ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణలోనూ కీలక అడుగు వేసింది. పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయం శుక్రవారం భాగ్య నగరి హైదరాబాద్ లో ప్రారంభమైంది. వేద పండితులు నిర్ణయించిన శుభ ముహూర్తాన శుక్రవారం మధ్యాహ్నం తర్వాత నగరంలోని మణికొండలో జనసేన తెలంగాణ శాఖ కార్యాలయాన్ని పార్టీకి చెందిన తెలంగాణ నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా కార్యక్రమాలను నిర్వహించిన తర్వాత పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు పార్టీ తెలిపింది.
జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలన్నీ పార్టీ తెలంగాణ శాఖ నేతల ఆధ్వర్యంలోనే జరగగా… ఆ తర్వాత పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయ ప్రాంగణంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టారు. కార్యాలయ భవనం మొత్తాన్ని పరిశీలించిన పవన్… పార్టీ అధ్యక్షుడి హోదాలో తనకు కేటాయించిన గదిలోకి అడుగుపెట్టిన పవన్… తన కుర్చీలో కూర్చున్నారు. హైదరాబాద్ లోని మణికొండలో నూతనంగా నిర్మించిన భవనంలో జనసేన కార్యాలయం కొలువుదీరింది.
జనసేన పార్టీ ఆవిర్భావం హైదరాబాద్ లోనే జరిగిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీకే పరిమితం అయిన జనసేన తాజాగా తెలంగాణలోనూ యాక్టివ్ అయ్యింది. తెలంగాణ సమస్యలపైనా పోరాటం సాగిస్తామని స్వయంగా పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం కూడా ఏర్పాటు కావడం గమనార్హం. ఇప్పటిదాకా ఏపీలోనే యాక్టివ్ గా ఉన్న జనసేనకు తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళం, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లోనూ పార్టీ శాఖల ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో కాకుండా పార్టీ రాష్ట్ర శాఖ తొలిసారిగా తెలంగాణలోనే ప్రారంభం కావడం గమనార్హం.
ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్న దరిమిలా… హైదరాబాద్ లో పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం మాదిరిగానే ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ శాఖ కార్యాలయాలు ప్రారంభం కానున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. వెరసి జనసేన ఇక ఎంతమాత్రం ప్రాంతీయ పార్టీ కాదని, ఇకపై జనసేన ఓ జాతీయ పార్టీగానే పరిగణించాల్సిన అవసరం ఉందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ విశ్లేషణలు నిజమేనన్నట్లుగా ఇప్పుడు పార్టీకి సంబంధించిన తెలంగాణ శాఖకు అధికారికంగా రాష్ట్ర కార్యాలయం ప్రారంభం కావడం జన సైనికులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది.
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…