జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన హైదరాబా ద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ముక్కుకు సర్జరీ కూడా చేయించున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరారు. ఆయన వెంట సతీమణి అన్నా కూడా వెళ్లారు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎందుకు?
గత కొంత కాలంలో భుజాలకు సంబంధించిన రొటేటర్ కఫ్ సమస్యతో పవన్ కల్యాణ్ ఇబ్బంది పడుతున్నారు. అలానే.. రెండు భుజాలకు సంబంధించిన కండరాలు కూడా చిట్లి పోవడంతో సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రత్యేక ట్రీట్మెంటు అవసరం కావడంతో ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్టు రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ కూడా ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా.. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని.. మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఓజీ సమయంలోనే..
పవన్ హీరోగా నటించిన ఓజీ సినిమా షూటింగ్ సమయంలోనే రెండు భుజాలకు గాయాలు అయినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా కత్తులను వేగంగా తిప్పే క్రమంలో రెండు భుజాలకు గాయాలకు అయ్యాయని తెలిసింది. అయితే.. అప్పటి నుంచి మందులు వాడుతున్నా.. లోలోన పెరిగిన సమస్య కారణంగా తాజాగా మరింతగా ఇబ్బంది ఎదురవు తోందని సమాచారం. అందుకే రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించడంతో కోకిలా బెన్ ఆసుపత్రికి వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on July 1, 2026 1:57 pm
వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని రెగ్యులర్ గా ప్రమోషన్లలో…
కాపు ఉద్యమ నేత, సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం విగ్రహం బెజవాడలో త్వరలోనే ఏర్పాటు కానుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం…
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర…
నిజమే... యువత తిరగబడింది. రాజ్యం ఉలిక్కిపడింది. యువతలో ఆగ్రహావేశాలకు కారణంగా నిలిచిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి…
మూడేళ్ళ క్రితం బేబీ విడుదలై బ్లాక్ బస్టర్ సాధించాక అందరి అటెన్షన్ తీసుకున్న అమ్మాయి వైష్ణవి చైతన్య. అప్పటిదాకా చిన్న…
కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.…