కేంద్ర మంత్రివర్గం ప్రక్షాళన దాదాపు ఖరారైన నేపథ్యంలో ఏపీ నుంచి మరో ఇద్దరు ఎంపీలకు మంత్రి యోగం పట్టనుందని టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు మంత్రులుగా ఉన్నారు. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడులు మంత్రి పదవులు పొందారు. అయితే.. ఇప్పుడు జరగనున్న మంత్రివర్గ విస్తరణలో భాగంగా దక్షిణాదికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు.
మరీ ముఖ్యంగా 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి, జనసేనకు కూడా ప్రాధాన్యం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ తగ్గిన నేపథ్యంలో టీడీపీ, జనసేన బలమైన మద్దతు ప్రకటించి.. కేంద్రంలో అధికారం దక్కించుకునేందుకు బీజేపీకి సహకరించాయి. ప్రస్తుతం ఉత్తరాదిలో బీజేపీ హవా తగ్గుతూ వస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాదిపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది.
దీనిని ముందుగానే పసిగడుతున్న బీజేపీ పెద్దలు.. దక్షిణాదిలో విస్తరించేందుకు తమిళనాడు ఎన్నికలను ప్రధానంగా భావించారు. కానీ, ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో తమ మిత్రపక్షాలను మరింత దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే ఏపీకి మరో రెండు మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వీటిలో సహాయ మంత్రులు లేదా.. ఇండిపెండెంట్ మంత్రిత్వ శాఖలు ఉండే అవకాశం ఉందని సమాచారం.
ఈ రెండు కూడా.. టీడీపీకి ఒకటి జనసేనకు ఒకటి కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం టీడీపీ మంత్రులుగా ఉన్నవారిలో ఒకరు ఇండిపెండెంట్ చార్జిలో ఉండగా.. మరొకరు సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి.. ఈ దఫా రెండు పదవులు కూడా సహాయ మంత్రులుగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా కేంద్రంలో మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా కూటమి ఐక్యతను మరింత పెంచడంతోపాటు దక్షిణాది మిత్రులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్న సంకేతాలు ఇవ్వడం గమనార్హం.
క్రికెట్ ప్రపంచంలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఐసీసీ 2027…
మన దేశం నుంచి ఎంతోమంది టాలెంటెడ్ యువత సరైన రూల్స్ పాటిస్తూ చదువు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్నారు. కానీ…
తెలుగులో మరే హీరోకూ లేని విచిత్రమైన ‘అయ్యగారు’ అనే బిరుదును అఖిల్ అక్కినేని సొంతం చేసుకున్నాడంటే.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన…
వచ్చే వారం జూలై 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద క్రమంగా పాజిటివ్ బజ్ పెరుగుతోంది. టీమ్…
లెనిన్ సక్సెస్ మీట్ గుంటూరులో ఘనంగా జరిగింది. దశాబ్దంకు పైగా ఎదురు చూసిన విజయం కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున…
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మొదట 80వ…