విజయవాడ యువకుడు సాయికృష్ణ మిస్టరీ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన స్పందించారు. రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. అంతేకాదు.. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని కూడా ఆదేశించారు. ఒక ప్రభుత్వంగా ఎంత వరకు స్పందించాలో.. అంతవరకు ముఖ్యమంత్రి స్పందించారు.
అయితే.. ఈ వ్యవహారంపై స్పందించిన వైసీపీ నేత, మాజీ సీఎం జగన్.. వెంటనే సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. సరే.. దీనిని కూడా అర్ధం చేసుకోవచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా.. ఆయన ఈ డిమాండ్ చేయొచ్చు. ఆయనకు ఉన్న పరిధిలో ఆయన రాజకీయంగా దీనిని వినియోగించుకుంటున్నారన్న విమర్శలను పక్కన పెట్టినా.. ప్రతిపక్ష నేతగా ఆయన ఈ డిమాండ్ చేశారని అనుకుందాం.
కానీ.. తన సొంత బాబాయి వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైనప్పుడు.. ముందు ఒక మాట.. తర్వాత మరో మాట మార్చడం.. ఇప్పుడున్న స్పీడ్.. ఆనాడు కనబరచకపోవడమే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఇదొక్కటే కాదు.. నాడు వైసీపీ ఎమ్మెల్యే అనంతబాబు.. డ్రైవర్(దళిత సామాజిక వర్గం) సుబ్రహ్మణ్యంను దారుణంగా హతమార్చి.. శవాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు.. ఇదే టీడీపీ నాడు సీబీఐకి ఇవ్వమంటే.. వ్యంగ్యాస్త్రాలు రువ్వలేదా? అనేది ప్రశ్న.
ప్రస్తుత కేసును ఎవరూ తేలికగా తీసుకోమని కానీ.. కేసును నీరుగార్చమని కానీ.. కోరుకోవడం లేదు. కానీ.. అధికారంలో ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా వ్యవహరించడమే ఇప్పుడు జగన్ పై విమర్శలు వచ్చేలా చేస్తోంది. నాడు కూడా ఇంత సచ్ఛీలంగా వ్యవహరించి.. బాధితుల పక్షాన నిలబడి ఉంటే.. ఆయన నిజాయితీని.. ప్రజాసేవను ఎవరూ శంకించేవారు కాదు. కానీ.. తనకు ఇబ్బంది వచ్చినప్పుడు.. తన పార్టీ మైలేజీ తగ్గుతోందని భావించినప్పుడు మాత్రమే సీబీఐ గుర్తుకు రావడమే ఇప్పుడు చర్చనీయాంశం. ఈ విషయంలో జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
This post was last modified on June 19, 2026 10:07 pm
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…