వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి గత ఏడాది జనవరిలో తప్పుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, స్వచ్ఛందంగా, వ్యక్తిగతంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, తనపై ఎవరి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని, వేరే ఏ పదవులు ఆశించడం లేదని కూడా చెప్పారు. ఇకపై వ్యవసాయం చేసుకుంటానని రాజకీయ వైరాగ్యంతో కూడిన మాటలు మాట్లాడారు. అయితే, రాజకీయ సన్యాసం తీసుకున్న విజయ సాయిరెడ్డి
సడెన్ గా మనసు మార్చుకొని యూ టర్న్ తీసుకున్నారు.
త్వరలోనే తాను కొత్త పార్టీ పెట్టబోతున్నానని విజయ సాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ప్రజల తరపున.. ప్రజల కోసం.. ప్రజా పక్షంగా పార్టీ ఏర్పాటు చేస్తానని అన్నారు. ప్రజల గొంతు వినిపించేందుకు నూతన పార్టీ ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు. ఈ నెలలోనే పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తున్నానని వెల్లడించారు. తాను స్థాపించబోయే కొత్త పార్టీపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.
అయితే, వైసీపీ అధినేత జగన్ తో సాయిరెడ్డి టచ్ లోకి వచ్చారని, సజ్జలను పక్కనబెట్టి గతంలో మాదిరి తనకు పూర్తి స్థాయి పగ్గాలిస్తే వైసీపీలోకి రీ ఎంట్రీ ఇస్తానని సాయిరెడ్డి చెప్పినట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక, సాయిరెడ్డి బీజేపీలో చేరతారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. ఇవన్నీ కాదని, ఆయన సొంతగా పార్టీ పెడతానని ప్రకటించడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. మరి, ఆయన పార్టీ విధివిధానాలు ఏంటి? ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటారా లేదా అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
వాస్తవానికి ఏపీలో మరో కొత్త పార్టీకి దాదాపుగా చోటు లేదు. వైసీపీ, టీడీపీల రూపంలో రెండు బలమైన ప్రధాన పార్టీలు అధికారం కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక, మూడో ప్రత్యామ్నాయ ప్రధాన పార్టీగా ఎదిగేందుకు జనసేన ప్రయత్నిస్తోంది. బీజేపీ ఉనికి నామ మాత్రమే. ఇక, కాంగ్రెస్ ఊసెత్తే నాథుడే లేడు. ఇటువంటి సమయంలో సాయిరెడ్డే కాదు…ఎవరు కొత్త పార్టీ పెట్టినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు.
This post was last modified on August 19, 2026 2:46 pm
ఒక చిన్న వేడుక చేయడానికే కనీసం లక్ష రూపాయలు ఖర్చయ్యే సొసైటీలో ఉన్నాం మనం. అలాంటిది కేవలం రెండు నుంచి…
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ధర్మన్ షూటింగ్ మంచి ఊపు మీద ఉంది. ఇప్పటికే…
ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు వస్తున్నారు. ఇరవై, పాతిక వయసు ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. కానీ వాటిని ఎంచుకోవడం,…
రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వాహణపై ప్రతిపక్ష వైసీపీ రాద్దాంతం చేస్తున్న విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా…
దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న జననాల రేటు నేపథ్యంలో కుటుంబాల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ…
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదటిసారి కలిసి చేస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’. దీని మీద మంచి…