జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన హైదరాబా ద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ముక్కుకు సర్జరీ కూడా చేయించున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరారు. ఆయన వెంట సతీమణి అన్నా కూడా వెళ్లారు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎందుకు?
గత కొంత కాలంలో భుజాలకు సంబంధించిన రొటేటర్ కఫ్ సమస్యతో పవన్ కల్యాణ్ ఇబ్బంది పడుతున్నారు. అలానే.. రెండు భుజాలకు సంబంధించిన కండరాలు కూడా చిట్లి పోవడంతో సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రత్యేక ట్రీట్మెంటు అవసరం కావడంతో ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్టు రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ కూడా ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా.. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని.. మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఓజీ సమయంలోనే..
పవన్ హీరోగా నటించిన ఓజీ సినిమా షూటింగ్ సమయంలోనే రెండు భుజాలకు గాయాలు అయినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా కత్తులను వేగంగా తిప్పే క్రమంలో రెండు భుజాలకు గాయాలకు అయ్యాయని తెలిసింది. అయితే.. అప్పటి నుంచి మందులు వాడుతున్నా.. లోలోన పెరిగిన సమస్య కారణంగా తాజాగా మరింతగా ఇబ్బంది ఎదురవు తోందని సమాచారం. అందుకే రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించడంతో కోకిలా బెన్ ఆసుపత్రికి వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎప్పుడెలా మారిపోతుందో తెలియక జనాలే కాదు.. ఆ పార్టీ నేతలు…
రోజుకు 8 గంటలకు మించి పని చేయనంటూ ఈ మధ్య దీపిక పదుకొనే ఫిలిం మేకర్స్కు కండిషన్ పెట్టడం ఎంత…
నిజమే... టీడీపీ అదినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఏ విషయంలో అయినా అంత ఈజీ అయితే కాదనే చెప్పాలి. ఏ…
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరోసారి తన స్టైలిష్ లుక్తో అందరి దృష్టిని ఆకర్షించింది. థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరిగిన షిసెడో…
సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా.. సోషల్ మీడియాలో మాత్రం మ్యాడ్ భామ రేబా జాన్ సందడి కొనసాగుతోంది. ప్రస్తుతం తొలి…
దురంధర్ రాకముందు స్పై యాక్షన్ సినిమాలతో ఒకప్పుడు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పంట పండించుకున్నారు. ముఖ్యంగా…