Political News

మహిళా మంత్రి గారు మళ్ళీ అలిగారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయ‌కురాలు, ప్ర‌స్తుత మంత్రి కొండా సురేఖ మ‌ళ్లీ అలిగారా? కీల‌క‌మైన మంత్రి వ‌ర్గ స‌మావేశానికి గైర్హాజ‌య్యారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. మంత్రి వ‌ర్గంలో దేవదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ‌.. గ‌త ఏడాది కాలంగా అసంతృప్తితోనే ఉన్నారు. త‌న‌కు ప్రాధాన్యం లేద‌ని.. త‌నను హైజాక్ చేస్తున్నార‌ని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యానికి తోడు.. న‌టుడు నాగార్జున విష‌యంలో ఏర్ప‌డిన వివాదంపై తాను ఒంటరిన‌య్యాన్న ఆవేద‌న కూడా ఆమెలో ఉంది.

దీంతో ప్ర‌భుత్వానికి-మంత్రికి మ‌ధ్య గ్యాప్ కొన‌సాగుతోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఇదిలా వుంటే.. తాజాగా గురువారం కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించారు. దీనిలో ఫ్యూచ‌ర్ సిటీ స‌హా.. కీల‌క ప్ర‌తి పాద‌న‌ల‌కు ఆమోదం తెలిపారు. అంతేకాదు.. తొలిసారి పేప‌ర్ ర‌హిత మంత్రివ‌ర్గ స‌మావేశంగా కూడా దీనిని నిర్వ‌హించారు. మ‌రోవైపు.. బీఆర్ ఎస్‌కు, మంత్రుల‌కు మ‌ధ్య వివాదం కూడా ఇదే రోజు చోటు చేసుకుంది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో మంత్రివ‌ర్గ స‌మావేశానికి ప్రాధాన్యం ఏర్ప‌డింది.

అయితే.. ఇత‌ర మంత్రులు రాజ‌కీయ స‌వాళ్ల వ్య‌వ‌హారంలో ఉండ‌గా.. కొండా సురేఖ మాత్రం ఇంటి ప‌ట్టునే ఉండి కూడా ఈ భేటీకి గైర్హాజ‌రు కావ‌డంతో రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది. క్యాబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి.. సురేఖ విష‌యం ఆరా తీశార‌ని స‌మాచారం. అంతేకాదు.. ఫోన్ చేసినా స్పందించ‌లేద‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. దీంతో సురేఖ మంత్రివ‌ర్గ స‌మావేశానికి హాజ‌రు కాక‌పోవ‌డంపై సీఎం సైతం విస్మ‌యం వ్య‌క్తం చేశార‌ని తెలిసింది.

తాజా కార‌ణం ఇదేనా?

మంత్రి సురేఖ క్యాబినెట్ భేటీకి రాక‌పోవ‌డం వెనుక‌.. రెండు రోజుల కింద‌ట స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యమే కార‌ణ‌మ‌ని అంటున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద దేవాల‌యంగా ఉన్న యాద‌గిరి ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి ఆల‌య‌.. పాల‌క‌మండ‌లి బోర్డును ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. అయితే.. దీనిలో త‌న కుమార్తెకు చోటు క‌ల్పించాల‌ని సురేఖ కోరిన‌ట్టు స‌మాచారం.

అదేస‌మ‌యంలో త‌ను సూచించిన వారిని కూడా చేర్చాల‌ని ఆమె కోరార‌ని తెలిసింది. కానీ, స‌ర్కారు ఈ విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టి.. బోర్డు ప్ర‌క‌టించింది. పైగా ఈ బోర్డులో చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ‌ను చేర్చిన విష‌యం కూడా మంత్రి సురేఖ‌కు తెలియ‌ద‌ని అంటున్నారు. అందుకే ఆమె ఇంట్లోనే ఉండి కూడా.. మంత్రివ‌ర్గ స‌మావేశానికి రాలేద‌న్న చ‌ర్చ కాంగ్రెస్ వ‌ర్గాల్లోనే జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 3, 2026 2:10 pm

Share

Recent Posts

అద్భుతమైన రోజు ‘ఫౌజీ’ ఇచ్చే కానుక ఏంటి

భారతీయులందరూ సగర్వంగా ఫీలయ్యే రోజు ఆగస్ట్ 15. బ్రిటిష్ పాలకుల దాస్య సంకెళ్లను తెచ్చుకుని ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు…

7 minutes ago

జైలు నేత‌లకు ప‌రామర్శ‌… సమర్థించుకున్నారా జగన్?

ప్ర‌స్తుతం వివిధ కేసుల్లో చిక్కుకుని.. జైలు పాలైన కొంద‌రు నాయ‌కుల‌ను, మాజీ మంత్రుల‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్ ఓదారుస్తున్న విష‌యం…

36 minutes ago

పార్టీలు కావాలా.. ఉద్యోగాలు కావాలా… పోలీసులు తేల్చుకోవాలి!

వైసీపీ నాయ‌కుల‌తో వేదిక‌లు పంచుకుంటున్న టీడీపీ నేత‌ల‌పై చంద్ర‌బాబు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. వారి నుంచి వివ‌ర‌ణ తీసుకుంటున్నారు. పార్టీ…

41 minutes ago

చేతులు మారిన ర‌వితేజ సినిమా?

చాలా కాలంగా స‌రైన విజ‌యం లేక ఇబ్బంది ప‌డుతున్న‌ప్ప‌టికీ.. మాస్ రాజా ర‌వితేజకు అవ‌కాశాల విష‌యంలో లోటేమీ లేదు. ఇంత‌కుముందులా…

3 hours ago

హద్దుల్లేని విచ్చలవిడితనం తెర మీద చూస్తారా

కరోనా సమయంలో బ్లాక్ బస్టర్ అనిపించుకున్న వెబ్ సిరీస్ లలో మీర్జాపూర్ ఒకటి. కలీన్ భాయ్, అతని కొడుకుతో పాటు…

4 hours ago

అల్లరోడి సత్తాకి దేవకన్యల పరీక్ష

చాలా కాలంగా ఫామ్ లో లేని అల్లరి నరేష్ కామెడీ వర్కౌట్ కావడం లేదని భావించి రకరకాల జానర్లు ట్రై…

4 hours ago