ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో వాళ్ళు మాట్లాడుకున్న సరదా విషయాలను పక్కన పెడితే కొందరు షార్ప్ వ్యూయర్స్ కన్ను మాత్రం ఒక క్రేజీ పాయింట్ మీద పడింది. అదేమిటంటే ఆ వీడియోలో ప్రభాస్ చేతిలో ఉన్న ఫోన్ స్క్రీన్ మీద కనిపించిన ఒక స్పెషల్ వాల్ పేపర్. ఇప్పుడు ఆ ఫోటో వెనుక ఉన్న అసలు కథ గురించి నెటిజన్ల మధ్య ఒక చర్చ మొదలైంది.
ప్రభాస్ తన ఫోన్ స్క్రీన్ మీద పెట్టుకున్న ఆ ఫోటో కల్కి సినిమాకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కాదు. ఎక్స్ ఖాతాలో ఒక అభిమాని సొంతంగా క్రియేట్ చేసిన ఆర్ట్ వర్క్ అది. మహాభారతంలోని యానిమేటెడ్ ఇలస్ట్రేషన్ స్ఫూర్తితో ప్రభాస్ లుక్ ను ఊహించుకుంటూ ఆ నెటిజన్ ఈ ఫోటోను ఎంతో అద్భుతంగా డిజైన్ చేశాడు. తన ఆర్ట్ వర్క్ ను ఏకంగా ప్రభాస్ అన్న వాల్ పేపర్ గా వాడుతున్నాడంటూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఆ నెటిజన్ సోషల్ మీడియాలో స్పెషల్ గా ఒక పోస్ట్ కూడా పెట్టాడు.
ఒక పాన్ ఇండియా స్టార్ తన ఫోన్ స్క్రీన్ మీద ఫ్యాన్ మేడ్ ఎడిట్ ను పెట్టుకోవడం నిజంగా చాలా రేర్ అని చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే సోషల్ మీడియాలో తన గురించి వచ్చే అప్డేట్స్ ను డార్లింగ్ రెగ్యులర్ గా ఫాలో అవుతాడని అర్థమవుతోంది. అంటే ఫ్యాన్స్ చేసే పనులు కూడా ప్రభాస్ గమనిస్తూ ఉంటాడన్నమాట. పైకి పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేనట్లు కనిపించినా అభిమానులు క్రియేట్ చేసే ఇలాంటి అద్భుతమైన ఆర్ట్ వర్క్స్ ను ఆయన సైలెంట్ గా చూస్తూనే ఉంటాడని ఈ ఒక్క ఇష్యూతో క్లారిటీ వచ్చేసింది.
ప్రస్తుతానికి ప్రభాస్ కల్కి పార్ట్ 2 పనుల్లో లేడు. ఆయన ఫౌజీ షూటింగ్ తో పాటు స్పిరిట్ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. కల్కి పార్ట్ 2 సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. అయినప్పటికీ ఆయన ఫోకస్ అంతా వేరే ప్రాజెక్ట్స్ మీద ఉన్నా కూడా మహాభారతం థీమ్ తో ఉన్న ఈ వాల్ పేపర్ ను తన ఫోన్ లో అలానే కంటిన్యూ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పౌరాణిక నేపథ్యం ఉన్న ఆ పాత్రకు ఆయన ఎంతలా కనెక్ట్ అయ్యాడో ఈ చిన్న యాక్షన్ తో ఈజీగా తెలిసిపోతుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…
తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు.…