2024 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన విశ్వంభర టీజర్ మీద నెగటివ్ రియాక్షన్లు చాలా వచ్చాయి. ట్రోలింగ్ జరిగింది. దెబ్బకు టీమ్ అలెర్ట్ అయిపోయి మొత్తం కంటెంట్ రిపేర్లు చేయడానికి పూనుకుంది. 2025 మెగాస్టార్ బర్త్ డేకి ఇంకో టీజర్ వదిలారు. ఇది కొంచెం పర్వాలేదనిపించింది కానీ మరీ మైండ్ బ్లోయింగ్ కాదు. ఈలోగా మన శంకరవరప్రసాద్ గారు విడుదలైపోవడం, బ్లాక్ బస్టర్ కావడం జరిగాయి. సరే ఇదంతా అయ్యాక కూడా విశ్వంభరలో చలనం కనిపించడం లేదు.
ఒకళ్ళేమో దసరా అంటారు. ఇంకొకరెమో ముందు బాబీ తీస్తున్న మెగా 158 సంక్రాంతికి విడుదలయ్యాక అటుపై వేసవిలో విశ్వంభర వస్తుందని అంటున్నారు. ఏది నిజమో అర్థం కాక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పటికే ఈ ప్యాన్ ఇండియా మూవీ మీద బజ్ సున్నా అయిపోయింది. మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి హైప్ ని సృష్టించుకుంటూ రావాలి. అప్పుడెప్పుడో వదిలిన శ్రీరామ నవమి పాటకు కూడా స్పందన అంతంతమాత్రంగా వచ్చింది.
మొండిగోడల మీద వర్షం పడినట్టు విశ్వంభర మరీ ఇంత చలనం లేని స్ట్రాటిజిని ఎంచుకోవడం సరికాదు. హీరో ఎవరైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనంలో ఒక సినిమా మీద అంచనాలు సజీవంగా ఉండాలంటే దాన్ని ఏదో ఒక రూపంలో పబ్లిక్ మాట్లాడుకునేలా చేయాలి. అవసరానికి మించి రాజమౌళి తన వారణాసిని ఎందుకు హై మార్కెటింగ్ చేస్తున్నారు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ఉన్నారని లైట్ తీసుకోలేదు. ఏడాది ముందు నుంచే సౌండ్ చేస్తున్నారు.
నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు కానీ పేకమేడలా కూలిపోతున్న విశ్వంభర బజ్ ని తిరిగి బ్రతికించే సంజీవని కేవలం అప్డేట్స్ మాత్రమే. ఏ పండగ వచ్చినా కనీసం పోస్టర్లు వదలడం లేదు. ఆర్టిస్టుల పుట్టినరోజులు వస్తే మొక్కుబడిగా విషెస్ తప్ప ఇంకేం ఉండవు. ఇంకో రెండు నెలల్లో ఆగస్ట్ 22 మళ్ళీ చిరంజీవి పుట్టినరోజు వస్తోంది. అప్పటికైనా సాలిడ్ గా ఒక నిర్ణయం తీసుకుని శుభవార్త చెబుతారో లేక మేమింతే అంటూ పాత పద్ధతి కొనసాగిస్తారో చూడాలి.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…