పోక్సో కేసులో అరెస్టైన బండి భగరీథ్కు మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు మే 16న అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే.
నెల రోజులకు పైగా రిమాండ్ లో ఉన్న భగీరథ్ కు కోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేేయడంతో అతడికి ఊరట లభించినట్లయింది. వారం రోజుల పాటు భగీరథ్ కు బెయిల్ మంజూరైంది. ఈ నెల 28వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. అతడిపై వచ్చిన ఆరోపణల ఆధారంగా పోలీసులు పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. తనపై ఆరోపణలు వచ్చిన తర్వాత భగీరథ్ కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారం తెలంగాణలో బీజేపీని ఇరకాటంలో పడేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates