విజయవాడ యువకుడు సాయికృష్ణ మిస్టరీ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన స్పందించారు. రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. అంతేకాదు.. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని కూడా ఆదేశించారు. ఒక ప్రభుత్వంగా ఎంత వరకు స్పందించాలో.. అంతవరకు ముఖ్యమంత్రి స్పందించారు.
అయితే.. ఈ వ్యవహారంపై స్పందించిన వైసీపీ నేత, మాజీ సీఎం జగన్.. వెంటనే సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. సరే.. దీనిని కూడా అర్ధం చేసుకోవచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా.. ఆయన ఈ డిమాండ్ చేయొచ్చు. ఆయనకు ఉన్న పరిధిలో ఆయన రాజకీయంగా దీనిని వినియోగించుకుంటున్నారన్న విమర్శలను పక్కన పెట్టినా.. ప్రతిపక్ష నేతగా ఆయన ఈ డిమాండ్ చేశారని అనుకుందాం.
కానీ.. తన సొంత బాబాయి వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైనప్పుడు.. ముందు ఒక మాట.. తర్వాత మరో మాట మార్చడం.. ఇప్పుడున్న స్పీడ్.. ఆనాడు కనబరచకపోవడమే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఇదొక్కటే కాదు.. నాడు వైసీపీ ఎమ్మెల్యే అనంతబాబు.. డ్రైవర్(దళిత సామాజిక వర్గం) సుబ్రహ్మణ్యంను దారుణంగా హతమార్చి.. శవాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు.. ఇదే టీడీపీ నాడు సీబీఐకి ఇవ్వమంటే.. వ్యంగ్యాస్త్రాలు రువ్వలేదా? అనేది ప్రశ్న.
ప్రస్తుత కేసును ఎవరూ తేలికగా తీసుకోమని కానీ.. కేసును నీరుగార్చమని కానీ.. కోరుకోవడం లేదు. కానీ.. అధికారంలో ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా వ్యవహరించడమే ఇప్పుడు జగన్ పై విమర్శలు వచ్చేలా చేస్తోంది. నాడు కూడా ఇంత సచ్ఛీలంగా వ్యవహరించి.. బాధితుల పక్షాన నిలబడి ఉంటే.. ఆయన నిజాయితీని.. ప్రజాసేవను ఎవరూ శంకించేవారు కాదు. కానీ.. తనకు ఇబ్బంది వచ్చినప్పుడు.. తన పార్టీ మైలేజీ తగ్గుతోందని భావించినప్పుడు మాత్రమే సీబీఐ గుర్తుకు రావడమే ఇప్పుడు చర్చనీయాంశం. ఈ విషయంలో జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…