గత ఎన్నికల సమయంలో మంగళగిరిలోని ప్రతి వీధిలోనూ పర్యటించిన నారా లోకేష్.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదే.. మురుగునీటి సమస్య. చిన్న చినుకుపడ్డా.. నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు సహా.. అన్ని ప్రాంతాలు.. కాలువలను తలపిస్తాయి. ఇక, మురగునీరుతో ప్రాంతాలుదుర్గంధం వెదజల్లు తుంటాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు పడడమే కాకుండా.. అనారోగ్యాల పాలవుతున్నారు.
రెండుసార్లు.. ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్నారెడ్డి ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి కూడా దానిని అలానే వదిలేశారు. మంగళగిరి నియోజకవర్గం వ్యాప్తంగా బలమైన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే దీనికి కారణమని గుర్తించిన నారా లోకేష్.. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. మునిసిపల్ ఇంజనీర్లతో అధ్యయనం చేయించారు. భూగర్భ డ్రైనేజీని ఎక్కడ నుంచి ఎక్కడ వరకు నిర్మించాలన్న విషయంపై పక్కా ప్లాన్ తీసుకున్నారు.
తాజాగా దీనికి సంబంధించి.. భూమి పూజ పనులు చేపట్టారు. ప్రస్తుత అంచనాల ప్రకారం.. మంగళగిరి నియోజకవర్గంలోని 70 శాతం ప్రాంతంలో.. ఈ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. తద్వారా.. స్థాని కంగా ఉత్పత్తి అయ్యే మురుగునీరుతోపాటు.. వర్షాల కారణంగా ఏర్పడే నీరు కూడా.. సులభంగా తరలి పోయేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. దీనికి తాజాగా భూమి పూజ చేసిన నారా లోకేష్.. మంగళగిరి వాసుల దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపించారు.
ప్రాజెక్టు డైమన్షన్స్ ఇవీ..
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…