Political News

సజ్జలపై సంచలన ఆరోపణలు చేసిన సాయిరెడ్డి

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ఆక్రోశాన్ని, ఆవేదనను వెళ్లగక్కారు. తనకు రాజకీయ పునాదులు వేసిన వైసిపి పార్టీలో జరిగిన అవమానంపై ఒక బహిరంగ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి వైసీపీ నుంచి బయటకు వచ్చి వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పిన విజయసాయిరెడ్డి ఈ మధ్యకాలంలో తాను ఒక రాజకీయ పార్టీని పెడతానంటూ ప్రకటించారు. అప్పుడప్పుడు కొన్ని ట్వీట్లు కూడా చేస్తున్నారు. రాజకీయ పరిణామాలపై స్పందిస్తున్నారు. దీనికి వైసిపి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో విజయసాయి ఒక బహిరంగ లేఖ రాశారు.. అందులో ఈ విధంగా ఆరోపణలు చేశారు.

వైసీపీకి చెందిన ‘కోటరీ’ తనను ‘నమ్మక ద్రోహి’గా చిత్రీకరిస్తూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తాను నమ్మక ద్రోహినే అయితే అప్పట్లోనే కాంగ్రెస్‌తో సంధి చేసుకుని సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లలో తన పేరు లేకుండా చేసుకునేవాడినన్నారు. జగన్‌కు నమ్మకస్తుడిగా ఉన్నందుకే ఆయనతో పాటు తనను పలు కేసుల్లో ఏ-2గా చేర్చారని, జగన్‌ 16 నెలలు జైలులో ఉంటే తాను 15 నెలలు జైలులో ఉన్నానని పేర్కొన్నారు. 2024 ఎన్నికల తర్వాత లిక్కర్‌ స్కామ్‌లో ఏ-5గా, కాకినాడ సీపోర్టు కేసులో ఏ-2గా చేర్చారని ఆరోపించారు. 2020 నుంచే తనపై కుట్ర జరిగిందని, ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేశారని తెలిపారు.

 2019 తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం పార్టీలో శ్రుతిమించిందని, జగన్‌ను ఎవరూ కలవకుండా గోడ కట్టారని ఆరోపించారు. సజ్జల ఆధ్వర్యంలో పనిచేయడం తన ఆత్మగౌరవానికి విరుద్ధమని, అందుకే రాజ్యసభ పదవికి, వైసీపీకి రాజీనామా చేశానన్నారు. తనపై జరిగిన అవమానాలు 74 ఉన్నాయని, 2022 మంగళగిరి ప్లీనరీలో సజ్జల తనపై భౌతికంగా దాడి చేశారని ఆరోపించారు. ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నానని, తాను జగన్‌కు నమ్మక ద్రోహం చేయలేదని స్పష్టం చేశారు.

This post was last modified on August 29, 2026 3:13 pm

Share

Recent Posts

మాస్ బ్యాటింగ్.. ఇక్కడ ఇరుముడి… అక్కడ అది

గత మూడు నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ మంచి జోష్ మీద నడుస్తోంది. కనీసం రెండు వారాలకో మంచి సినిమా పడుతోంది.…

2 hours ago

ఆమిర్‌ ఖాన్‌… అవసరం లేని సినిమా

ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరూ అందుకోలేని స్థాయిని అందుకున్నాడు ఆమిర్ ఖాన్. లగాన్, రంగ్ దే బసంతి, 3…

2 hours ago

70 స్థానాల్లో వైసీపీకి సరైన ఇంచార్జీలు లేరా?

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళవుతుంది. వైసీపీ అధికారం కోల్పోయి కూడా రెండున్నరేళ్ళయ్యింది. అయినా ఇప్పటికీ వైసీపీ కోలుకోలేదు. ఓటమికి…

2 hours ago

వైసీపీని భయపెడుతున్న సర్వే

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వస్తే జనసందోహం కనిపిస్తోందని.. రాష్ట్రంలో తమకు ఇప్పటికీ బలమైన ప్రజాదరణ ఉందని వైసీపీ…

5 hours ago

కింగ్ 100… కొత్తగా కనిపిస్తున్నాడు

అక్కినేని నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక మైలురాయిగా రూపొందుతున్న వందో సినిమాకు ముందు నుంచి ప్రచారం జరిగినట్టే కింగ్…

5 hours ago

నయనతార నిర్ణయాలు అందుకే కరెక్ట్

టాక్సిక్ హీరోయిన్ల విషయంలో కామెంట్స్ రానిది ఎవరికయ్యా అంటే ఒక్క నయనతారకి మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే కథలో ఆవిడ…

5 hours ago