Political News

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను విడుద‌ల‌చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. తృణ‌మూల్ కాంగ్రెస్‌, జాతీయ‌ కాంగ్రెస్‌పార్టీల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా లేక‌పోయి ఉంటే..నేడు ఉన్న ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రం బంగ్లాదేశ్‌లో క‌లిసిపోయి ఉండేద‌ని ఆరోపించారు. దీనికి కార‌ణం కాంగ్రెస్‌వేర్పాటు వాద సిద్ధాంత‌మేన‌ని పేర్కొన్నారు. బుజ్జ‌గింపు రాజ‌కీయాల‌కు ఆల‌వాల‌మైన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని వేరే దేశానికి ఇచ్చేయాల‌ని చూసింద‌న్నారు.

కులం-మతం-ప్రాంతం ఆధారంగా రాజ‌కీయాలు చేసే పార్టీల‌కు దేశంలో చోటు లేద‌ని.. గ‌త 12 సంవ‌త్స‌రాలుగా ప్ర‌జ‌లు నిరూపించార‌ని ప‌రోక్షంగా ఆయ‌న కాంగ్రెస్‌పై విరుచుకుప‌డ్డారు. మ‌రో వందేళ్ల‌యినా.. కాంగ్రెస్ పార్టీ విధానం ఇంతేన‌ని విరుచుకుప‌డ్డారు. పార్టీల‌ను బుజ్జ‌గించ‌డం.. నాయ‌కుల‌ను బుజ్జ‌గించ‌డం.. అవినీతి ప‌రుల‌ను బుజ్జ‌గించ‌డం.. శ‌త్రుదేశాల‌ను బుజ్జ‌గించ‌డ‌మే కాంగ్రెస్‌వాదుల విధానమ‌ని దుయ్య‌బ‌ట్టారు. స్వాతంత్రానికి పూర్వ‌మే ఈ ప్ర‌క్రియ కొంద‌రికి అల‌వాటైంది(నెహ్రూ). అందుకే.. ప‌శ్చిమ బెంగాల్‌ను నిల‌బెట్టుకునేందుకు నాడు అనేక మంది ర‌క్త‌త‌ర్ప‌ణం చేశారు. లేక‌పోతే.. ఏనాడో ఈ రాష్ట్రం ప‌రాయి దేశం పాల‌య్యేది అని వ్యాఖ్యానించారు.

బెంగాల్‌ను బంధ విముక్తం చేశామ‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. అరాచ‌కాలు, హింస‌, ఆధిప‌త్య ధోర‌ణి, ప్ర‌జ‌ల‌ను పీడించిన పార్టీల‌కు(టీఎంసీ) ప్ర‌జ‌లు బుద్ధి చెప్పార‌ని.. ప్ర‌ధాని అన్నారు. రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు స్వేచ్ఛ లేకుండా చేసిన శ‌క్తుల‌కు త‌గిన విధంగా గుణ‌పాఠం నేర్పార‌ని అన్నారు. అయినా.. ఆయా పార్టీల్లో మార్పు రావ‌డం లేద‌న్నారు. ప్ర‌స్తుతం ఏర్ప‌డిన బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ప్ర‌భుత్వ‌మ‌ని ప్ర‌ధాని చెప్పారు. ఏ స‌మ‌స్య ఉన్నా.. ప‌రిష్కారానికి ముఖ్య‌మంత్రి సువేందు అధికారి కార్యాల‌యం తెరిచే ఉంటుంద‌న్నారు. ఎవ‌రైనా ఎప్పుడైనా రావొచ్చ‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు.

కేంద్రం ప్ర‌జ‌ల సంక్షేమం కొసం.. అమ‌లు చేసిన ప‌థ‌కాల‌ను కూడా రాష్ట్రంలో గ‌త పాల‌కులు(మ‌మ‌తా బెన‌ర్జీ) అమ‌లు చేయ‌లేద‌న్నారు. నాపై క‌క్ష‌తో ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేశారు. నేను మీరు ఎన్నుకుంటే.. ప్ర‌ధాని అయ్యాను. అది వారికి న‌చ్చ‌దు. వారికే ప‌ద‌వులు కావాలి. ప్ర‌జ‌ల తీర్పుతో ప‌నిలేదు. అందుకే.. మీపై కోపం ప్ర‌ద‌ర్శించారు. కేంద్రం అమ‌లు చేసిన‌.. 200 ప‌థ‌కాల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు అంద‌కుండా చేశారు. కానీ, ఇప్పుడు ప్ర‌తి ప‌థ‌కం మీ ముందుకే వ‌స్తుంది. నేటి నుంచి కేంద్రం అందిస్తున్న అన్ని ప‌థ‌కాలు.. ప్ర‌జ‌ల‌కుచేరువ అవుతాయి. అని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు.

This post was last modified on June 20, 2026 10:37 pm

Share

Recent Posts

తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యార్థుల కరువు

తెలంగాణాలో ఇంజనీరింగ్ కళాశాలలు విద్యార్థుల వేటలో పడ్డాయి. కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ కాకపోవడంతో ఏమి చేయాలో…

3 hours ago

బాలయ్యకు త్వరలోనే పుత్రికోత్సాహం?

స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీలో అడుగు పెట్టడం సర్వసాధారణం. దక్షిణాదిలో అత్యధిక శాతం దీన్ని కొడుకులకే పరిమితం చేస్తూ ఉంటారు.…

3 hours ago

చెడ్డపేరు చేతులారా కొని తెచ్చుకుంటున్నారు

అధికారంలో ఉండగా తమదైన బెదిరింపులకు పాల్పడిన వైపీపీ... అదికారం కోల్పోయాక మరింత దిగజారుడు తనాన్ని బయటపెట్టుకుంటోంది. మహిళలపై నిత్యం అకృత్యాలకు పాల్పడుతున్న వైసీపీ…

5 hours ago

సాయిపల్లవిని కావాలనే టార్గెట్ చేస్తున్నారా

నిన్న విడుదలైన రామాయణ నాలుగు నిమిషాల ట్రైలర్ సోషల్ మీడియాలో పెద్ద చిచ్చే పెట్టింది. ఒకవైపు ఆదిపురుష్ పోలికలను తీసుకొచ్చి…

6 hours ago

జూలై నెలాఖరు… జోష్ ఎలా ఉంది గురు

జూలై అయిపోయింది. వేసవిలో ఎండల బాలన్స్ ఏదైనా ఉందంటే ఈ నెలతో సమాప్తం అయినట్టే. ఆల్రెడీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను…

6 hours ago

మళ్ళీ పేపర్ లీక్ అయిందా సారూ…

పేపర్ లీకేజి భూతం ఒదిలిపెట్టేలా కనిపించడం లేదు.  కేంద్ర విద్యా శాఖ మంత్రిని పదవిని బలిగొన్నా అక్రమార్కులు వెనకంజ వేయడం…

6 hours ago