వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి శ్రీకారం చుట్టారు. వయోవృద్ధులు.. ఇక, వచ్చే ఎన్నికల్లో అవకాశం దక్కని వారికి ఈ కమిటీలో చోటు కల్పించారు. ఈ కమిటీని ఏర్పాటు చేసిన సమయంలోనే జగన్ కొన్ని నిర్దేశాలు చెప్పారు. పార్టీకి సరైన దిశగా సలహాలు ఇవ్వాలని.. సూచనలు చేయాలని ఆయన పేర్కొన్నారు.
కానీ, అనుకున్న విధంగా పీఏసీ నాయకులు ఎవరూ స్పందించడం లేదు. జగన్ ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా పీఏసీలోని నాయకులు వ్యవహరిస్తున్నారన్న వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో చేపట్టే కార్యక్రమాలకు పెద్దగా మైలేజీ రావడం లేదని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ పీఏసీపై కినుక వహిస్తున్నారని సమాచారం. పనిచేయకపోతే.. పీఏసీని మారుస్తారంటూ.. ఇటీవల సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
తాజాగా పీఏసీ కార్యాచరణ, పనులు, పార్టీలో యాక్టివ్ రోల్ వంటివాటిపై జగన్ ఆరా తీశారు. దీనిలో ఎక్కువ మంది పీఏసీ నాయకులు మౌనంగా ఉంటున్నారని.. ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలకు.. కౌంటర్లు ఇవ్వలేక పోతున్నారని తెలిసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్.. పీఏసీ కమిటీ సభ్యుల వివరాలను మరోసారి తీసుకున్నారు. దీనిలో ఉన్న కొందరు నాయకులు పార్టీకి పెద్దగా ప్రయోజనం లేకుండా పోయారని అంటున్నారు.
అయితే.. పీఏసీలో ఉన్న నాయకుల నుంచి మరో వాదన వినిపిస్తోంది. తమను కనీసంపట్టించుకునే వారు లేరని వారు చెబుతున్నారు. తాము సూచనలు, సలహాలు ఇచ్చినా.. ఎవరూ ఆచరించడం లేదని.. తీసేసిన తహసీల్దార్ మాదిరిగా తమ పరిస్థితి మారిపోయిందని వాపోతున్నారు. తాము కూడా యాక్టివ్ రోల్ పోషిస్తున్నామని.. కానీ, తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని అంటున్నారు. జగన్ తమను పిలిస్తే.. జాబితానే వెల్లడిస్తామని చెబుతున్నారు. సో.. మొత్తంగా పీఏసీ వ్యవహారం వైసీపీలో పెను సంచలనంగా మారింది.
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…
ఏపీలో కూటమిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గత రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెదవి విప్పి.. కూటమి ప్రభుత్వం సాధించిన…
ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా క్రిస్టోఫర్ నోలన్ పేరు చెప్పేస్తారు ఆడియన్స్.…
అనుకున్నట్టే ఫౌజీ విడుదల తేదీ డిసెంబర్ 3 లాకైపోయింది. ఇది రెండు వారాల క్రితమే లీకైన న్యూస్ అయినప్పటికీ ఫైనల్…
ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ కున్న క్రేజ్ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో లేదన్న మాటే కానీ పదిహేను సంవత్సరాల క్రితం ప్రసాద్ మల్టీప్లెక్స్…
భారతదేశానికి గర్వకారణమైన ఇస్రో లో ఇప్పుడు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా తమ ఉద్యోగాలకు…