ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఏదో తప్పుచేసి దొంగలు దొరికిపోతారనేది పోలీసుల ప్రాధమిక విశ్వాసం. ఈ విశ్వాసం ఆధారంగానే చాలా కేసులను పోలీసులు ఛేదిస్తుంటారు. తాజాగా బోయినపల్లిలోని సోదరుల కిడ్నాప్ కేసులో కూడా అలాగే జరిగింది. ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కిడ్నాప్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ కేసులోనే మాజీమంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేశారు.
సరే ఇక విషయానికి వస్తే కిడ్నాప్ జరిగిన రోజున నిందితులు వాడిని ఓ ఫోన్ నెంబరే వాళ్ళని పట్టించింది. ఎప్పుడైతే సోదరులు కిడ్నాప్ అయ్యారో వెంటనే కుటుంబసభ్యులు పోలీసులతో పాటు మీడియాకు సమాచారం ఇచ్చారట. దాంతో సీఎం బంధువుల కిడ్నాప్ అంటూ విపరీతంగా వాయించేసింది మీడియా. దాంతో టీవీల్లో వస్తున్న వార్తలను చూసిన పోలీసులు నగరంలోని అన్నీ చెక్ పోస్టుల దగ్గర హెవీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దాంతో విషయం అర్ధమైపోయిన కిడ్నాపర్లు సోదరులను నగరం దాటించటం కష్టమని అర్ధం చేసుకున్నారు.
అందుకనే కారులో నుండి సోదరుల్లో ఒకరితో కిడ్నాపర్లు పోలీసులకు ఫోన్ చేయించారు. తాము క్షేమంగానే ఉన్నామని తమగురించి వెతకాల్సిన అవసరం లేదన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. అంతా బాగానే ఉంది కానీ మరి ఫోన్ సమాచారం అందుకున్న పోలీసులు తమకు ఫోన్ వచ్చిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పారు. అయితే సోదరుల ముగ్గురి ఫోన్లు ఇంట్లోనే ఉన్న విషయాన్ని కుటుంబసభ్యులు చెప్పారట పోలీసులతో.
సోదరుల ఫోన్లు ఇంట్లోనే ఉంటే మరి ఎవరి ఫోన్ నుండి తమతో మాట్లాడారనే విషయాన్ని పోలీసులు కూపీలాగటం మొదలుపెట్టారు. తమకు వచ్చిన ఫోన్ నెంబర్ ను ట్రాక్ చేశారు. అలాగే ఆ నెంబర్ పై మొబైల్ డేటాను బయటకు తీయించారు. దాంతో విషయమంతా ఒక్కసారిగా బయటపడిపోయింది. కేవలం కిడ్నాప్ కోసమనే నిందితులు ఆరు సిమ్ కార్డులు తీసుకున్నారు. వాటిల్లో ఒకదానిలో నుండే సోదరులతో కిడ్నాపర్లు పోలీసులకు ఫోన్ చేయించారు. ఇంకేముంది మొబైల్ డేటాను పూర్తిగా బయటకు తీసినపుడు అందులో ఒక నెంబర్ ప్రముఖంగా కనిపించిందట. దాన్ని ఆరాతీస్తే ఆ నెంబర్ మాజీమంత్రి భూమా అఖిలదని తేలింది. దాంతో పోలీసులు అఖిలను అరెస్టు చేశారు.
This post was last modified on January 12, 2021 12:06 pm
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…