“ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు” అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనం ఉన్న అంశాలపై తీవ్ర స్థాయిలో స్పందించే కొన్ని పార్టీలు, దేశవ్యాప్తంగా ప్రభావం చూపే అంశాలపై మాత్రం మౌనం పాటిస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం స్వయంగా రీ-నీట్ నిర్వహించింది. లక్షలాది మంది విద్యార్థులు మళ్లీ పరీక్షకు హాజరుకావాల్సి వచ్చింది. ఈ ప్రక్రియలో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, కొన్ని విషాద ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని వార్తలు వెలువడ్డాయి.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన డీఎస్సీ పరీక్షలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ప్రత్యేకంగా మీడియా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
అయితే, డీఎస్సీ విషయంలో తీవ్రంగా స్పందించిన వైసీపీ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసిన నీట్ వివాదంపై ఎందుకు అదే స్థాయిలో స్పందించలేదనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నీట్ రాసిన వారు కూడా విద్యార్థులేనని, వారి సమస్యలపై కూడా సమాన స్థాయిలో పోరాటం చేయాల్సిన అవసరం లేదా అనే చర్చ సాగుతోంది.
రాష్ట్ర స్థాయిలో ఒక అంశంపై ఆందోళన చేస్తూ, జాతీయ స్థాయిలో మరింత పెద్ద వివాదంపై మౌనం పాటించడం రాజకీయ వైఖరిలో ద్వంద్వ ప్రమాణాలకు ఉదాహరణ కాదా అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. “మేమే కాక్రోచులం” అంటూ అధికారాన్ని ప్రశ్నించే పాత్ర పోషిస్తామని చెప్పిన వైఎస్ జగన్, నీట్ అంశంపై దేశవ్యాప్త ఉద్యమాలకు ఎందుకు మద్దతు తెలపడం లేదన్న ప్రశ్న కూడా ముందుకు వస్తోంది.
This post was last modified on June 23, 2026 11:15 am
సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలను పక్కన పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నపుడు చిన్న సినిమాలు పోటీలో ఉండడం…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…