Political News

ముందు పగ… తర్వాతే అభివృద్ది అంటే ఎలా జగన్?

2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం పక్కా అని భావించిన వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. అంతే అప్పటిదాకా ఓ రేంజిలో ధీమా చూపించిన వైసీపీ శ్రేణులంతా గప్ చుప్ అయిపోయాయి. ఆపై కొంతకాలం పాటు సైలెంట్ గానే ఉన్న వైసీపీ శ్రేణులు…తమ పరాజయానికి కారణమేమిటన్న దానిపై బాగానే ఆలోచించాయి. ఈ సందర్భంగా తమ పరాజయం కంటే కూటమి పార్టీల గెలుపునకు కారణమేమిటన్న దానిపైనే వైసీపీ నేతలంతా దృష్టి సారించినట్లున్నారు.

లోకేశ్ నోట వినిపించిన రెడ్ బుక్ కూటమికి విజయం కట్టబెట్టిందని ఓ తీర్మానానికి వచ్చిన వైసీపీ నేతలు… ఇప్పుడు లోకేష్ బాటలోనే నడుస్తున్నారు. అయితే లోకేశ్ ఓ క్రమ పద్ధతిలో రెడ్ బుక్ ను వాడితే.. వైసీపీ మాత్రం దాని అర్థాన్నే మార్చేశాయి. వెరసి వైసీపీ నోట బెదిరింపులు తప్పించి మరో మాట వినిపించడం లేదు. వెరసి ఇలాగైతే ఇక వైసీపీ గెలిచినట్టే… జగన్ మరోమారు సీఎం అయినట్టేనన్న సెటైర్లు పడిపోతున్నాయి.

ఈ క్రమంలో భాగంగానే ఇప్పుడు వైసీపీ కీలక నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశంలో చేసిన తాజా వ్యాఖ్యలు కలకలమే రేపుతున్నాయి. ఓ రాజకీయ నాయకుడు మంచి చేయకున్నా ఫర్వా లేదు గానీ… సమాజంలో అశాంతి రేకెత్తేలా ఉద్రేకపూరిత ప్రసంగాలు చేయరాదని ఆయన మాటలు విన్నవారంతా చెబుతున్నారు. అయినా మహేశ్ రెడ్డి నోట నుంచి వచ్చిన మాటలు జగన్ పతనానికి దారి తీసేలా ఉన్నాయి గానీ… జగన్ ను ఈ వ్యాఖ్యలు మరోమారు సీఎంగా ఎలా చేస్తాయన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

అయినా ఈ సమావేశంలో మహేశ్ రెడ్డి ఏమన్నారన్న విషయానికి వస్తే… వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. మనం మళ్లీ అదికారంలోకి వస్తున్నామని ఆయన తెలిపారు. ఈసారి అధికారంలోకి వస్తే మునుపటిలా పరిస్థితి ఉండదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలలు అభివృద్ధి అనే మాట ఉండదన్నారు. ఆ ఆరు నెలల పాటు పగ తీర్చుకోవడం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాతే అభివృద్ది అయినా, ఇంకేదైనా? అని ఆయన తనదైన శైలిలో చెప్పుకుపోయారు.

కాసు మహేశ్ రెడ్డి ఓ మాజీ ముఖ్యమంత్రి మనవడు. ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు ఆయన. ఇక మహేశ్ రెడ్డి తండ్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. ఈ లెక్కన మహేశ్ రెడ్డి చాలా పరిణతి కలిగిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చినట్టే లెక్క. అయితే ఆయన నోట నుంచి వస్తున్న ఈ తరహా ఉద్రేకపూరిత వ్యాఖ్యలు చూస్తుంటే… కాసు ఫ్యామిలీలో ఇలాంటి నేత ఎలా వచ్చారన్న అనుమానం కలగక మానదు. ఈ తరహా ప్రసంగాలతో మహేశ్ రెడ్డి తన అనుచరులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారన్న దానిపై పెద్ద చర్చే నడుస్తోంది.

Kumar

Recent Posts

సింగీతానికి ప్రాణం పోసావయ్యా దేవి

భారతీయ సినిమాలో ఇంకెవరికీ సాధ్యం కాని రీతిలో 94 ఏళ్ల వయసులో ఫీచర్ ఫిలిం తీసి అబ్బురపరిచారు సింగీతం శ్రీనివాసరావు.…

9 minutes ago

‘వర్క్ ఆన్ బైక్’… ఇది టూ మచ్ గురు!

కరోనా మహమ్మారి పుణ్యమా అని వర్క్ ఫ్రమ్ హోమ్ మన జీవనయానంలో ఓ విదానం అయితే… ఆ తీరు ప్రభావం…

1 hour ago

బాహుబలి ఎపిక్… ఇదేం విడ్డూరం

గత ఏడాది బాహుబలి రెండు భాగాలను సింగల్ పార్ట్ గా మార్చి బాహుబలి ది ఎపిక్ పేరుతో విడుదల చేసిన…

3 hours ago

వ‌డ్డే న‌వీన్ అంత ప‌వ‌ర్ ఫుల్లా?

90వ ద‌శ‌కంలో మ‌న‌సిచ్చి చూడు.. చాలాబాగుంది స‌హా ప‌లు ఫ్యామిలీ సినిమాల‌తో ఆక‌ట్టుకున్న న‌టుడు వ‌డ్డే నవీన్. జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌ల…

5 hours ago

రిస్కు చేయడమే విలువను పెంచుతోంది

టాలీవుడ్ లో ఉన్న చాలా అగ్ర నిర్మాణ సంస్థలు బిజినెస్ లెక్కల ఆధారంగానే సినిమాలు తీస్తున్న మాట వాస్తవం. హీరో…

5 hours ago

మల్లు అర్జున్ క్రేజ్ చెక్కు చెదరలేదు

మనం తమిళ హీరోలు రజనీకాంత్, విజయ్, సూర్య లాంటి వాళ్ళను నెత్తినబెట్టుకుని చూస్తాం కానీ మనోళ్ళను వాళ్ళు పిచ్చ లైట్…

5 hours ago