విజయవాడ యువకుడు సాయికృష్ణ మిస్టరీ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన స్పందించారు. రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. అంతేకాదు.. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని కూడా ఆదేశించారు. ఒక ప్రభుత్వంగా ఎంత వరకు స్పందించాలో.. అంతవరకు ముఖ్యమంత్రి స్పందించారు.
అయితే.. ఈ వ్యవహారంపై స్పందించిన వైసీపీ నేత, మాజీ సీఎం జగన్.. వెంటనే సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. సరే.. దీనిని కూడా అర్ధం చేసుకోవచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా.. ఆయన ఈ డిమాండ్ చేయొచ్చు. ఆయనకు ఉన్న పరిధిలో ఆయన రాజకీయంగా దీనిని వినియోగించుకుంటున్నారన్న విమర్శలను పక్కన పెట్టినా.. ప్రతిపక్ష నేతగా ఆయన ఈ డిమాండ్ చేశారని అనుకుందాం.
కానీ.. తన సొంత బాబాయి వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైనప్పుడు.. ముందు ఒక మాట.. తర్వాత మరో మాట మార్చడం.. ఇప్పుడున్న స్పీడ్.. ఆనాడు కనబరచకపోవడమే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఇదొక్కటే కాదు.. నాడు వైసీపీ ఎమ్మెల్యే అనంతబాబు.. డ్రైవర్(దళిత సామాజిక వర్గం) సుబ్రహ్మణ్యంను దారుణంగా హతమార్చి.. శవాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు.. ఇదే టీడీపీ నాడు సీబీఐకి ఇవ్వమంటే.. వ్యంగ్యాస్త్రాలు రువ్వలేదా? అనేది ప్రశ్న.
ప్రస్తుత కేసును ఎవరూ తేలికగా తీసుకోమని కానీ.. కేసును నీరుగార్చమని కానీ.. కోరుకోవడం లేదు. కానీ.. అధికారంలో ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా వ్యవహరించడమే ఇప్పుడు జగన్ పై విమర్శలు వచ్చేలా చేస్తోంది. నాడు కూడా ఇంత సచ్ఛీలంగా వ్యవహరించి.. బాధితుల పక్షాన నిలబడి ఉంటే.. ఆయన నిజాయితీని.. ప్రజాసేవను ఎవరూ శంకించేవారు కాదు. కానీ.. తనకు ఇబ్బంది వచ్చినప్పుడు.. తన పార్టీ మైలేజీ తగ్గుతోందని భావించినప్పుడు మాత్రమే సీబీఐ గుర్తుకు రావడమే ఇప్పుడు చర్చనీయాంశం. ఈ విషయంలో జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…