2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 100 శాతం స్ట్రైక్ రేట్ తో జనసేనను గెలిపించిన పవన్ కల్యాణ్…ఏపీలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో పవన్ తన మార్క్ చూపించారు. అదే సమయంలో ఏపీతో పాటు తెలంగాణలోనూ జనసేనను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై పవన్ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు.
ఈ నేపథ్యంలోనే జనసేనలో చేరికలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు పవన్. అందుకోసం 14 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి జాయినింగ్స్ కమిటీని తాజాగా ఏర్పాటు చేశారు. ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలను పార్టీలోకి ఆహ్వానించడమే లక్ష్యంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత జాయినింగ్స్ కమిటీతో ప్రత్యేకంగా పవన్ భేటీ కాబోతున్నారు. పార్టీలో చేరికలపై కమిటీ సభ్యులకు పవన్ దిశానిర్ధేశం చేయనున్నారు.
మరోవైపు, ఢిల్లీలో ‘ సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం’ 2వ రోజు సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ 5 తీర్మానాలకు ఆమోదం తెలిపారు.
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…