వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి పాదయాత్ర చేపట్టేందుకు తేదీ ఖరారైందా? ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. వైఎస్సార్ జయంతి సందర్భంగా 2027 జులై 8న జగన్ పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై వైసీపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
2027 నుంచి మళ్లీ ప్రజల్లోకి వెళ్లి పాదయాత్ర చేస్తానని జగన్ గతంలో పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2027 జులై 8న పాదయాత్ర ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు జరుగుతున్న ప్రచారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
గతంలో వైఎస్ జగన్ 2017 నవంబరులో పాదయాత్ర ప్రారంభించారు. సుమారు 14 నెలలపాటు సాగిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ 2019 జనవరి 9న ముగిసింది. ఆ తర్వాత జరిగిన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
ఈ ఏడాది జూన్లో జగన్ చేసిన వ్యాఖ్యలు పాదయాత్ర ప్రచారానికి మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ‘కన్నుమూసి తెరిచేసరికి రెండేళ్లు గడిచాయి. ఇంకా ఉన్నది మూడేళ్లే. మరో ఒకటిన్నర సంవత్సరం పోతే నా పాదయాత్ర స్టార్ట్ అయిపోతది.’ అంటూ జగన్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చెప్పిన కాల వ్యవధికి అనుగుణంగానే 2027లో పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
అయితే పాదయాత్ర ప్రారంభ తేదీ, మార్గం, కార్యక్రమ వివరాలపై వైసీపీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
This post was last modified on September 4, 2026 11:23 am
30 ఏళ్లకుపైగా తాను నడిపిన బస్సుకు ఓ డ్రైవర్ భావోద్వేగ వీడ్కోలు పలికిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.…
హిందీ నిర్మాతలు అత్యధిక శాతం ఎనిమిది వారాల ఓటిటి విండోని ఖచ్చితంగా పాటిస్తారు. అంటే థియేటర్ లో విడుదలైన యాభై…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకా విడుదల తేదీ జనవరి 13 ఆల్రెడీ ప్రకటించిన సంగతి…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ తిరిగి తన కామెడీ జానర్ లో సినిమా చేశాడు. ఇవాళ రంభ ఊర్వశి…
ఒకవైపు కుండపోత వానలు, వరదలు.. ఎటు చూసినా నిండా మునిగిన పంట పొలాలు.. ఇళ్లల్లోకి చేరిన నీళ్లు.. అయినా సరే…
అగ్రరాజ్యం అమెరికాలో త్వరలోనే మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. మన దేశంలో మాదిరిగా ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు అక్కడ జరగవు. నాలుగేళ్లకు…