Political News

అంత అర్జెంట్ గా విచారించాల్సిన అవసరం లేదన్న ఏపీ హైకోర్టు

ఏపీలో స్థానిక ఎన్నికల్ని నిర్వహించాలని ఏపీ ఎన్నికల కమిషనర్ పట్టుదలతో ఉండటం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల్ని నిర్వహించటం సరికాదని ఏపీ సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ను జారీ చేయటం తెలిసిందే. దీనిపై ఏపీ సర్కారు హైకోర్టును ఆశ్రయించటం.. ఎన్నికల షెడ్యుల్ పై సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేయటం తెలిసిందే. దీంతో.. స్థానిక ఎన్నికల ప్రక్రియ ఆగింది.

దీన్ని సవాలు చేస్తూ ఏపీ ఎన్నికల సంఘం అప్పీలుకు హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను ఇప్పటికిప్పుడు అంత అర్జెంట్ గా విచారణ జరపాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పీల్ ను తక్షణమే విచారించకపోతే వచ్చే న్యాయపరమైన ప్రతిబంధకాలు ఏమీ లేవన్న న్యాయమూర్తి.. దీనిపై విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల్ని జారీ చేశారు.

సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని నిలిపివేయాలని కోరుతూ.. ఈసీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీల్ పై ఈసీ నిమ్మగడ్డ రమేశ్ హౌస్ మోషన్ రూపంలో అప్పీల్ చేశారు. అత్యవసర కేసుల్ని విచారిస్తున్న జస్టిస్ దుర్గాప్రసాద్ నేతృత్వంలోని వెకేషన్‌ బెంచ్‌ మంగళవారం సాయంత్రం ఆయన ఇంటి వద్దే విచారణ జరిపింది. ఎన్నికల కమిషనర్ తరఫున ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరుపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు.

ఎన్నికల ప్రక్రియ షురూ అయ్యాక కోర్టులు జోక్యం చేసుకోరాదని.. ఆప్పీలుపై విచారణ ఒకరోజు వాయిదా వేసినా.. ఎన్నికల్లో పోటీదారులు..ఓటర్లు తీవ్రమైన గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. దీనికి స్పందించిన ధర్మాసనం ఈ వాదనల్ని 18న రెగ్యులర్ బెంచ్ ముందు చెప్పుకోవాలన్నారు. ఇదిలా ఉంటే.. ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ఆగిందని చెప్పటం సబబు కాదని ఏజీ శ్రీరాం వ్యాఖ్యానించగా.. తాము ఏజీ వాదనలతో ఏకీభవిస్తున్నట్లుగా న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. మరో సీనియర్ న్యాయవాది ఈ విచారణలో జోక్యం చేసుకొని ఈ వ్యాజ్యంలో నిమ్మగడ్డ రమేశ్ ను వ్యక్తిగత ప్రతివాదిగా చేర్చారని.. ఆయన తరఫున తాను హాజరవుతానని చెప్పగా.. అందుకు ధర్మాసనం నిరాకరించి.. వాదనలు వినమని స్పష్టం చేసింది. అంతేకాదు. పార్టీలతో సంబంధం లేకుండా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వ పథకాలతో ఓటర్లు ఎలా ప్రభావితం చేసే కొత్త పథకాలేమీ ఉండవని ఏజీ శ్రీరామ్ స్పష్టం చేశారు. ఇవన్నీ చూసినప్పుడు ఎన్నికల కమిషన్ ది కేవలం ఆందోళన మాత్రమేనని.. కేసును ఈ నెల 18కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారం నిమ్మగడ్డకు ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు.

This post was last modified on January 13, 2021 11:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

49 minutes ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

12 hours ago