2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 100 శాతం స్ట్రైక్ రేట్ తో జనసేనను గెలిపించిన పవన్ కల్యాణ్…ఏపీలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో పవన్ తన మార్క్ చూపించారు. అదే సమయంలో ఏపీతో పాటు తెలంగాణలోనూ జనసేనను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై పవన్ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు.
ఈ నేపథ్యంలోనే జనసేనలో చేరికలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు పవన్. అందుకోసం 14 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి జాయినింగ్స్ కమిటీని తాజాగా ఏర్పాటు చేశారు. ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలను పార్టీలోకి ఆహ్వానించడమే లక్ష్యంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత జాయినింగ్స్ కమిటీతో ప్రత్యేకంగా పవన్ భేటీ కాబోతున్నారు. పార్టీలో చేరికలపై కమిటీ సభ్యులకు పవన్ దిశానిర్ధేశం చేయనున్నారు.
మరోవైపు, ఢిల్లీలో ‘ సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం’ 2వ రోజు సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ 5 తీర్మానాలకు ఆమోదం తెలిపారు.
This post was last modified on June 16, 2026 2:58 pm
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…
సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…
తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…
విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…