అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే వలస విధానాలు, అంతర్జాతీయ వాణిజ్యంపై తీసుకున్న నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమయ్యారు. ఇప్పుడు ఏకంగా మూడోసారి కూడా అధ్యక్ష పదవిపైనే కన్నేశానన్నట్లుగా మాట్లాడి మరో వివాదానికి తెరలేపారు.
అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. “నా తొలి టర్మ్లో మిలిటరీని బలోపేతం చేశాం. దాన్ని రెండో… కాదు, మూడో టర్మ్లో కూడా సమర్థంగా ఉపయోగిస్తాం” అని వ్యాఖ్యానించారు. వెంటనే తేరుకుని “అలా అనకూడదు. అనవసర వివాదం వద్దు” అంటూ తన మాటను సరిదిద్దుకున్నారు.
అయితే ట్రంప్ నోటి నుంచి ‘మూడో టర్మ్’ మాట రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఇదే తరహా సంకేతాలు ఇచ్చారు. దీంతో ఆయన నిజంగానే అలాంటి ఆలోచనలో ఉన్నారా అనే చర్చ అమెరికా రాజకీయ వర్గాల్లో మళ్లీ మొదలైంది.
వాస్తవానికి అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం ఏ వ్యక్తి అయినా రెండు సార్లకు మించి అధ్యక్షుడిగా ఉండే అవకాశం లేదు. దీనిని మార్చాలంటే చాలా క్లిష్టమైన రాజ్యాంగ సవరణ ప్రక్రియ పూర్తి కావాలి. అందుకే ట్రంప్ వ్యాఖ్యలను చాలామంది రాజకీయ స్టంట్గానే చూస్తున్నారు.
అయినా రెండుసార్లు అధ్యక్షుడైన తర్వాత కూడా మూడోసారి వైట్ హౌస్పై కన్నేయడం చూస్తుంటే.. ట్రంప్ రాజకీయ అత్యాశకు హద్దులే లేవా అన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.
This post was last modified on July 5, 2026 10:44 pm
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…