జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్ పై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని చేసిన దారుణమైన వ్యాఖ్యల కారణంగా మనస్తాపానికి గురైన నిరంజన్ మరణించారని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. పవన్ ను వాడు, వీడు అంటూ నాని చేసిన వ్యాఖ్యలు నిరంజన్ ను బాగా ఇబ్బంది పెట్టాయని, అదే బాధలోనే తమ కుమారుడు చనిపోయాడని నిరంజన్ తండ్రి బహిరంగంగానే సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు పెద్ద రచ్చగానే మారే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
హన్మకొండకు చెందిన బాలుడు నిరంజన్ స్వతహాగా పవన్ కు వీరాభిమాని. అంతు చిక్కని అనారోగ్యం కారణంగా అతడు మంచానికే పరిమితం కాగా… అతడిని అతడి తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తన అబిమాన నటుడు పవన్ ను చూడాలని ఉందంటూ నిరంజన్ చేసిన వ్యాఖ్యలు తెలుసుకున్న పవన్… తన చిన్నారి అభిమాని కోరికను తీర్చేందుకు హన్మకొండ దాకా వెళ్లారు. తనను చూడాలన్న చిరకాల కోరికను తీర్చిన పవన్.. నిరంజన్ అడిగిన అన్ని కోరికలను తీర్చారు. దీంతో నిరంజన్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
అయితే ఇటీవలే ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోయిన సంగతి తెలిసిందే. పవన్ ను టార్గెట్ చేస్తూ ప్రశ్న రావణ్ లాంటి వారితో పాటు బాధ్యతాయుతమైన పదవులను చేపట్టిన పేర్ని నాని దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ ను వాడు వీడు అంటూ నాని చేసిన వ్యాఖ్యలకు సంబందించిన వీడియోను నిరంజన్ విన్నారట. ఈ వీడియోను చూసిన వెంటనే అతడు తీవ్ర మనస్తాపానికి గురై… అదే వీడియోను పదే పదే చూశాడట. ఈ క్రమంలోనే అతడు హఠాన్మరణం చెందాడు. ఫలితంగా నిరంజన్ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది.
తాజాగా పవన్ పరామర్శించిన నిరంజన్ మరణించారన్న వార్త తెలిసిన పలు మీడియా సంస్థలు అసలు ఏం జరిగిందన్న దానిపై ఆరా తీశాయి. ఈ సందర్బంగా ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడిన నిరంజన్ తల్లిదండ్రులు అతడి మృతికి పేర్ని నానినే కారణమని తేల్చేశారు. తాను అభిమానించే పవన్ ను వాడు వీడు అంటూ నాని దుర్భాషలాడటంతో నిరంజన్ తట్టుకోలేకపోయారని… అదే వేదనలో అతడు చనిపోయాడని అతడి తండ్రి ఆరోపిస్తున్నారు. తన కుమారుడి చావుకు నానినే కారణమని ఆయన సంచలన ఆరోపణ గుప్పించారు. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకే తెర లేపింది.
This post was last modified on July 13, 2026 1:00 pm
శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైల్లో పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్.. అప్పలరాజును…
రాష్ట్రంలో ఎవరి దయాదాక్షిణ్యాలపైనా తాను ముఖ్యమంత్రిని కాలేదని.. 4 కోట్ల మంది ఓటర్లు ఓటేసి తనను గెలిపించుకున్నారని.. వారి ఆశీర్వాదం,…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి... పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా…
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…
తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఒకటి. ఎక్కువగా అగ్రెసివ్ క్యారెక్టర్లు…
ప్రభాస్ అభిమానులకు పీడకలగా మిగిలిపోయిన ఆదిపురుష్ మరోసారి సోషల్ మీడియా టాపిక్ అయ్యింది. కారణం రామాయణ ట్రైలర్. రెండు సినిమాల్లో…