ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరూ అందుకోలేని స్థాయిని అందుకున్నాడు ఆమిర్ ఖాన్. లగాన్, రంగ్ దే బసంతి, 3 ఇడియట్స్, పీకే, దంగల్.. ఈ చిత్రాలు ఎలాంటి సంచలనం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయా సమయాలకు ఇవి ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ‘దంగల్’ సినిమాతో చైనాలోనూ భారీగా వసూళ్లు కొల్లగొట్టి ఎవ్వరూ అందుకోలేని ఇండస్ట్రీ హిట్టుగా నిలబెట్టాడు ఆమిర్. కానీ ఆ తర్వాత మాత్రం ఆయనకు కలిసి రాలేదు.
థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చడ్డా ఘోరాతి ఘోరమైన ఫలితాలను అందుకుని ఆయన్ని కిందికి లాగేశాయి. గత ఏడాది ‘సితారే జమీన్ పర్’తో ఓ మోస్తరు ఫలితాన్ని అందుకున్నప్పటికీ.. అది ఆయన స్థాయికి తక్కువే. ఐతే ‘లగాన్’ దర్శకుడు అశుతోష్ గోవారికర్తో ఆమిర్ జట్టు కట్టబోతున్నట్లు వార్తలు రావడంతో ఆ హీరో అభిమానులు ఎగ్జైట్ అయ్యారు. ఇది ఆమిర్కు సరైన కమ్ బ్యాక్ మూవీ అవుతుందనుకున్నారు.
కానీ ఆ సినిమా సంగతేమైందో కానీ.. ఇప్పుడు ఆమిర్ హీరోగా కొత్త సినిమా తెరపైకి వచ్చింది. ఆయనతో ‘రేస్-4’ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. నిర్మాత రమేష్ తరౌని.. ఆమిర్ దగ్గరకు ఈ స్క్రిప్టు తీసుకెళ్తే ఆయన సినిమా చేయడానికి ఓకే అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఐతే ‘రేస్’ ఫ్రాంఛైజీలో అబ్బాస్-మస్తాన్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా మాత్రమే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. పార్ట్-1లో హీరోగా చేసిన సైఫ్ అలీఖానే లీడ్ రోల్ చేసిన ‘రేస్-2’ అంచనాలను అందుకోలేకపోయింది. దీన్ని అబ్బాస్-మస్తాన్లే డైరెక్ట్ చేశారు.
ఐతే తర్వాత సల్మాన్ హీరోగా రెమో డిసౌజా దర్శకత్వంలో ‘రేస్-3’ తీస్తే అది డిజాస్టర్ అయింది. సోషల్ మీడియాలో ట్రోల్స్ మామూలుగా రాలేదు. దీంతో రేస్ ఫ్రాంఛైౌజీ ఆగినట్లే అనుకున్నారు. కానీ ఇప్పుడు రేస్-4 అంటున్నారు. పైగా ఈ చిత్రానికి ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ తీసిన విజయ్ కృష్ణ ఆచార్య దర్శకుడట. దీంతో ఆమిర్ అభిమానులే ఈ సినిమా పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. ఆమిర్కు ఇది అవసరం లేని సినిమా అని.. ఆయన చక్కగా అశుతోష్తో సినిమా చేసుకోవడg బెటర్ అని అంటున్నారు అభిమానులు.
This post was last modified on August 29, 2026 2:56 pm
ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అలిగారు. డబుల్ బెడ్ రూం లక్కీ డ్రా కార్యక్రమం నుంచి మధ్యలోనే…
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల ఇంకో ముప్పై రెండు రోజుల్లో…
గత మూడు నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ మంచి జోష్ మీద నడుస్తోంది. కనీసం రెండు వారాలకో మంచి సినిమా పడుతోంది.…
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ఆక్రోశాన్ని, ఆవేదనను వెళ్లగక్కారు. తనకు రాజకీయ పునాదులు వేసిన వైసిపి పార్టీలో జరిగిన…
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళవుతుంది. వైసీపీ అధికారం కోల్పోయి కూడా రెండున్నరేళ్ళయ్యింది. అయినా ఇప్పటికీ వైసీపీ కోలుకోలేదు. ఓటమికి…
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటకు వస్తే జనసందోహం కనిపిస్తోందని.. రాష్ట్రంలో తమకు ఇప్పటికీ బలమైన ప్రజాదరణ ఉందని వైసీపీ…