Political News

అప్పట్లో బాబు అసెంబ్లీకి రాకపోయినా…

ఈనెల 17 వ తేదీన ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగు రోజులపాటు జరిగాయి. బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో నిర్ణయించిన ప్రకారం నేటితో ముగుస్తుంది. ఈసారి కూడా శాసన సభా సమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ డుమ్మా కొట్టింది. డీఎస్సీ నియమకాలకు సంబందించి అక్రమాలు జరిగాయంటూ రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేస్తున్న వైసీపీ అసెంబ్లీకి మాత్రం గైర్హాజరయ్యింది. నిజంగా డీఎస్సీ అక్రమాలపై చిత్తశుద్ధి వుంటే అసెంబ్లీలో దాని మీద చర్చించాల్సిందని అధికార కూటమి ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ప్రజా సంఘాలు కూడా జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం సరైన నిర్ణయం కాదని చెబుతున్నారు.

జగన్ కు అసెంబ్లీ కి రావాలంటే భయమని, అసెంబ్లీకి వస్తే గ్రూప్- 1 స్కామ్ గురించి జవాబు చెప్పాల్సి వస్తుందన్న భయంతోనే డీఎస్సీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. జగన్ అసెంబ్లీకి రాకుండా బయట చెప్పే మాటలకు విశ్వసనీయత ఉండదని స్పష్టం చేశారు. శాసనసభలోని తన కార్యాలయం వద్ద సీఎం
చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పాలక పక్షం తప్పులు చేస్తుంటే చట్ట సభలో ఎత్తి చూపాల్సిన ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల మీద వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు.

వైసీపీ హయాంలో తాను అసెంబ్లీకి వెళ్ళక పోవడం గురించి కూడా చంద్రబాబు ప్రస్థావించారు. అప్పట్లో తాను అసెంబ్లీకి వెళ్లకపోయినప్పటికీ మిగతా సభ్యులు హాజరయ్యారని గుర్తు చేశారు. మొత్తం సభ్యులు హాజరుకాకపోవడం తొలిసారిగా చూస్తున్నానని చెప్పారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించడమే అని చెప్పారు. డీఎస్సీ మీద మేము చర్చకు సిద్దమేనంటూ పలుమార్లు ప్రకటించినప్పటికి వైసీపీ నుంచి స్పందనలేకపోవడం వారి వైఖరికి అద్దం పడుతుందని విమర్శించారు.

This post was last modified on August 20, 2026 5:41 pm

Share

Recent Posts

శాంసంగ్ ఏడేళ్ల కష్టం.. యాపిల్ ఎందుకింత ఆలస్యం

ఫోల్డబుల్ ఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది శాంసంగ్. 2019లో తొలి గెలాక్సీ ఫోల్డ్‌ను తీసుకొచ్చిన ఆ కంపెనీ, అప్పటి నుంచి…

18 minutes ago

ఫౌజీ వెనుక అసలేం జరుగుతోంది

ఫౌజీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా పోస్ట్ పోన్ ఖాయమని…

22 minutes ago

స్కూలు సెలవు కోసం మర్డర్ ప్లాన్

మొబైల్ ఫోన్లు చేతిలోకి వచ్చాక రోజుకో కొత్త రకం నేరం బయట పడుతుంది. ముఖ్యంగా యువతీ యువకులు, మైనర్ బాలుల్లో…

38 minutes ago

టాలీవుడ్ హీరోలూ… స్పీడ్ పెంచండయ్యా

కారణాలు లక్షా తొంభై ఉండని, టాలీవుడ్ హీరోలు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారనేది వాస్తవం. రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని…

60 minutes ago

ఎఫెక్ట్ పడింది… ఐఫోన్ 18 ప్రో ధర పెరిగింది

ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ వస్తుంది. కెమెరా మారుతుంది, చిప్ వేగం పెరుగుతుంది. కానీ ఈసారి ఐఫోన్ 18 ప్రోతో…

2 hours ago

బేబీ జంటకు ‘ఎపిక్’ ఎగ్జామ్

రేపు విడుదల కాబోతున్న ఎపిక్ ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనుంది. హైదరాబాద్ ఒకటే కాకుండా ఏపీ, తెలంగాణ…

2 hours ago