విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ సాయికృష్ణ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై సస్పెన్షన్ వేటు పడింది. నాగరాజుపై కేసు కూడా నమోదైంది. ఈ రోజు ఆయనను అరెస్టు చేసే అవకాశముంది. అయితే, సాయికృష్ణ కుటుంబ సభ్యులను నిన్న పరామర్శించిన ఏపీ మాజీ సీఎం జగన్…ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబును సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిశారు. వారిని చంద్రబాబు తన కార్యాలయానికి పిలిపించుకొని భరోసానిచ్చారు. సాయికృష్ణ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు చెప్పారు. అంతేకాదు, సాయికృష్ణ అదృశ్యంపై ఉన్నతస్థాయి విచారణ జరుపుతున్నామని, తప్పుచేసినవారు ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు.
ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వానికి సాయికృష్ణ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తమకు అండగా నిలిచిన రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు చెప్పారు. సాయికృష్ణ అదృశ్యం అంశంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపారని, ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు.
This post was last modified on June 19, 2026 4:09 pm
AI వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఓపెన్ఏఐ తీసుకొచ్చిన GPT-6 ఆస్ట్రా ఆ భయాన్ని మరో…
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అటవీ ప్రాంత ఐదు పిల్ల ఒరాంగుటాన్లు కనిపించడం కలకలం రేపింది. బడపై గ్రామం సమీపంలోని రణకథ…
భయపడినట్టే జరిగేలా ఉంది. డిసెంబర్ 3 అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీని ఫౌజీ వదులుకునేలా ఉంది. ఇంకా షూటింగ్ జరుగుతూ…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ…
ఏపీలో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండున్నరేళ్ళ తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అధికార,…
అదేంటి రాముడు యుద్ధం చేయాల్సింది రావణుడితో కదా, మరి గాడ్జిల్లాతో ఏంటని ఆశ్చర్యపోకండి. విషయం వేరే ఉంది. నవంబర్ 6…