Political News

ఆప‌రేష‌న్ సిందూర్‌లో ఆరుగురు వీర‌మ‌ర‌ణం

గ‌త ఏడాది మేలో జ‌రిగిన ఆప‌రేష‌న్ సిందూర్‌లో ఆరుగురు సైనికులు వీర‌మ‌ర‌ణం చెందిన‌ట్టు కేంద్రం తాజాగా వెల్ల‌డించింది. దాదాపు 13 మాసాల త‌ర్వాత ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. వీరిలో ఐదుగురు సైనిక శాశ్వత అధికారులు ఉన్నారు. మ‌రొక‌రు అగ్నివీర్ ఉన్నారు. వీరి పేర్ల‌ను జాతీయ యుద్ధ స్మార‌కం వ‌ద్ద పొందుప‌ర‌చ‌నున్నారు.

అమ‌రులైంది వీరే..

1) సుబేదార్‌ మేజర్‌ పవన్‌ కుమార్ (10 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌ హెడ్‌క్వార్టర్స్‌)
2) రైఫిల్‌మ్యాన్‌ సునీల్‌ కుమార్‌( జమ్మూకశ్మీర్‌ లైట్‌ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌)
3) లాన్స్‌ నాయక్‌ దినేశ్‌ కుమార్ (5 ఫీల్డ్‌ రెజిమెంట్‌)
4) హవల్దార్‌ సునీల్‌ కుమార్‌ సింగ్‌(237 ఫీల్డ్‌ వర్క్‌షాప్‌)
5) సార్జెంట్‌ సురేంద్ర కుమార్‌(ఎయిర్‌ఫోర్స్ -39)
6) అగ్నివీర్‌ మురళీ నాయక్‌(851 లైట్‌ రెజిమెంట్‌)

ఆప‌రేష‌న్ సిందూర్ ఇదీ..

జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం ప‌హ‌ల్గామ్‌లో గ‌త ఏడాది ఏప్రిల్ 16న ఉగ్ర‌వాదులు దాడులు చేశారు. ప‌ర్యాట‌కుల పేర్లు, ఊర్లు, కులాలు, మ‌తాలు అడిగి మ‌రీ కాల్పులు జ‌ర‌ప‌డం అప్ప‌ట్లో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. నాటి దారుణ‌ ఘ‌ట‌న‌లో మొత్తం 26 మంది పౌరులు మృతి చెందారు. వీరిలో నేపాల్‌కు చెందిన ఒక పౌరుడు కూడా ఉన్నారు. ఇక‌, ఏపీ నుంచి ఇద్ద‌రు, తెలంగాణ‌కు చెందిన ఒక‌రు కూడా నాటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.

దీనికి ప్ర‌తీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర‌వాదులు, ఉగ్ర‌స్థావ‌రాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని భార‌త త్రివిధ ద‌ళా లు ఆప‌రేష‌న్ సిందూర్ పేరుతో దాడులు చేప‌ట్టాయి. ఆ దాడుల్లో ఉగ్ర‌వాదుల‌కు చెందిన శిక్ష‌ణ శిబిరాల ను నేల‌మ‌ట్టం చేయ‌డంతోపాటు ప‌లువురు ఉగ్ర‌వాదుల‌ను కూడా మ‌న సైన్యం హ‌త‌మార్చింది. అయితే.. పాక్ జ‌రిపిన ఎదురు దాడుల్లో భార‌త సైన్యానికి చెందిన ఆరుగురు అమ‌రుల‌య్యార‌ని కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా వెల్ల‌డించింది.

This post was last modified on June 26, 2026 5:42 pm

Share

Recent Posts

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

6 minutes ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

26 minutes ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

1 hour ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

3 hours ago

మహారాజాకు దక్కిన హాలీవుడ్ గౌరవం

రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…

3 hours ago

ఎల్లమ్మకు దొరికింది మంచి ఛాయిసే

సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న ఎల్లమ్మను నెలల తరబడి వేధించిన సమస్య హీరోయిన్ ఎంపిక. మృణాల్ ఠాకూర్,…

4 hours ago