Political News

ఆప‌రేష‌న్ సిందూర్‌లో ఆరుగురు వీర‌మ‌ర‌ణం

గ‌త ఏడాది మేలో జ‌రిగిన ఆప‌రేష‌న్ సిందూర్‌లో ఆరుగురు సైనికులు వీర‌మ‌ర‌ణం చెందిన‌ట్టు కేంద్రం తాజాగా వెల్ల‌డించింది. దాదాపు 13 మాసాల త‌ర్వాత ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. వీరిలో ఐదుగురు సైనిక శాశ్వత అధికారులు ఉన్నారు. మ‌రొక‌రు అగ్నివీర్ ఉన్నారు. వీరి పేర్ల‌ను జాతీయ యుద్ధ స్మార‌కం వ‌ద్ద పొందుప‌ర‌చ‌నున్నారు.

అమ‌రులైంది వీరే..

1) సుబేదార్‌ మేజర్‌ పవన్‌ కుమార్ (10 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌ హెడ్‌క్వార్టర్స్‌)
2) రైఫిల్‌మ్యాన్‌ సునీల్‌ కుమార్‌( జమ్మూకశ్మీర్‌ లైట్‌ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌)
3) లాన్స్‌ నాయక్‌ దినేశ్‌ కుమార్ (5 ఫీల్డ్‌ రెజిమెంట్‌)
4) హవల్దార్‌ సునీల్‌ కుమార్‌ సింగ్‌(237 ఫీల్డ్‌ వర్క్‌షాప్‌)
5) సార్జెంట్‌ సురేంద్ర కుమార్‌(ఎయిర్‌ఫోర్స్ -39)
6) అగ్నివీర్‌ మురళీ నాయక్‌(851 లైట్‌ రెజిమెంట్‌)

ఆప‌రేష‌న్ సిందూర్ ఇదీ..

జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం ప‌హ‌ల్గామ్‌లో గ‌త ఏడాది ఏప్రిల్ 16న ఉగ్ర‌వాదులు దాడులు చేశారు. ప‌ర్యాట‌కుల పేర్లు, ఊర్లు, కులాలు, మ‌తాలు అడిగి మ‌రీ కాల్పులు జ‌ర‌ప‌డం అప్ప‌ట్లో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. నాటి దారుణ‌ ఘ‌ట‌న‌లో మొత్తం 26 మంది పౌరులు మృతి చెందారు. వీరిలో నేపాల్‌కు చెందిన ఒక పౌరుడు కూడా ఉన్నారు. ఇక‌, ఏపీ నుంచి ఇద్ద‌రు, తెలంగాణ‌కు చెందిన ఒక‌రు కూడా నాటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.

దీనికి ప్ర‌తీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర‌వాదులు, ఉగ్ర‌స్థావ‌రాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని భార‌త త్రివిధ ద‌ళా లు ఆప‌రేష‌న్ సిందూర్ పేరుతో దాడులు చేప‌ట్టాయి. ఆ దాడుల్లో ఉగ్ర‌వాదుల‌కు చెందిన శిక్ష‌ణ శిబిరాల ను నేల‌మ‌ట్టం చేయ‌డంతోపాటు ప‌లువురు ఉగ్ర‌వాదుల‌ను కూడా మ‌న సైన్యం హ‌త‌మార్చింది. అయితే.. పాక్ జ‌రిపిన ఎదురు దాడుల్లో భార‌త సైన్యానికి చెందిన ఆరుగురు అమ‌రుల‌య్యార‌ని కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా వెల్ల‌డించింది.

This post was last modified on June 26, 2026 5:42 pm

Share

Recent Posts

డీఎస్సీపైనే వైసీపీకి ఎందుకంత మంకుపట్టు?

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…

3 seconds ago

కొత్త మార్పుల వైపు చరణ్ & సుకుమార్ ?

ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…

49 minutes ago

నాగార్జున 100 గురించి ఎప్పుడు చెబుతారు

అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…

2 hours ago

జార్ఖండ్ లో మరో సోనమ్ వాంగ్ చుక్ దీక్ష

దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్…

4 hours ago

హీలియం సిలిండర్… సిఏ ఆత్మహత్య

హైదరాబాద్‌కు చెందిన 33 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ సిద్దిపేటలోని ఒక హోటల్ గదిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.…

4 hours ago

రాకాసి గాడ్జిల్లాని రామాయణ తొక్కగలదా

భారతదేశపు అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ నవంబర్ 6 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ ట్రైలర్ తో…

7 hours ago