Political News

‘కేసీఆర్‌… చెల్ల‌ని వెయ్యి నోటుతో స‌మానం’

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప‌ని అయిపోయింద‌ని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ఆయ‌న స‌హా.. ఆయ‌న పార్టీ బీఆర్ ఎస్‌కు కూడా.. గ‌త‌మే త‌ప్ప‌.. భ‌విష్య‌త్తు లేద‌న్నారు. చెప్తున్న క‌దా.. కేసీఆర్‌.. చెల్ల‌ని వెయ్యి నోటుతో స‌మానం. ర‌ద్ద‌యిన వెయ్యి రూపాయ‌ల నోటుకు విలువ ఉందా? .. అట్లే.. కేసీఆర్‌కు కూడా విలువ లేదు. ఇంక ఆ పార్టీ నాయ‌కులు చేసే వ్యాఖ్య‌ల‌కు కూడా అంతే విలువ లేదు అని రేవంత్ రెడ్డి చెప్పారు.

పైసాకు కూడా విలువ లేని నాయ‌కులు ఇప్పుడు మాట్లాడుతున్నారు.. అని దుయ్య‌బ‌ట్టారు. రేవంత్‌ రెడ్డిని ఏదో అంటే తాము ఎదుగుతామ‌ని బీఆర్ ఎస్ నాయ‌కులు భావిస్తున్నారు. కానీ, విలువ లేని నాయ‌కులు చేసే వ్యాఖ్య‌ల‌ను ప్ర‌జ‌లు ప‌ట్టించుకోర‌ని చెప్పారు. ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా.. రేవంత్ వైపే ప్ర‌జ‌లు ఉన్నారన్న‌ది వాస్త‌వం కాదా? అని ప్ర‌శ్నించారు. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల కోసం కొంద‌రు డ్రామాలు ఆడుతున్నారని…. దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని చెప్పారు.

కూలేశ్వ‌రం..

బీఆర్ఎస్ హ‌యాంలో నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టును మ‌రోసారి కూలేశ్వ‌రం అంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. కూలేశ్వ‌రం ప్రాజెక్టు కూలిపోయిన త‌ర్వాత‌.. దాని నుంచి చుక్క‌నీరు కూడా తీసుకోలేద‌ని తెలిపారు. అయినా .. కూడా రైతులు భారీగా వ‌రి పండించార‌ని చెప్పారు. అధికారంలో ఉన్న‌ప్పుడు క‌న్ను మిన్ను కాన‌కుండా అవినీతికి పాల్ప‌డిన వారు.. ఇప్పుడు నీతులు చెబుతుంటే.. ఎవ‌రు న‌మ్ముతార‌ని నిల‌దీశారు.

త్వ‌ర‌లోనే పూర్తి..

ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో ప్రాజెక్టుల పూర్తికి అధ్య‌య‌నం చేస్తున్న‌ట్టు సీఎం తెలిపారు. ముఖ్యంగా బ్యారేజీపై బ్రిడ్జ్‌ల‌ను నిర్మించేందుకు అధ్యయ‌నం కొన‌సాగుతోంద‌ని.. త్వ‌ర‌లోనే అన్ని ప్రాజెక్టుల‌ను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని తెలిపారు. యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేసిన త‌ర్వాతే.. ఇక్క‌డి ప్ర‌జ‌లను తాను మ‌రోసారి క‌లుస్తాన‌ని చెప్పారు. భూసేక‌ర‌ణ విష‌యంలో రైతుల‌కు అన్యాయం జ‌ర‌గ‌ద‌ని.. సాధ్య‌మైనంత త‌క్కువ భూసేక‌ర‌ణ చేసేందుకు ప్ర‌భుత్వం ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు చెప్పారు.

This post was last modified on June 6, 2026 8:45 am

Share

Recent Posts

NBK 111… గాయం మార్చిన లక్ష్యం

బాలయ్య నిన్న జరిగిన NBK 111 షూటింగ్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తీవ్రమైన గాయం కాకపోవడంతో అభిమానులు…

12 minutes ago

వావ్… ఏపీ లో యూఏఈ పెట్టుబడులు

ఏపీ సీఎం చంద్ర‌బాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో…

1 hour ago

డెంగీ తాట తీసే టీకా వచ్చేస్తోంది

‘డెంగీ’ దెబ్బ ఎంతలా ఇబ్బంది పెడుతుందో.. మనిషిని ఎంతలా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. డెంగీ బారిన…

4 hours ago

విజ‌య్ జననాయకుడు వెనకపడ్డాడు

త‌మిళ సినిమాల మీద తెలుగు ప్రేక్ష‌కుల ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ద‌శాబ్దాలుగా అక్క‌డి నుంచి వ‌చ్చే అనువాద…

9 hours ago

జగన్ ఎలా అంటే కేటీఆర్ కూడా అలానే

జగన్ ఇటీవ‌ల కాలంలో స‌హ‌నం కోల్పోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న పార్టీ వారిపై కేసులు పెట్టినా.. త‌మ…

12 hours ago

అంజికి ఒడిస్సికి కనెక్షన్ ఏంటి

అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…

12 hours ago