తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. “1967లో అన్నాదురై, 1977లో ఎంజీఆర్, 1982లో ఎన్టీఆర్.. ఇప్పుడు 2026లో విజయ్” అంటూ తన పొలిటికల్ ఎంట్రీని గతంలో వచ్చిన చారిత్రాత్మక మార్పులతో పోల్చుకున్నారు. ఈ డైలాగ్ వినగానే అందరి మైండ్లో వెంటనే మెదిలిన ప్రశ్న.. తమిళ రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన ‘అమ్మ’ జయలలిత పేరు ఆ లిస్ట్లో ఎందుకు లేదు?
నిజానికి దీని వెనుక విజయ్ ఆలోచించిన ఒక పక్కా పొలిటికల్ ప్యాటర్న్ ఉంది. 1967లో డీఎంకేతో అన్నాదురై కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టారు. 1977లో ఎంజీఆర్ సొంత పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు. ఇక 1982లో పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు విజయ్ కూడా సరిగ్గా అదే రూట్లో తన సొంత పార్టీతో వచ్చి పవర్లోకి వచ్చాడు. అంటే ఇక్కడ విజయ్ తీసుకున్న లెక్క.. సొంతంగా ఒక కొత్త రాజకీయ శక్తిని పుట్టించి, పాత వ్యవస్థను మార్చేసిన నాయకుల ట్రాక్ రికార్డ్ మాత్రమే.
జయలలిత ప్రయాణం దీనికి పూర్తి భిన్నం. ఆమె సొంతంగా కొత్త పార్టీని స్థాపించి అధికారంలోకి రాలేరు. ఎంజీఆర్ మరణం తర్వాత అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టి పార్టీని తన గుప్పెట్లోకి తీసుకుని 1991లో సీఎం అయ్యారు. తమిళనాడు రాజకీయాల్లో ఆమె తిరుగులేని శక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ‘కొత్త పార్టీతో పొలిటికల్ సునామీ’ అనే విజయ్ ఈక్వేషన్కు ఆ ప్రయాణం సెట్ కాదు.
అలాగని జయలలితను విజయ్ ఏమాత్రం పక్కనపెట్టలేదు. అదే అసెంబ్లీ సమావేశంలో రాజకీయాల్లో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి మాట్లాడేటప్పుడు.. గతంలో జయలలితకు జరిగిన అవమానాలను ఆయన ప్రత్యేకంగా గుర్తుచేశారు. ఒక బలమైన నాయకురాలిగా ఆమె పట్ల తనకున్న గౌరవాన్ని చూపించారు. ఇక్కడ విజయ్ పాలకుల గురించి మాట్లాడలేదు.. ఒక సరికొత్త రాజకీయ శక్తి పుట్టిన కాలాన్ని మాత్రమే పాయింట్ అవుట్ చేశాడు. ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకోకుండానే విజయ్ స్పీచ్లో జయలలిత పేరు లేదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
This post was last modified on September 7, 2026 10:48 pm
సినిమా చూడాలంటే బుక్మైషోలో టికెట్ తీసుకోవడం కామన్. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమానికి కూడా…
ప్రస్తుతం తెలుగు దర్శకుల్లో రాజమౌళి తర్వాతి స్థానం ఎవరిది అంటే మరో మాట లేకుండా సుకుమార్ పేరు చెప్పేయొచ్చు. టాలీవుడ్లోనే…
ఎక్కడైనా దురద పెడితే చేతితో గోక్కుంటాం. లేదంటే పక్కన ఉన్నవాళ్లను కాస్త గోకమని అడుగుతాం. కానీ చైనాలో మాత్రం ఇదే…
తెలంగాణా అసెంబ్లీ ప్రారంభం కావడమే యుద్ధ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ గేటు వద్ద ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో…
ఢిల్లీలో హాస్టల్ భవనం కూలిపోయిన ఘటనలో ఇప్పుడు మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఏడుగురు మరణించిన విషయం తెలిసిందే.…
తెలుగు సినిమాల్లోకి పరభాషా నటులను క్యారెక్టర్, విలన్ పాత్రల్లోకి తీసుకోవడం కొత్తేమీ కాదు. ఇది దశాబ్దాలుగా నడుస్తున్న సంప్రదాయమే. సొంత…