేదు. అలాగే అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డి కూడా పోలీసులకు దిరక్కుండానే తప్పించుకుంటున్నాడు. కిడ్నాప్ కేసులో బావగారికి తోడుగా నిలబడి పర్యవేక్షించినందుకు బావమరిది మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవన్నీ పక్కనపెడితే అఖిల చెల్లెలు భూమా మౌనికారెడ్డి కూడా గడచిన నాలుగు రోజులుగా ఎక్కడా కనబడటం లేదట.

This post was last modified on January 17, 2021 3:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

14 minutes ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

4 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

5 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

6 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

6 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

8 hours ago