రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు, ఆర్ఆర్ఆర్ కి ఇది జరిగింది. ఇప్పుడు వారణాసికి కూడా అదే రిపీటవుతుందనే అనుమానం మహేష్ బాబు అభిమానులకు రావడం సహజం. అసలే గుంటూరు కారం తర్వాత మూడేళ్ళ గ్యాప్ వచ్చింది. అందుకే ఎలాంటి వాయిదాలు లేకుండా రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ఆందోళనకు చెక్ పెడుతూ రాజమౌళి స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు.
అక్టోబర్ చివరికంతా షూటింగ్ పూర్తవుతుందని, ఇప్పటికే కీలకమైన ఎపిసోడ్ల చిత్రీకరణ ఫినిష్ చేశామని, లింకింగ్ సన్నివేశాలు, ప్యాచ్ వర్క్స్ అన్నీ త్వరలోనే కానిచ్చేసి గుమ్మడికాయ కొట్టేస్తామని స్పష్టమైన సంకేతం ఇచ్చారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ కు అయిదు నెలల సమయం సరిపోతుందా అంటే సమాధానం వెంటనే చెప్పలేం. జక్కన్న పెట్టుకున్న స్కేల్ కి, వరల్డ్ వైడ్ రావాలనుకుంటున్న రీచ్ కి ఆషామాషీ పబ్లిసిటీ చేస్తే సరిపోదు. ఓ రేంజ్ లో పనవ్వాలి.
సో రాజమౌళి మనసులో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయో ఒక్కొక్కటిగా బయటికి వస్తే తప్ప క్లారిటీ రాదు. వారణాసి రిలీజ్ వరకు తన పేరు సోషల్ మీడియాలో నానుతూ ఉండేలా చేసుకోవడం ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే మార్కెటింగ్. బాహుబలి టార్చ్ బేరర్ పేరుతో వదిలిన మేకింగ్ వీడియోకు బ్రహ్మాండమైన స్పందన దక్కింది. ఎక్స్ మొత్తం దీని వీడియోలతో నిండిపోయింది. గత ఏడాది బాహుబలి ఎపిక్ తో వార్తల్లోకి వచ్చిన ఈ ఇండియన్ స్పిల్బర్గ్ ఇప్పుడు మరోసారి హైలైట్ అవుతూ వస్తున్నారు.
2017 ఏప్రిల్ 7 వారణాసి థియేటర్లలో అడుగు పెట్టాలి. దానికి అనుగుణంగానే బిజినెస్ వ్యవహారాలు డిసెంబర్ నుంచి ఊపందుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే అమ్మకాలు చేయలేదు. ట్రైలర్ వచ్చాక అంచనాలు ఎక్కడికి వెళ్తాయో ఊహించడం కష్టమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహేష్ బాబు ఈ ప్యాన్ వరల్డ్ మూవీ ఫలితం వచ్చేదాకా ఇంకే దర్శకుడికి ఎస్ చెప్పే ఉద్దేశంలో లేరట. పలువురు దర్శకులు కలిసినప్పటికీ ఎవరికీ స్పష్టమైన హామీ లభించలేదని వినికిడి.
This post was last modified on June 26, 2026 8:08 pm
న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…
ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…
అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…
దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్…
హైదరాబాద్కు చెందిన 33 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ సిద్దిపేటలోని ఒక హోటల్ గదిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.…