గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో ఆరుగురు సైనికులు వీరమరణం చెందినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. దాదాపు 13 మాసాల తర్వాత ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. వీరిలో ఐదుగురు సైనిక శాశ్వత అధికారులు ఉన్నారు. మరొకరు అగ్నివీర్ ఉన్నారు. వీరి పేర్లను జాతీయ యుద్ధ స్మారకం వద్ద పొందుపరచనున్నారు.
అమరులైంది వీరే..
1) సుబేదార్ మేజర్ పవన్ కుమార్ (10 ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ హెడ్క్వార్టర్స్)
2) రైఫిల్మ్యాన్ సునీల్ కుమార్( జమ్మూకశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్)
3) లాన్స్ నాయక్ దినేశ్ కుమార్ (5 ఫీల్డ్ రెజిమెంట్)
4) హవల్దార్ సునీల్ కుమార్ సింగ్(237 ఫీల్డ్ వర్క్షాప్)
5) సార్జెంట్ సురేంద్ర కుమార్(ఎయిర్ఫోర్స్ -39)
6) అగ్నివీర్ మురళీ నాయక్(851 లైట్ రెజిమెంట్)
ఆపరేషన్ సిందూర్ ఇదీ..
జమ్ము కశ్మీర్లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం పహల్గామ్లో గత ఏడాది ఏప్రిల్ 16న ఉగ్రవాదులు దాడులు చేశారు. పర్యాటకుల పేర్లు, ఊర్లు, కులాలు, మతాలు అడిగి మరీ కాల్పులు జరపడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. నాటి దారుణ ఘటనలో మొత్తం 26 మంది పౌరులు మృతి చెందారు. వీరిలో నేపాల్కు చెందిన ఒక పౌరుడు కూడా ఉన్నారు. ఇక, ఏపీ నుంచి ఇద్దరు, తెలంగాణకు చెందిన ఒకరు కూడా నాటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్లోని ఉగ్రవాదులు, ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత త్రివిధ దళా లు ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేపట్టాయి. ఆ దాడుల్లో ఉగ్రవాదులకు చెందిన శిక్షణ శిబిరాల ను నేలమట్టం చేయడంతోపాటు పలువురు ఉగ్రవాదులను కూడా మన సైన్యం హతమార్చింది. అయితే.. పాక్ జరిపిన ఎదురు దాడుల్లో భారత సైన్యానికి చెందిన ఆరుగురు అమరులయ్యారని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప…
ఇటీవలే సింగర్ సునీత మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్త్రీలు 'నా శరీరం నా ఇష్టం' అన్నప్పుడు అవతలి…
రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు,…
తెలంగాణలో ఓ కీలక నియామకానికి సంబంధించిన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…
ఏపీ సీఎం చంద్రబాబు సాధారణ ప్రజలతో ఇటీవల కాలంలో మమేకమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఎక్స్ వేదికగా పోస్టు…
వచ్చే నెల 9 జయకృష్ణ ఘట్టమనేని డెబ్యూ మూవీ 'శ్రీనివాస మంగాపురం' విడుదలవుతోంది. మహేష్ బాబు ముఖ్యఅతిథిగా వచ్చే వారం…