Political News

ముందు పగ… తర్వాతే అభివృద్ది అంటే ఎలా జగన్?

2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం పక్కా అని భావించిన వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. అంతే అప్పటిదాకా ఓ రేంజిలో ధీమా చూపించిన వైసీపీ శ్రేణులంతా గప్ చుప్ అయిపోయాయి. ఆపై కొంతకాలం పాటు సైలెంట్ గానే ఉన్న వైసీపీ శ్రేణులు…తమ పరాజయానికి కారణమేమిటన్న దానిపై బాగానే ఆలోచించాయి. ఈ సందర్భంగా తమ పరాజయం కంటే కూటమి పార్టీల గెలుపునకు కారణమేమిటన్న దానిపైనే వైసీపీ నేతలంతా దృష్టి సారించినట్లున్నారు.

లోకేశ్ నోట వినిపించిన రెడ్ బుక్ కూటమికి విజయం కట్టబెట్టిందని ఓ తీర్మానానికి వచ్చిన వైసీపీ నేతలు… ఇప్పుడు లోకేష్ బాటలోనే నడుస్తున్నారు. అయితే లోకేశ్ ఓ క్రమ పద్ధతిలో రెడ్ బుక్ ను వాడితే.. వైసీపీ మాత్రం దాని అర్థాన్నే మార్చేశాయి. వెరసి వైసీపీ నోట బెదిరింపులు తప్పించి మరో మాట వినిపించడం లేదు. వెరసి ఇలాగైతే ఇక వైసీపీ గెలిచినట్టే… జగన్ మరోమారు సీఎం అయినట్టేనన్న సెటైర్లు పడిపోతున్నాయి.

ఈ క్రమంలో భాగంగానే ఇప్పుడు వైసీపీ కీలక నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశంలో చేసిన తాజా వ్యాఖ్యలు కలకలమే రేపుతున్నాయి. ఓ రాజకీయ నాయకుడు మంచి చేయకున్నా ఫర్వా లేదు గానీ… సమాజంలో అశాంతి రేకెత్తేలా ఉద్రేకపూరిత ప్రసంగాలు చేయరాదని ఆయన మాటలు విన్నవారంతా చెబుతున్నారు. అయినా మహేశ్ రెడ్డి నోట నుంచి వచ్చిన మాటలు జగన్ పతనానికి దారి తీసేలా ఉన్నాయి గానీ… జగన్ ను ఈ వ్యాఖ్యలు మరోమారు సీఎంగా ఎలా చేస్తాయన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

అయినా ఈ సమావేశంలో మహేశ్ రెడ్డి ఏమన్నారన్న విషయానికి వస్తే… వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. మనం మళ్లీ అదికారంలోకి వస్తున్నామని ఆయన తెలిపారు. ఈసారి అధికారంలోకి వస్తే మునుపటిలా పరిస్థితి ఉండదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలలు అభివృద్ధి అనే మాట ఉండదన్నారు. ఆ ఆరు నెలల పాటు పగ తీర్చుకోవడం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాతే అభివృద్ది అయినా, ఇంకేదైనా? అని ఆయన తనదైన శైలిలో చెప్పుకుపోయారు.

కాసు మహేశ్ రెడ్డి ఓ మాజీ ముఖ్యమంత్రి మనవడు. ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు ఆయన. ఇక మహేశ్ రెడ్డి తండ్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. ఈ లెక్కన మహేశ్ రెడ్డి చాలా పరిణతి కలిగిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చినట్టే లెక్క. అయితే ఆయన నోట నుంచి వస్తున్న ఈ తరహా ఉద్రేకపూరిత వ్యాఖ్యలు చూస్తుంటే… కాసు ఫ్యామిలీలో ఇలాంటి నేత ఎలా వచ్చారన్న అనుమానం కలగక మానదు. ఈ తరహా ప్రసంగాలతో మహేశ్ రెడ్డి తన అనుచరులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారన్న దానిపై పెద్ద చర్చే నడుస్తోంది.

This post was last modified on June 13, 2026 1:06 pm

Share

Recent Posts

బట్వారా పబ్లిక్ టాక్ తేడాగా ఉందే…

తాజాగా విడుదలైన బట్వారా 1947 ఆశించిన స్థాయిలో ఓపెనింగ్ తెచ్చుకోలేకపోవడం బయ్యర్ వర్గాలను నిరాశ పరుస్తోంది. అనూహ్యంగా ఆవారాపన్ 2…

45 seconds ago

‘సనాతన’ వివాదంపై అనసూయ క్లారిటీ

టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, అనుకున్నది ఠక్కున చెప్పేయడం ఆమె నైజం. ఇక,…

2 hours ago

ప‌వ‌న్ స‌తీమ‌ణి సింప్లిసిటీ… రైలులో పిఠాపురం వరకు..

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సతీమ‌ని అన్నా కొణిదెల ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్నారు. త‌న…

2 hours ago

రాజగోపాల్ రెడ్డిపై ఈసారి వేటు తప్పదా?

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్న సంగతి…

3 hours ago

మైత్రీ సినిమాలన్నీ గతంలోకే వెళ్తున్నాయే!

మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రెజెంట్ నడుస్తున్న కథల కంటే…

4 hours ago

రేషన్ కార్డుపై మోదీ బొమ్మ వేయాల్సిందే!

ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు.…

4 hours ago