ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక, సోషల్ మీడియాలో నేతలంతా యాక్టివ్ గా ఉండాలని అన్ని పార్టీల అధినేతలు నిక్కచ్చిగా చెబుతున్నారంటే పబ్లిసిటీ, ప్రమోషన్, సోషల్ మీడియా ఎఫెక్ట్ ప్రజలపై ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
అందుకే, ముఖ్యంగా రాజకీయ నేతలు తమను తాము ప్రచారం చేసుకునేందుకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు. ఈ క్రమంలోనే తెలంగాణలోని రేషన్ కార్డులపై ప్రధాని మోదీ బొమ్మ వేయాల్సిందేనని, లేకుంటే ప్రజా ఉద్యమం చేసి తీరతానని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తాజాగా చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
రేపు తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారికి రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. అయితే, ఆ కార్డులపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫొటోలు మాత్రమే వేశారు. దీంతో, ఆ వ్యవహారంపై రఘునందన్ రావు స్పందించారు. రేషన్ కార్డు వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం కిలో బియ్యం మాత్రమే ఇస్తోందని, కానీ, కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇస్తోందని గుర్తు చేశారు. అటువంటిది మోదీ ఫొటో వేయకుండా కార్డులు ఎలా పంపిణీ చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు, మోదీ ఫొటో వేశాకే రేషన్ కార్డుల పంపిణీ చేయాల్సి, అప్పటి దాకా ఆ పంపిణీ కార్యక్రమం నిలిపి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ, మోదీ ఫొటో లేకుండా కార్డుల పంపిణీ చేపడితే ప్రజా ఉద్యమం తప్పదని రేవంత్ సర్కార్ ను హెచ్చరించారు. అయితే, రఘునందన్ రావు ప్రజా సమస్యలపై పోరాడి ప్రజా ఉద్యమం చేస్తే బాగుంటుందని, ఇలా మోదీ ఫొటో అంశంపై ఉద్యమం చేయడం ఏమిటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on August 14, 2026 6:34 pm
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…
సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం ఇదే రోజు 1986 సంవత్సరం ఆగస్ట్ 14 కలియుగ పాండవులు రిలీజయ్యింది. మాములుగా స్టార్…
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ శర్మ చేసిన బైక్ యాక్సిడెంట్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…
కొత్తగా రిలీజైన సినిమాల్లో అడ్వాన్స్ బుకింగ్ పరంగా దూసుకుపోతున్న సినిమాగా ఆవారాపన్ 2 అన్ని రాష్టాల ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.…
నేను కూడా సైబర్ బాదితుడినే… అందుకే వారానికోసారి మొబైల్ ఫోన్ పాస్వర్డ్ మారుస్తుంటానని చెప్పారు హీరో నాగార్జున. కంప్యూటర్ విప్లవం…
టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే అయితే అతివృష్టి లేదా అనావృష్టి లాగా మారిపోయింది. జనవరి తర్వాత రెండు మూడు…