2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 100 శాతం స్ట్రైక్ రేట్ తో జనసేనను గెలిపించిన పవన్ కల్యాణ్…ఏపీలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో పవన్ తన మార్క్ చూపించారు. అదే సమయంలో ఏపీతో పాటు తెలంగాణలోనూ జనసేనను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై పవన్ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు.
ఈ నేపథ్యంలోనే జనసేనలో చేరికలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు పవన్. అందుకోసం 14 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి జాయినింగ్స్ కమిటీని తాజాగా ఏర్పాటు చేశారు. ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలను పార్టీలోకి ఆహ్వానించడమే లక్ష్యంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత జాయినింగ్స్ కమిటీతో ప్రత్యేకంగా పవన్ భేటీ కాబోతున్నారు. పార్టీలో చేరికలపై కమిటీ సభ్యులకు పవన్ దిశానిర్ధేశం చేయనున్నారు.
మరోవైపు, ఢిల్లీలో ‘ సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం’ 2వ రోజు సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ 5 తీర్మానాలకు ఆమోదం తెలిపారు.
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…
పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…
రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే కొన్నిసార్లు అవి శృతిమించిపోయి వివాదాలకు తావిస్తున్నాయి. ఏపీ రాజకీయాలు ఇందుకు మినహాయింపు…