ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి ఒక అంగన్వాడీ టీచర్ ను ఎంపిక చేసి నూతన ఒరవడి సృష్టించారు. ఈ నిర్ణయం పట్ల టీడీపీ శ్రేణులు సైతం ఆశ్చార్యానికి గురయ్యారు. సీనియర్ నాయకులు పలువురు ఎమ్మెల్సీ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు బాబు మాత్రం తన దైన శైలిలో నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఎమ్మెల్సీ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు సైతం తమకు పదవి రాలేదని బాధపడటం లేదు. భలే మంచి నిర్ణయం తీదుకున్నారంటు అభినందిస్తున్నారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి ఏపీ నుంచి ఇద్దరు అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కృష్ణా జిల్లాకు చెందిన ఎస్సీ నాయకుడు వర్ల రామయ్య ను ఒక ఎమ్మెల్సీ గా ఎంపిక చేశారు. రెండో ఎమ్మెల్సీ స్థానానికి అనంతపురం లోక్ సభ నియోజకవర్గ అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలు దళవాయి రమాదేవిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీలో ఎవరూ ఊహించని ఒక సాధారణ మహిళను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సహజంగా అయితే పదవి దక్కని నాయకుల్లో అసంతృప్తి కనిపిస్తుంది. కానీ అంగన్వాడీ టీచర్ ఎంపిక పట్ల సానుకుల వాతావరణం కనిపిస్తుంది. నిజానికి కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు కారణంగా అనేక మంది సీనియర్ నాయకులకు టికెట్టు ఇవ్వలేక పోయారు. భవిష్యత్తులో వారికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దాంతో అనేకమంది నాయకులు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేశారు. కుల సమీకరణ నేపథ్యంలో పలువురి పేర్లను పరిశీలించారు కూడా. ఏమి జరిగిందో ఏమో కానీ వారినందరిని కాదని అనూహ్యంగా ఒక సాధారణ మహిళకు అదీ ఒక అంగన్వాడీ టీచర్ ను ఎంపిక చేశారు.
ప్రస్తుతం దేశమంతా మహిళా రిజర్వేషన్ల గురించి దేశమంతా చర్చ జరుతుంది. చివరి 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. అయినప్పటికీ అమలుకి నోచుకోలేదు. ఇటీవల ఈ బిల్లు విషయంలో పార్లమెంట్లో తీవ్రమైన చర్చ జరిగింది. ఒట్టి మాటలతో సరిపెట్టుకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతల్లో మహిళకు అధికారంలో భాగస్వామ్యం కల్పించాలన్న నిర్ణయం తీసుకున్నారని చర్చ జరుగుతుంది.
This post was last modified on August 18, 2026 8:59 am
'అయ్యగారే నెంబర్ వన్' డైలాగ్ తో సోషల్ మీడియాను షేక్ చేసిన అఖిల్ వీరాభిమాని నాగరాజు మళ్లీ వైరల్ అవుతున్నాడు.…
ప్రస్తుతం దేశంలో జెన్ జీ హవా నడుస్తుంది. ఏ నిముషంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం జరిగిందో కానీ దేశంలో…
బేబీ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఆనంద్ దేవరకొండ మళ్ళీ స్పీడ్ పెంచలేదు. 2024 మే నెలలో…
గత రెండు మూడు నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ‘పెద్ది’ దగ్గర్నుంచి ప్రతి రెండు వారాలకూ ప్రేక్షకులను అలరించే సినిమా పడుతోంది.…
తెలుగులో ఒకప్పుడు ఇక్కడి స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్న తమిళ కథానాయకుడు సూర్య. చాలా ఏళ్ల…
ఉత్తరాదిలో బలంగా పాతుకుపోయిన బీజేపీ దక్షిణాదిలో పాగా వేయాలని చాలాకాలంగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ప్రయత్నాలు కర్ణాటకలో కొంతవరకు సఫలమైనప్పటికీ…