వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి శ్రీకారం చుట్టారు. వయోవృద్ధులు.. ఇక, వచ్చే ఎన్నికల్లో అవకాశం దక్కని వారికి ఈ కమిటీలో చోటు కల్పించారు. ఈ కమిటీని ఏర్పాటు చేసిన సమయంలోనే జగన్ కొన్ని నిర్దేశాలు చెప్పారు. పార్టీకి సరైన దిశగా సలహాలు ఇవ్వాలని.. సూచనలు చేయాలని ఆయన పేర్కొన్నారు.
కానీ, అనుకున్న విధంగా పీఏసీ నాయకులు ఎవరూ స్పందించడం లేదు. జగన్ ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా పీఏసీలోని నాయకులు వ్యవహరిస్తున్నారన్న వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో చేపట్టే కార్యక్రమాలకు పెద్దగా మైలేజీ రావడం లేదని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ పీఏసీపై కినుక వహిస్తున్నారని సమాచారం. పనిచేయకపోతే.. పీఏసీని మారుస్తారంటూ.. ఇటీవల సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
తాజాగా పీఏసీ కార్యాచరణ, పనులు, పార్టీలో యాక్టివ్ రోల్ వంటివాటిపై జగన్ ఆరా తీశారు. దీనిలో ఎక్కువ మంది పీఏసీ నాయకులు మౌనంగా ఉంటున్నారని.. ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలకు.. కౌంటర్లు ఇవ్వలేక పోతున్నారని తెలిసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్.. పీఏసీ కమిటీ సభ్యుల వివరాలను మరోసారి తీసుకున్నారు. దీనిలో ఉన్న కొందరు నాయకులు పార్టీకి పెద్దగా ప్రయోజనం లేకుండా పోయారని అంటున్నారు.
అయితే.. పీఏసీలో ఉన్న నాయకుల నుంచి మరో వాదన వినిపిస్తోంది. తమను కనీసంపట్టించుకునే వారు లేరని వారు చెబుతున్నారు. తాము సూచనలు, సలహాలు ఇచ్చినా.. ఎవరూ ఆచరించడం లేదని.. తీసేసిన తహసీల్దార్ మాదిరిగా తమ పరిస్థితి మారిపోయిందని వాపోతున్నారు. తాము కూడా యాక్టివ్ రోల్ పోషిస్తున్నామని.. కానీ, తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని అంటున్నారు. జగన్ తమను పిలిస్తే.. జాబితానే వెల్లడిస్తామని చెబుతున్నారు. సో.. మొత్తంగా పీఏసీ వ్యవహారం వైసీపీలో పెను సంచలనంగా మారింది.
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…
టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం…