Political News

హ‌మ్మ‌య్య‌… ఎట్ట‌కేల‌కు క‌దిలిన క‌మ‌ల‌నాథులు!

ఏపీలో కూట‌మిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గ‌త రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెద‌వి విప్పి.. కూట‌మి ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాలు ఇవీ.. అని చెప్పిన పాపాన పోలేదు. అంతేకాదు..అత్యంత క్లిష్ట‌మైన అంశాలైన తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ నుంచి డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌పై తీవ్ర దుర్భాష‌ల వ్య‌వ‌హారం తెర‌మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా బీజేపీ నోరు విప్ప‌లేదు. ఈ క్ర‌మంలోనే సీఎం చంద్ర‌బాబు రెండు సార్లు స‌మ‌న్వ‌య స‌మావేశాలు ఏర్పాటు చేసి.. హిత‌వు ప‌లికారు.

కూట‌మి ప్ర‌భుత్వం త‌ర‌ఫున అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాల‌ని చంద్ర‌బాబు సూచించారు. ప్ర‌భుత్వం చేస్తున్న మంచిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని కూడా ఆయ‌న సూచించారు. అయిన‌ప్ప‌టికీ.. బీజేపీ నాయ‌కులు చంద్ర‌బాబు మాట‌లు విన్నారే కానీ.. ఎవ‌రూ నోరు విప్ప‌లేదు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రాలేదు. మ‌రీ ముఖ్యంగా వైసీపీ నాయ‌కుల‌పై ప‌న్నెత్తు మాట కూడా విమ‌ర్శించ‌లేదు.  కానీ, తాజాగా ఇప్పుడు బీజేపీ అడుగులు ముందుకు ప‌డుతున్నాయి. పోల‌వ‌రం ప్రాజెక్టు స‌హా రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధిని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లేందుకు ముందుకు వ‌స్తున్నాయి.

తాజాగా గురువారం బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధ‌వ్‌.. పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో స్పందించారు. ఈ ప్రాజెక్టును వైసీపీ ప్ర‌భుత్వం, అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ గాలికి వ‌దిలేశార‌ని విమ‌ర్శించారు. ఇదేస‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబు కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని ప్రాజెక్టును ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని అన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల‌ను పూర్తి చేసే బాధ్య‌త‌ను చంద్ర‌బాబు తీసుకున్నార‌ని.. చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ప్రాజెక్టుల‌ను పూర్తిచేస్తామ‌ని చెప్పారు. అంతేకాదు.. పోల‌వ‌రం ప్రాంతాన్ని ప‌ర్యాట‌క కేంద్రంగా కూడా తీర్చిదిద్ద‌నున్న‌ట్టువివ‌రించారు.

ఈ మార్పు వెనుక!

ఇక‌.. ఈ మార్పు వెనుక కీల‌క కార‌ణం ఏంట‌నేది ఆసక్తిగా మారింది. గ‌త రెండు సంవ‌త్స‌రాల్లో బీజేపీ నోరు విప్ప‌లేదు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా తెర ముందుకు రావ‌డం హ‌ర్ష‌ణీయ‌మే అయినా.. దీని వెనుక కీల‌క కార‌ణం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. బీజేపీ ఈ ఎన్నిక‌ల‌పై భారీగానే ఆశ‌లు పెట్టుకుంది. అయితే.. క్షేత్ర‌స్థాయిలో టీడీపీ, జ‌న‌సేనల మ‌ద్ద‌తు లేక‌పోతే.. స్థానికంలో అనుకున్న ఫ‌లితం రాబ‌ట్టడం అంత ఈజీకాదు. అందుకే.. మార్పు దిశ‌గా క‌మ‌ల నాథులు అడుగులు వేయ‌క‌త‌ప్ప‌లేద‌న్న చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on July 16, 2026 2:08 pm

Share

Recent Posts

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

3 minutes ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

13 minutes ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

30 minutes ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

49 minutes ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

2 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

3 hours ago